-
హైదరాబాద్: చాదర్ ఘాట్ లోని ఓ టైర్ల దుకాణంలో అగ్ని ప్రమాదం
-
మలక్పేట రైలు వంతెన వద్ద ట్రాఫిక్.. ‘మూడో మార్గం’!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్–చాదర్ఘాట్ రహదారి ప్రధానమైనది. ఈ రూట్లో మలక్పేట రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు కారణంగా మారుతోంది. రద్దీ వేలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ ప్రాంతంలో అండర్ పాస్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో సహా ప్రీ–పెయిడ్ బూత్లకు సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే అధికారులకు పంపించారు. ఇది నత్తనడకన నడుస్తోంది. ఇప్పటికీ వీటికి మోక్షం లభించలేదు. మరోపక్క మూసీ వెంట మరో మార్గాన్ని అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన ప్రతిపానలు జీహెచ్ఎంసీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులకు నిత్యం నరకం తప్పట్లేదు. అత్యంత కీలకం దిల్సుఖ్నగర్–చాదర్ఘాట్ రూట్లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలు నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్లో తిరిగే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదర్ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ కారణంగా రద్దీ వేళల్లో అటు చాదర్ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లాలంటేనే వాహన చోదకులు హడలిపోతున్నారు. మలక్పేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు వంతెన అటు–ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్లో నరకం చవి చూడాల్సిందే. ఆ రెండింటి స్ఫూర్తితో ప్రతిపాదనలు... ఇలాంటి అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు నగర వ్యాప్తంగా రైలు వంతెనలు, వాటి కింద నుంచి వెళ్లే రహదారుల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయం, కాలాడేరా ప్రాంతంలో చేపట్టిన చర్యలను పరిగణలోకి తీసుకున్నారు. రైల్ నిలయం వంతెన కింద గతంలో రెండు మార్గాలే ఉండేవి. చాదర్ఘాట్ నుంచి మలక్పేట, చంచల్గూడ వైపు వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాలాడేరా ప్రాంతంలోనూ నాలా వద్ద ఉన్న రైల్ వంతెన ఒకటే ఉండేది. దీంతో ఆ రెండు చోట్లా భారీ ట్రాఫిక్ జామ్స్ తప్పేవి కాదు. ట్రాఫిక్ అధికారుల ప్రతిపాదనలు, రైల్వే విభాగం చొరవ తీసుకోవడంతో రైల్ నిలయం వద్ద మూడో మార్గం, కాలాడేరాలో రెండోది అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహాలో మలక్పేట రైల్ వంతెన వద్ద మూడో మార్గం ఏర్పాటు చేయించాలని అధికారులు 2016లో నిర్ణయించారు. ‘డైనమిక్’గా వాడుకోవచ్చునని... ప్రస్తుతం మలక్పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్ఘాట్ వైపు, మరోటి మలక్పేట్ వైపు వెళ్లే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. మూడో మార్గం అందుబాటులోకి వస్తే దాంతో సహా అన్నింటినీ డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్లో వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రకారం ఓ మార్గాన్ని పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్వేగా చేస్తుంటారు. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు పీక్ అవర్స్లో వన్వేగా ఉన్న మార్గం ఆపై టూ వేగా మారిపోతుంది. తిరిగి సాయం త్రం పీక్ అవర్స్ ప్రారంభమైనప్పునప్పు ఉద యం నడిచిన దిశకు వ్యతిరేకంగా వన్వేగా మారు తుంది. తద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకు నే అవకాశం ఉంటుందని భావించారు. ఈ వన్వేలు, వాటి సమయాలపై పూర్తి స్థాయి ప్రచారం కల్పించడంతో ప్రతి వాహనచోదకుడికీ అవగాహ న కల్పిస్తే ఫలితాలుంటాయని అంచనా వేశారు. మూసీ మార్గాన్ని అన్వేషించినా... మలక్పేటలో మూడో అండర్ పాస్ ఏర్పాటుకు రూ.10 కోట్లు ఖర్చవుతాయని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మొత్తం చెల్లించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) సంస్థ ముందుకు వచ్చింది.ఈ ప్రతిపాదనలు నత్త నడకన సాగుతుండటంతో మూడేళ్లుగా పనులు ప్రారంభం కాలేదు. మరోపక్క మలక్పేట సమీపంలోని మూసీ నది వెంబడి మరో రహదారి అభివృద్ధి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించారు. చాదర్ఘాట్ కాజ్వే దాటిన తర్వాత మూసీ వెంట ప్రస్తుతం ఓ మార్గం ఉంది. ఇది ఓల్డ్ మలక్పేట మీదుగా వెళ్తుంది. అయితే అనేక చోట్ల పూర్తిస్థాయిలో నిర్మాణం లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. మరోపక్క ఈ రూట్ను అభివృద్ధి చేయాలంటే పలు ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న హైటెన్షన్ వైర్లకూ పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది.దీనిని వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకువస్తే చాదర్ఘాట్ నుంచి మలక్పేట వెళ్లాల్సిన అవసరం లేకుండా మూసరామ్బాగ్ సమీపంలోని అంబర్పేట్ కాజ్ వే వరకు ట్రాఫిక్ను మళ్లించవచ్చు. ఫలితంగా ఇరుకుగా ఉన్న మలక్పేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మూసీ రహదారి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి బల్దియాకు పంపాలని భావించారు. వీటికీ మోక్షం కలగకపోవడంతో వాహనచోదకులకు నిత్య నరకం తప్పట్లేదు. -
చాదర్ఘాట్లో చైన్ స్నాచింగ్
గాయపడిన మహిళ.. తప్పిన ప్రమాదం హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్పేటలోని ‘బి’ క్వార్టర్కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం రాత్రి నాంపల్లిలోని ఓ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో నల్లగొండ ఫ్లై ఓవర్ మీదుగా వస్తున్నారు. వారి వెనుకగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చి వర్ధనమ్మ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడు, 12 గ్రాముల గొలుసు తెంపుకొని పారిపోయారు. ఈక్రమంలో వాహనంపై ఉన్న వర్ధనమ్మ కిందపడిపోగా ఆమె భుజానికి, తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను భర్త శ్రీనివాస్ మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా చైన్ స్నాచింగ్ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఉన్నాయని వాటి ఆధారంగా నిందితులను పట్టుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ డా.రవీందర్ పేర్కొన్నారు. -
క్రేన్ను ఢీకొన్న బైక్..ఒకరి మృతి
హైదరాబాద్ : చాదర్ఘాట్ పరిధిలో ద్విచక్రవాహనం వెళ్తున్న వ్యక్తి మెట్రో బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న క్రేన్ను ఢీకొనటంతో అవినాష్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. మెట్రోక్రేన్ అక్కడ ఉన్నట్లు ఎలాంటి సైన్బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత
హైదరాబాద్ : చాదర్ఘాట్లో మూసీనది పరిసరాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు నోటీసులిచ్చినా వినకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. కూల్చివేతలు ప్రారంభించడంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement