-
నారాయణరెడ్డి హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
పత్తికొండ టౌన్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండకు వచ్చిన సీఎం చంద్రబాబు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో కేఈ శ్యాంబాబుకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హత్యకేసుతో టీడీపీ నాయకులకు సంబంధం లేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, కేఈ శ్యాంబాబు ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పసుపు–కుంకుమ ఇచ్చినందుకు ఆడపడుచులందరూ తమకే ఓట్లు వేయాలని అడుగుతున్న చంద్రబాబు, జిల్లాలో వందలాదిమంది మహిళల పసుపుకుంకుమలు పోవడానికి కారకులైన కోట్ల, కేఈ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణరెడ్డి హత్యకేసు నిందితులను పక్కనే పెట్టుకుని, నీతిమాటలు వల్లెవేయడం బాబుకే చెల్లిందన్నారు. అధికారం కోసం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
జంట హత్య కేసు: కేఈ శ్యాంబాబు అరెస్ట్కు ఆదేశాలు
-
కేఈ శ్యాంబాబు అరెస్ట్కు ఆదేశాలు
కర్నూలు జిల్లా: జంట హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్ఐ నాగ తులసీ ప్రసాద్లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్లను అరెస్ట్ చేయాలంటూ అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీచేసింది. అనంతరం కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్లు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
నిజాయితీకి మారుపేరు చెరుకులపాడు
వెల్దుర్తి: నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అలాగే స్నేహశీలి, ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనతో తన అనుబంధాన్ని తెలియబరిచారు. సోమవారం మండలంలోని చెరుకులపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబటితో పాటు అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర పార్టీ నేత శ్రీధరరెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరువెంకటరెడ్డి,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డికి ఘన నివాళులర్పించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని అభినందించారు. అనంతరం నారాయణరెడ్డి సతీమణి, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, నారాయణరెడ్డి సోదరుడు, పార్టీ నేత ప్రదీప్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ నారాయణరెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చేసి ఓర్వలేక.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాబోవు ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఓటమి తప్పదని భావించే కుమారుడి ద్వారా హత్య చేయించారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయన్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసు, నిఘా సంస్థలు చంద్రబాబు సొంత సంస్థల్లా పనిచేస్తున్నాయని ఆరోపించారు. పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రికి, హత్యా రాజకీయాలు పెంచి పోషిస్తున్న డిప్యూటీ సీఎంకు.. వారు కాని, వారు కుమారులు కాని, టీడీపీకి చెందిన ఎవరైనా రాబోవు రోజుల్లో డిపాజిట్లు కూడా లేకుండా ‘ఫ్యాను’ గాలికి కొట్టుకుపోతారన్నారు. జలదీక్ష సందర్భంగా జిల్లాకు వచ్చిన తనకు నారాయణరెడ్డితో ఏర్పడిన అనుబంధం, అనురాగాన్ని అంబటి గుర్తు చేసుకున్నారు. నారాయణరెడ్డి కుటుంబానికి, కార్యకర్తలకు పార్టీ చేదోడుగా ఉంటుందన్నారు. తమ నాయకుడి హత్య జరిగినా చెక్కుచెదరకుండా ఆయన కుటుంబానికి ఆసరాగా ఉన్న వేలాది మంది కార్యకర్తల మనోధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. టీడీపీ నాయకుల వల్లే హత్యలు, దోపిడీలు, అధికారులపై దాడులు, రాజధాని పేరుతో అవినీతి, పోలవరంలో అక్రమాలు, ప్రమాదాలు పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై దొంగ దీక్షలు చేస్తున్నారని, ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు తెరదించేలా పత్తకొండలో డిప్యూటీ సీఎంకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజలకుందన్నారు. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీల పార్టీగా చెప్పుకునే నేటి డూప్లికేట్ టీడీపీ ఆ వర్గాలకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. బీసీలకు ఎవరైనా మేలు చేశారు అంటే అది కేవలం ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా బీసీలతో పాటు అన్ని సామాజికవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబీకులే పదవులు ఏలుతున్నారు గానీ ఇతరులకు అవకాశాలిచ్చిందేమీలేదన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మొట్టమొదటగా ప్రకటించిన పార్టీ అభ్యర్థి కంగాటి శ్రీదేవినేనని, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకుని ఈ సీటును జగనన్నకు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కంగాటి శ్రీదేవిని గెలిపించుకోవడం ద్వారా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి ఆశయాలను సాధించుకుందామన్నారు. హత్యా రాజకీయాలకు బెదిరేది లేదని చాటి చెబుదామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంత ఖాయమో, పత్తికొండలో కంగాటి శ్రీదేవి గెలవడం కూడా అంతే ఖాయమన్నారు. కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ హత్యలు, అక్రమాలు, ఇతరులు పదవులు అనుభవించరాదనే నీచమైన ఆలోచనలు కేఈ కుటుంబానివని దుయ్యబట్టారు. తన భర్త నారాయణరెడ్డిని కేఈ కుటుంబం హత్య చేయించి తమ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూసిందని, అయితే..అది సాధ్యం కాలేదని అన్నారు. కార్యకర్తల అండతో నారాయణరెడ్డి ఆశయాలను సాధిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత చెరుకులపాడు ప్రదీప్రెడ్డి, జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు, కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేఈ శ్యాంబాబు నిందితుడే
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుతోపాటు టీడీపీకి చెందిన ఆస్పరి మండల జెడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్ది ఎస్ఐ నాగతులసీ ప్రసాద్లను డోన్ కోర్టు నిందితులుగా పేర్కొంది. ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘‘నారాయణరెడ్డి హత్య ఘటనలో కేఈ శ్యాంబాబు, బొజ్జమ్మ, నాగతులసీ ప్రసాద్ల పాత్రపై ఆధారాలను బట్టి కచ్చితంగా కోర్టు విచారణ జరపాల్సిందే. అందువల్లే ఐపీసీ సెక్షన్ 147, 148, 149 (గుంపుగా మారణాయుధాలతో తిరగడం), 302(హత్య), 109(తప్పు చేసేందుకు సహకరించడం), మారణాయుధాల చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 120(బీ)(కుట్ర చేయడం) కింద వీరిపై కేసులు నమోదు చేయాలి. ఇందుకు అనుగుణంగా ఈ ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాం. తదుపరి విచారణను మార్చి 1వ తేదీన చేపడతాం’’అని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement