chennai express train
-
చెన్నై ఎక్స్ప్రెస్లో 42 తులాల బంగారం చోరీ
సికింద్రాబాద్: చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు చెందిన 42 తులాల బంగారు ఆభరణాల బ్యాగు గురువారం చోరీకి గురైంది. రైలు నల్లగొండ దాటాక గుర్తించిన బాధితుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నివాసం ఉంటున్న రమాకాంత్ తన భార్యతో కలసి చెన్నై నుంచి రైలులో సికింద్రాబాద్ బయలుదేరాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక భార్యభర్తలు ఇద్దరు రైలులో నిద్రపోతున్న సమయంలో లగేజీ బ్యాగు మాయమైంది. తెల్లవారుజామున ఈ విషయాన్ని గుర్తించిన రమాకాంత్ సికింద్రాబాద్లో పోలీసులను ఆశ్రయించాడు. నల్లగొండ ప్రాంతంలో బ్యాగును దొంగిలించిన ఆగంతకులు అందులోని ఆభరణాలు తీసుకుని బ్యాగును రైల్వేస్టేషన్ ప్రాంతంలో పడేసినట్లు జీఆర్పీ పోలీసులు గుర్తించారు. అందులో లభించిన చిరునామా ఆధారంగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నల్లగొండకు బదిలీ చేశారు. -
చెన్నై ఎక్స్ప్రెస్లో పొగలు
సింగరాయకొండ (ప్రకాశం): చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతోన్న చెన్నై ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బోగీల నిండా పొగలు వ్యాపించాయి. దీంతో రైలును ప్రకాశం జిల్లా సింగరాయకొండ స్టేషన్ లో అర్ధాంతరంగా నిలిపివేశారు. అగ్నిప్రమాదానికి కారణం షార్ట్సర్క్యూట్ అని తేలింది. కావలి స్టేషన్ దాటిన తర్వాత ఎస్ 9 బోగీ నుంచి పొగలు రావడాన్ని గమనించిన గార్డు..మంటలు మరిన్ని బోగీలకు వ్యాపించకుండా తర్వాతి స్టేషన్ అయిన సింగరాయకొండలో నిలిపివేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. ఆ తరువాత కొద్దిసేపటికి రైలు గమ్యస్థానం హైదరాబాద్ వైపు బయలుదేరింది.