breaking news
Christies Geneva
-
174 కోట్లకు రిస్ట్ వాచ్ వేలం!
న్యూఢిల్లీ : ‘పాటక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ చిమ్’గా వ్యవహరించే అత్యంత క్లిష్టమైన, ఖరీదైన చేతి గడియారాన్ని ‘క్రిష్టీ’ వేలం వేయగా ఓ ప్రైవేటు బిడ్డర్ ఏకంగా 24.2 మిలియన్ డాలర్ల (దాదాపు 174 కోట్ల రూపాయలు)కు కొనుగోలు చేశారు. జెనీవాలోని డెస్ బెర్గూస్ నగరంలోని ఫోర్ సీజన్ హోటల్ నుంచి ఓ ప్రైవేట్ బిడ్డర్ దీనిని కొనుగోలు చేశారు. వాస్తవానికి దీనికి రెండు మిలియన్ పౌండ్ల ధర పలక వచ్చని వేలం నిర్వాహకులు అంచనా వేశారు. ఎవరి ఊహలకు అందనంతగా ధర పలకడం ఆశ్చర్యమని, ప్రపంచంలోనే ఇప్పటి వరకు గడియారాల వేలంలో ఇంత ధర పలకడం ఇదే మొదటి సారని, ఇది ప్రపంచ రికార్డని వారు వ్యాఖ్యానించారు. 2017లో హాలివుడ్ నటుడు పాల్ న్యూమన్ తన డెటోనా చేతి గడియారాన్ని వేలం వేయగం 13.5 మిలియన్ పౌండ్లకు (దాదాపు 124 కోట్ల రూపాయలు) అమ్ముడు పోయింది. అప్పటికి అదే ప్రపంచ రికార్డు. ఈ పాటక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ గడియారాన్ని తయారు చేయడం చాలా సంక్లిష్టమట. ఇందులో మరో విశేషముంది. దీని డయల్ స్క్రీన్ను నలుపులోకి గులాబీ రంగులోకి ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఈ గడియారం వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బులను చారిటీకే వెళతాయని జెనీవాలోని క్రిష్టీ వేలం సంస్థ యజమాని సబైన్ కెగెల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డీఎండీగా పిలిచే మజిల్ డిజార్డర్తో బాధ పడుతున్న రోగులకు వైద్య చికిత్సలు అందించడం కోసం పాటక్ ఫిలిప్పీ సహా 50 ఖరీదైన గడియారాలు వేలానికి వచ్చాయని, వాటన్నింటిని దాతలు ఉచితంగా ఇచ్చారని, తాము కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే వేలం వేశామని సబైన్ కెగెల్ వివరించారు. 174 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బిడ్డర్ వివరాలను తెలియజేయడానికి క్రిస్టీ నిర్వాహకులు నిరాకరించారు. -
వెలుగుల వజ్రం
మీరిక్కడ ఫొటోలో చూస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్దదైన నీలం రంగు వజ్రం. అత్యంత ప్రకాశవంతమైన ఈ వజ్రం బరువు 13.22 క్యారెట్లు. దీన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వచ్చే నెల స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరానికి వెళ్లాల్సిందే. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీస్ జెనీవాలో త్వరలో ఈ వజ్రాన్ని వేలం వేయనుంది. వేలంపాటలో ఈ డైమండ్ దాదాపు రూ.152 కోట్ల భారీ ధర పలకొచ్చని వేలంపాట నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.