breaking news
CEO bhanwarlal
-
ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ
కడప సెవెన్రోడ్స్ : జాతీయ ఓటర్ల జాబితా శుద్ధీకరణ–2016 కార్యక్రమం కింద ఓటర్ల జాబితాలో ఉన్న తçప్పులను నిర్ణీత సమయంలో సరిదిద్దాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ ఆదేశించారు. బుధవారం కొత్త కలెక్టరేట్లో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో సరిహద్దులతో కూడిన పోలింగ్ కేంద్రాల పటాన్ని తయారు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేసిన విధంగా నజర్ నక్ష, మ్యాపింగ్ తదితర అంశాలతో అన్ని మున్సిపాలిటీల పరిధిలోని కమిషనర్లు, సాంకేతిక సిబ్బందికి వర్క్షాప్ నిర్వహించాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించి ఓటర్ల ఫోటోను సరిచూసి డిజటలైజేషన్ చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్కు మ్యాపింగ్ను వచ్చేనెల 5వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిదిలో ఓటర్ల సంఖ్య 1000 నుంచి 1100 లోపు ఉండేలా మ్యాపింగ్ సిద్దం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉండి అక్కడ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకుంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ తయారు చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కాలపరిమితిలోపు ఓటర్ల జాబితా శుద్దీకరణ జరగాలన్నారు. కలెక్టర్ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత కోసం కొత్త కలెక్టరేట్లో గోడౌన్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు, క్లెయిమ్స్, ఆక్షేపణలు ఒక వారం రోజుల్లోపు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో సులోచన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
'ఓటుకు కోట్లుపై ఏసీబీ కేసు పెట్టొచ్చు'
-
ఓటర్ల జాబితాలో ఆధార్ సంఖ్య ముద్రించ వద్దు
సుప్రీం ఆదేశాల నేపధ్యంలో అప్రమత్తం సీఈఓ భన్వర్లాల్ కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితాలు, ఓటరు స్లిప్పులలో ఆధార్ సంఖ్యలు ముద్రించవద్దని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ భన్వర్లాల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలను ఆధార్తో సీడింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితాలను ఫ్యూరిఫై చేయడం కోసమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్, బ్యాంకు ఖాతా, వాహనాల నమోదు, డ్రైవింగ్ లెసైన్స్లు, పెన్షన్లు లాంటి ప్రతి పనిని ఆధార్తో లింకు పెడుతోంది. ప్రభుత్వం నుంచి సేవలు, రాయితీలు పొందడానికి ఆధార్ను తప్పనిసరి చేయకూడదని రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ప్రతి దాన్ని ఆధార్తో లంకె పెడుతోంది. ఈ విషయమై ఇటీవల సుప్రీం కోర్టు మండిపడుతూ తమకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో ఓటర్ల జాబితాల్లో ఆధార్ సంఖ్య ముద్రిస్తే సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడ్డ సీఈఓ వెంటనే మేల్కొని ఆధార్ సంఖ్యలో ముద్రించవద్దంటూ ఇచ్చిన ఆదేశాలు శనివారం కలెక్టరేట్కు వచ్చాయి. అయితే, అధికారుల డేటా బేస్లో మాత్రమే ఓటర్ల పేరు పక్కన వారి ఆధార్ సంఖ్య ఉంటుంది. ఇందువల్ల ఓటింగ్ సమయాల్లో అక్రమాలు జరగకుండా చూడగలుగుతామని అధికారులు అంటున్నారు. ఆధార్ సీడింగ్లో రెండవ స్థానంలో జిల్లా.. ఓటర్ల జాబితాలను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, కడపజిల్లా రెండవస్థానంలో ఉంది. జిల్లాలో 21,71,522 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 20,80,850 (95.8 శాతం) మందికి ఆధార్ సీడింగ్ నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలో వంద శాతం ఆధార్ సీడింగ్ జరిగింది. ఇక బద్వేలులో 99.84 శాతం, కమలాపురంలో 99.79 శాతం, రాజంపేటలో 99.72 శాతం, జమ్మలమడుగులో 99.70 శాతం ఆధార్ సీడింగ్ నిర్వహించారు. వందశాతం ఆధార్సీడింగ్ 34 మండలాల్లో జరిగింది. 99 శాతం కంటే ఎక్కువ ఆధార్ సీడింగ్ జరిగిన మండలాలు 10 ఉండగా, ఆరు మండలాల్లో 90 శాతం కంటే అధికంగా జరిగింది. కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే 72 శాతంతో తక్కువ స్థానంలో ఉంది.