breaking news
Cheeks
-
స్టేజిపై మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ
కోల్కతా: త్వరలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోన్న బీజేపీని దీదీ మమతా బెనర్జీ ఒక్కతే ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో తన పార్టీ తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థులందరి తరఫున ఆమె ప్రచారం చేస్తూ.. పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. మరో పక్క టీఎంసీ నాయకులు బహిరంగంగా సిగ్గు మాలిన పనులు చేస్తూ దీదీని ఇరుకున పెడుతున్నారు. తాజాగా టీఎంసీ ఎంపీ బిత్తిరి చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. బీజేపీ లోక్సభ ఎంపీ లాకెట్ చట్టర్జీ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘‘టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరి కొందరు నాయకులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు. వీరితో పాటు బాన్కురా మహిళా ఎమ్మెల్యే కూడా ఈ ప్రెస్ మీట్కు హాజరయ్యారు. ఇక మీడియా సమక్షంలోనే అందరూ చూస్తుండగా కళ్యాణ్ బెనర్జీ సదరు మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సదరు మహిళా ఎమ్మెల్యేకు టీఎంసీ ఈ సారి టికెట్ ఇవ్వలేదు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బీజేపీ.. ‘‘టీఎంసీ నేతల నీచ బుద్ధులకు ఈ వీడియో నిదర్శనం. గద్దె దించడమే వీరికి సరైన శిక్ష’’ అంటూ విమర్శిస్తోంది. ఈ వీడియోపై టీఎంసీ ఇంతవరకు స్పందించలేదు. చదవండి: తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే.. TMC empowering women...? This is TMC MP Kalyan Banerjee and the woman is outgoing Bankura MLA who was miffed for not getting a ticket. Shame! pic.twitter.com/JUXsZerN6i — Locket Chatterjee (@me_locket) March 9, 2021 -
బుగ్గలు గిల్లితే లైంగిక వేధింపులు కావు
ముంబై: మనసులో చెడు ఉద్దేశాలు లేకుండా మైనర్ బాలిక బుగ్గలు గిల్లితే అది నేరం కాదని ముంబైలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఒక బాలిక బుగ్గల్ని మాటిమాటికి తడిమిన 28 ఏళ్ల వయసున్న ఎలక్ట్రీషియన్ను కేసు నుంచి విముక్తుడిని చేసింది. అయితే అదే సమయంలో ఆ బాలిక తల్లిపై చేసిన అత్యాచార యత్నం కేసులో నేరస్తుడిగా తీర్పు చెప్పి అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే..? 2017, జూన్2న జరిగిన ఈ ఘటనలో మధ్యాహ్నం పూట తల్లీ, కూతుళ్లిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో రిఫ్రిజిరేటర్ బాగు చేయడానికి ఒక ఎలక్ట్రీషియన్ వాళ్లింటికి వచ్చాడు. ఫ్రిజ్ని పరీక్షించి చూసిన అతను స్పేర్ పార్ట్ వెయ్యాలని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఆ కూతురి బుగ్గలు గిల్లాడు. దీంతో తల్లి ఎలక్ట్రీషియన్ని గట్టిగా మందలించి తన కూతురి ఒంటిపై చెయ్యి వెయ్యొద్దని హెచ్చరించింది. ఇంతలో వంటగదిలో ఏదో పని ఉందని లోపలికి వెళ్లిన ఆ మహిళను వెనక నుంచి వచ్చి అతను కౌగిలించుకున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేసి ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ మళ్లీ ఆమె కుమార్తె బుగ్గలు గిల్లాడు. దీంతో ఆమె ఆ ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సంస్థకి, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కోర్టు ఏమందంటే.. : ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఆ మహిళ చెప్పిందంతా విని బాలిక బుగ్గలు గిల్లడం పోక్సో చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. మనసులో శృంగారపరమైన వాంఛలు లేకుండా బుగ్గ గిల్లితే దానిని నేరం కింద చూడలేమని పేర్కొంది. మరోవైపు ఆ మహిళపై అత్యాచార యత్నం చేసినందుకు నిందితుడైన ఎలక్ట్రీషియన్కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలి కాలంలో రకరకాల లైంగిక వేధింపులు పోక్సో చట్టం కింద నేరం కావంటూ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. -
బుగ్గలు గిల్లడం నేరం కాదు: పోక్సో కోర్టు
ముంబై: పోక్సో (‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎటువంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ పిల్లల చెంపను తాకడం నేరం కాదని తెలిపింది. బుగ్గలు గిల్లుతూ 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న 28 ఏళ్ల టెక్నీషియన్ను మంగళవారం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కేసు ఏంటంటే.. చిన్నారి తల్లి చెప్పిన దాని ప్రకారం.. ఫ్రిజ్ పనిచేయడం లేదనే కంప్లైంట్ మేరకు నిందితుడు 2017లో బాధితురాలి ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చి ఫ్రిజ్ని చెక్ చేసి.. అవసరమైన స్పేర్ పార్ట్స్ తీసుకురావడం కోసం బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక ఇంట్లో ఉన్న ఐదేళ్ల చిన్నారి బుగ్గలు గిల్లాడు. దీన్ని అభ్యంతరకరంగా భావించిన తల్లి అతడిని వారించి కిచెన్లోకి వెళ్లింది. ఇక ఆమె వంట గదిలో పనిలో ఉండగా.. టెక్నిషియన్ వచ్చి.. ఆమెని వెనక నుంచి కౌగిలించుకున్నాడు. భయంతో బిగుసుకుపోయిన సదరు మహిళ అతడిని పక్కకు తోసి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అతడు వదలలేదు. దాంతో ఆమె సూపర్వైజర్ని పిలిచింది. అతడు వచ్చి టెక్నిషియన్ని బటయకు గెంటే ప్రయత్నం చేశాడు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సదరు టెక్నిషియన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మహిళ ఫిర్యాదు మేరకు టెక్నిషియన్పై కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు అతడికి లైంగిక వేధింపుల నేరం కింద ఏడాది జైలు శిక్ష విధించింది. కొద్ది రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే చిన్నారిపై లైంగిక వేధింపులు ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. దురుద్దేశం లేకుండా చిన్నారి బుగ్గలు గిల్లడం నేరం కాదని వెల్లడించింది. "నిందితుడిపై ఆరోపణల నేపథ్యంలో సహేతుకమైన అనుమానాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్దే. ఇక చిన్నారి తల్లి సాక్ష్యాలను పరిశీలిస్తే, నిందితుడి బహిరంగ చర్యలు బాధితురాలిపై లైంగిక వేధింపులు, ఆమె గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని నిరూపించలేకపోతున్నాయి’’ అని కోర్టు అభిప్రాయపడింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కాక కొద్ది రోజుల క్రితం నాగ్పూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా పోక్సో చట్టం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు చదవండి: మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్ -
చిన్నారుల బుగ్గల్ని గిల్లడానికి కారణమిదే!
లాస్ఏంజెలిస్: పిల్లలను చూడగానే చాలామంది ముద్దుగా వాళ్ల బుగ్గలను గిల్లేస్తారు. కుక్కపిల్లలు కనిపిస్తే ఇంకొందరు తమ సంతోషాన్ని ఆపుకోలేరు. ఇలాంటి ప్రవర్తనకు మనుషుల మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ ప్రాంతంలో కలిగే స్పందనలే కారణమని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ కేథరిన్ మాట్లాడుతూ.. ‘ముద్దులొలికే చిన్నారులు, బుజ్జి కుక్కపిల్లలు వంటివారిని చూసినప్పుడు మెదడులో కలిగే ఎలక్ట్రికల్ స్పందనల నమోదుకు ఎలక్ట్రోఫిజియాలజీ అనే పద్ధతిని ఉపయోగించాం. పరిశోధనలో భాగంగా 18–40 సంవత్సరాల వయస్సు ఉన్న 54 మందికి తలలకు ఎలక్ట్రోడ్స్ అమర్చి వేర్వేరు చిత్రాలను చూపించాం. మిగతా చిత్రాలతో పోల్చుకుంటే ముద్దులొలికే చిన్నారులు, కుక్క పిల్లల చిత్రాలను చూసినప్పుడు వీరి మెదడులోని రివార్డ్ సిస్టమ్ ప్రాంతంలో ఉద్దీపనల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివల్లే చిన్నారులను చూసినప్పుడు వెంటనే వారి బుగ్గలను గిల్లాలని అనిపిస్తుంది’ అని వెల్లడించారు. ఈ పరిశోధన ‘ఫ్రాంటియర్స్ ఇన్ బిహేవియరల్ న్యూరోసైన్స్’ జర్నల్లో ప్రచురితమైంది. -
కట్టె గానుగ నూనె.. తాటి బెల్లం!
జాతిపిత గాంధీజీ పుట్టి నేటికి 150 ఏళ్లు. గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న గాంధీజీ.. ఆ కల సాకారానికి ఆరోగ్యదాయకమైన మన సంప్రదాయక ఆహార సంస్కృతి పరిరక్షణపై దృష్టిసారించారు. కట్టె గానుగలతో స్వచ్ఛమైన నూనెలు, తాటి బెల్లం వంటి ఆరోగ్యదాయకమైన దేశీ ఆహార పదార్థాలతోనే ప్రజల ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని నమ్మి.. ఆ దిశగా సమాజాన్ని నడిపించారు. అయితే, కాలక్రమంలో ప్రపంచీకరణ పుణ్యాన ఇవి మరుగున పడిపోవడం.. ఫలితంగా అనేక జబ్బులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలు, చెక్క గానుగ వంట నూనెలు, తాటి బెల్లం వంటి మన సంప్రదాయ విశిష్ట ఆహారాల ద్వారానే జబ్బులను జయించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని స్వతంత్ర వైద్యులు, ఆహార శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నూనె గింజలను సాగు చేస్తున్న రైతులు ఇంటి దగ్గరే సొంతంగా చెక్క గానుగలను స్వల్ప పెట్టుబడితోనే ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యదాయకమైన గానుగ నూనెలను ఉత్పత్తి చేసి, మంచి ఆదాయం గడించవచ్చు. గీత కార్మికుల సొసైటీలకు తాటి, ఈత నీరా తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇస్తే.. తమిళనాడు, కర్ణాటకల్లో మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తాటి బెల్లం ఉత్పత్తిని విస్తృతంగా చేపట్టవచ్చు. తద్వారా గ్రామాల్లోనే వేలాది మందికి ఉపాధి లభించడంతోపాటు ప్రజలకు అమృతాహారాన్ని అందించవచ్చు. మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా వాడదగినది, రోగనిరోధక శక్తిని పెంపొందించేది.. తాటి బెల్లమని నిపుణులు సూచిస్తున్నారు! చెక్క గానుగలు, తాటి బెల్లం తయారీ కేంద్రాల ఏర్పాటుకు శిక్షణతోపాటు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందని గాంధీజీ స్ఫూర్తితో నడుస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. మహాత్ముడి బోధనలు నేడు మనకు అందిస్తున్న ఆహార స్వరాజ్య స్ఫూర్తి ఇదే! ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్నకొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగ వంట నూనెల(కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్)కు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో, నగరాలు, పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. వేరుశనగలు, కుసుమలు, నువ్వులు, కొబ్బరిని సాగు చేస్తున్న రైతులు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వీటితో కట్టె గానుగ నూనెలు తీసి అమ్మితే.. ఏడాది పొడవునా మంచి ఆదాయం లభిస్తుంది. కట్టె గానుగలను ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు పొందడానికి అవకాశం ఉంది. సబ్సిడీ రుణాలు పొందడానికి కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ తోడ్పాటును అందిస్తున్నది. హైదరాబాద్లోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ రాష్ట్ర కార్యాలయంలో గ్రామీణ పరిశ్రమల విభాగాధికారి మాడుగుల హరి అందించిన వివరాల ప్రకారం.. రైతులు, రైతు సంఘాలతోపాటు.. రైతులు కానప్పటికీ యువతీ యువకులు కూడా సయితం చెక్క గానుగలను గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. కట్టె గానుగల నిర్వహణకు అవసరమైన సాంకేతిక శిక్షణ అందించడంలో ఖాదీ కమీషన్ తోడ్పడుతుంది. ఇప్పటికీ ఎద్దు గానుగలు నడుస్తున్నాయి.. సంప్రదాయ పద్ధతిలో ఎద్దుతో నడిచే కట్టె గానుగలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించడం వ్యయప్రయాసలతో కూడి ఉన్నదైనప్పటికీ గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటకలలో కొందరు ఈ రంగంలో కృషి చేస్తున్న వారు ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్, మైసూరుకు చెందిన దేశిరి సంస్థ నిర్వాహకులు నవీన్(99458 11771) వంటి వారు కూడా ఎద్దుతో నడిచే కట్టె గానుగలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని, నిర్వహించడంతోపాటు ఇతరులకూ సహాయ సహకారాలను అందిస్తున్నారు. మోటారుతో నడిచే కట్టె గానుగలు ఎద్దులకు బదులు 2 హెచ్. పి.– 3 ఫేజ్ మోటారుతో చిన్న సైజు కట్టె గానుగలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్, వార్థాలోని జమన్లాల్ బజాజ్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గతంలోనే అభివృద్ధి చేశాయి. వీటిని చాలా తక్కువ స్థలంలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ, ఆవాల నుంచి వీటి ద్వారా నూనె గానుగ ఆడవచ్చు. 8 గంటల్లో 100–120 కిలోల నూనె గింజలను ఆడవచ్చు. 6“6 అడుగుల చోటు, ఇద్దరు పనివారు చాలు. ధర రూ. లక్ష వరకు ఉంటుందని హైదరాబాద్లోని ఖాదీ కమీషన్ అధికారులు తెలిపారు. ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలో నెల రోజుల శిక్షణ కట్టె గానుగలను గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పుకోవడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, శిక్షణా సదుపాయాలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ అందిస్తున్నది. నాసిక్(మహారాష్ట్ర)లోని డా. అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో అభ్యర్థులకు నెల రోజుల శిక్షణ ఇస్తారు. వసతి ఉచితం. శిక్షణ, మెస్ చార్జీలు కలిపి ఒకరికి రూ. 6,400 ఖర్చవుతుంది. ప్రయాణ ఖర్చులు అదనం. ఈ నెల రోజుల్లో గానుగ నిర్వహణలో పూర్వానుభవం లేని వారు కూడా పూర్తిగా నేర్చుకోగలుగుతారని ఖాదీ కమిషన్ అధికారులు తెలిపారు. రైతు/రైతు సహకార సంఘాలు/ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు/ మహిళా సహకార సంఘాలు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు/ మైనారిటీలు/ ఎస్సీ, ఎస్టీలు/ ఓబీసీలు లేదా వ్యక్తిగతంగా యువతీ యువకులు సైతం ఎద్దుతో నడిచే/ మోటారుతో నడిచే కట్టెగానుగలు నెలకొల్పుకోవడానికి రూ. 10 లక్షల వరకు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు పొందవచ్చు. ఇందుకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ తోడ్పడుతుంది. రుణం పొందటం ఎలా? కట్టె గానుగలకు రుణం కావాల్సిన వారు ఖాదీ కమిషన్ వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ పరిశీలించి, అర్హుల ధరఖాస్తులను బ్యాంకులకు పంపుతుంది. బ్యాంకులు ధరఖాస్తుదారులను పిలిచి, వారి వివరాలను తెలుసుకొని, సంతృప్తి చెందితే రుణం మంజూరు చేస్తారు. రుణ మంజూరు తర్వాత ధరఖాస్తుదారులకు 10 రోజులపాటు బ్యాంకు/ ఖాదీ కమిషన్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇస్తారు. రుణ మొత్తంలో 10% ధరఖాస్తుదారులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తొలి విడత రుణాన్ని బ్యాంకు మేనేజర్ విడుదల చేస్తారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సబ్సిడీ (మార్జిన్ మనీ) మొత్తం కోసం బ్యాంకు మేనేజర్ ప్రతిపాదన పంపుతారు. ఆ మొత్తం విడుదలై లబ్ధిదారుల ఖాతాలో డిపాజిట్ అవుతుంది. గానుగ సక్రమంగా నడుస్తూ, నెలవారీ కిస్తీలు సజావుగా చెల్లిస్తూ ఉంటే.. 3 ఏళ్ల తర్వాత ఆ సబ్సిడీ మొత్తం మేరకు అప్పు, వడ్డీతో సహా, తగ్గిపోతుంది. 15%– 35% వరకు సబ్సిడీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రుణాలపై సబ్సిడీ గ్రామీణ జనరల్ అభ్యర్థులకు 25%, అర్బన్ (మునిసిపల్ కార్పొరేషన్/మునిసిపాలిటీ/నగరపంచాయతీ) అభ్యర్థులకు 15% సబ్సిడీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఓబీసీ, మైనిరిటీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులకు గ్రామీణులకైతే 35%, అర్బన్వాసులైతే 25% వరకు సబ్సిడీ లభిస్తుంది. తాటి/ఈత బెల్లం తయారీపై చెన్నైలో శిక్షణ తాటి, ఈత చెట్ల నీరా నుంచి తయారు చేసే బెల్లం అత్యంత ఆరోగ్యదాయకమైనదని గాంధీజీ ఆనాడే గుర్తించారు. దేశీ ఆహారం విశిష్టతనెరిగిన డా. ఖాదర్వలి వంటి నిపుణులు ఇప్పుడూ చెబుతూనే ఉన్నారు. తాటి/ఈత చెట్ల నుంచి స్వచ్ఛమైన ఆహార పానీయం నీరాను సేకరించి బెల్లం, పంచదార, పటిక బెల్లం వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. తయారీ పద్ధతులపై చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పామ్గుర్ అండ్ పామ్ ప్రోడక్ట్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నది. తాటి/ఈత ఉత్పత్తులపై పూర్తిస్థాయి శిక్షణ 4 నెలలు. శిక్షణ ఇప్పించడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ సిద్ధంగా ఉంది. చెట్టు నుంచి ఈ ఆహార పానీయాన్ని పులవక ముందు సేకరిస్తే పోషక విలువలతో కూడిన నీరా వస్తుంది. అదే పానీయం పులిస్తే కల్లుగా మారుతుంది. ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కోట్ల సంఖ్యలో తాటి, ఈత చెట్లు ఉన్నాయి. అయితే, వీటి నుంచి ప్రస్తుతం కల్లు మాత్రమే గీస్తున్నారు. ఈ చెట్లన్నీ ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఉంటాయి. తమ పొలంలో ఉన్న తాటి/ఈత చెట్ల నుంచి కూడా రైతులు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొందనిదే నీరా సేకరించుకోవడానికి వీలు లేదు. గీత కార్మిక సొసైటీలకు కల్లు గీతకు లైసెన్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కల్లు వినియోగం నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో లక్షలాది గీత కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో నీరా తీయడానికి ఎక్సైజ్ శాఖ అనుమతి మంజూరు చేస్తే తాటి/ఈత నీరాతో బెల్లం తదితర ఆరోగ్యదాయకమైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. తాటి/ఈత బెల్లానికి షుగర్ను పెంచే లక్షణం ఉండదు. మధుమేహం ఉన్న వారు కూడా ఈ బెల్లాన్ని వినియోగించవచ్చని, దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుందని వైద్యులు చెబుతుండటంతో గీత కార్మికులకు మంచి ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం కోసం కట్టె గానుగలను రక్షించుకోవాలి కట్టె గానుగ నూనె ఎంతో ఆరోగ్యదాయకం. చిన్న వయసులోనే మనుషులు లేనిపోని జబ్బుల పాలవడం, అర్థాయుష్షు.. వంటి విపరిణామాలకు తింటున్న ఆహారం సరైనది కాకపోవడమే కారణం. ఎద్దుతో నడిచే కట్టె గానుగతో తీసిన వంట నూనెలు ఎంతో ఆరోగ్యదాయకం. గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యానికి కట్టె గానుగ నూనె ఒక ప్రతీక. గ్రామంలో పండే నూనె గింజలు, గ్రామంలో చెట్టు నుంచి వచ్చే కట్టె గానుగ, కట్టె గానుగను తయారు చేసే విశిష్ట నైపుణ్యం కలిగిన కళాకారుడి పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుంది. మహాత్ముడి స్ఫూర్తిని బతికించుకోవాలన్న తపనతో 2013 శ్రీరామనవమికి తొలి కట్టె గానుగను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ గానుగల సంఖ్య ఐదుకు పెరిగింది. మా గానుగ చూసి కర్ణాటకలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు 10 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. జన్యుమార్పిడి పత్తి గింజల నూనెను వంటనూనెలతో కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. అటువంటి కల్తీ నూనెల నుంచి మన జాతి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కట్టె గానుగల దేశీ సంస్కతి పరిరక్షణకు అందరం పూనుకోవాలి. కట్టె గానుగ తయారు చేసే కార్పెంటర్లు ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా ఈ విశిష్ట కళను కాపాడుకోవాలి. యూనివర్సిటీలు దీనిపై కోర్సు పెట్టాలి. – విజయరామ్, సేవ్ స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ ఫోన్లు: 040–27654337, 27635867 ఎవరిని సంప్రదించాలి? చెక్క గానుగలు, తాటి/ ఈత బెల్లం తయారీ యూనిట్లు.. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల శుద్ధి యంత్రాల యూనిట్లు.. మామిడి తాండ్ర, పచ్చళ్ల తయారీ, నిమ్మ, అనాస, ఉసిరి, బొప్పాయి, సపోట, అరటి తదితర పండ్లతో తయారు చేసే అనేక ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు, నైపుణ్య శిక్షణలు అందించడానికి ఖాదీ కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర, తెలంగాణవాసులు చెక్క గానుగలు, తాటి/ఈత బెల్లం తయారీ యూనిట్ల ఏర్పాటుపై పూర్తి వివరాలకు.. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ ఆవరణలో గల ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ సంచాలకులు వి. చందూలాల్ లేదా గ్రామీణ పరిశ్రమల అధికారి మాడుగుల హరిని 040–29704463 నంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించచ్చు. www.kvic.org.in -
సిగ్గులతో బుగ్గలు ఎర్రబారే జబ్బు!
మెడి క్షనరీ సాధారణంగా కథలలో నాయకుణ్ణి చూడగానే కథానాయికలకు బుగ్గలు ఎర్రబడతాయి. వాళ్లు సిగ్గుల మొలకలైనప్పుడూ ఇలా బుగ్గలు ఎర్రబడతాయని రచయితలు వర్ణిస్తుంటారు. చెంపలు కెంపులవుతాయని కవులు రాస్తుంటారు. కానీ ఎవరినైనా అపరిచితుణ్ణి చూసినా ఇలా బుగ్గలు ఎర్రబారే జబ్బు ఒకటుంది. సిగ్గులతో బుగ్గలు ఎర్రబారే జబ్బు (బ్లషింగ్ డిజార్డర్) అని అంటుంటారు. వైద్యపరిభాషలో దీన్నే ‘ఇడియోపతిక్ క్రేనియోఫేషియల్ అరిథ్మా’ అంటారు. ఈ జబ్బు ఉన్నవారిలో అప్రయత్నంగానే బుగ్గలు ఎర్రబడతాయి. అపరిచితులను అడ్రసు అడుగుతున్నా, మాట్లాడుతున్నా, ఆఖరుకు షాపులో ఏవైనా వస్తువులు ఉన్నాయా అని వాకబు చేస్తున్నా ఈ లక్షణం కనిపించవచ్చు. ఇది వాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంది. తీవ్రమైన యాంగ్జైటీ వల్ల ఇలా జరుగుతుందని, ఇదొక రుగ్మత అని వైద్యనిపుణులు పేర్కొంటుంటారు. -
ఆరేళ్ల చిన్నారికి వాతలు