breaking news
centre and states
-
కరోనాపై రాష్ట్రాలతో కేంద్రం సమీక్షా సమావేశం
ఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే హైఅలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో.. నేడు(సోమవారం, మార్చి 27న) రాష్ట్రాలతో కోవిడ్పై సమీక్షా సమావేశం నిర్వహింనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమీక్షలో రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనుంది. కరోనా మరోసారి విజృంభణ దిశగా సంకేతాలు ఇస్తోంది. కొత్త కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కొత్త కేసులు.. రెండు వేల మార్క్ చేరికకు దగ్గరయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పది వేల దాకా చేరుకుంది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో క్రియాశీలక కేసులు ఎక్కువగా కనిపిస్తుండడంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. యూపీలోనూ తాజాగా ఒక్కసారిగా కేసుల్లోపెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించింది. కరోనా కేసులపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లు అప్రమత్తం అయ్యాయి కూడా. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మధ్య నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఒమిక్రాన్ సబ్వేరియెంట్ ఎక్స్బీబీ.1.16 విజృంభణ వల్లే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిబంధనల ప్రకారం చూసుకుంటే వైరస్ విజృంభణ చాలా తక్కువగా ఉందని కేంద్రం అంటోంది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో వైరస్ విజృంభణను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రం ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రాలకు సూచించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఏప్రిల్ 10,11వ తేదీల్లో కరోనాపై నిర్వహించాల్సిన మాక్ డ్రిల్ గురించీ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ హాట్స్పాట్లను గుర్తించి, వైరస్ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది కూడా. ఇక కొవిడ్,ఇన్ఫ్లుయెంజా కేసులు పెరగడం కూడా ప్రజల్లో గందరగోళానికి, లక్షణాలు ఒకేలా ఉండడంతో అయోమయానికి దారి తీస్తోంది. అయితే.. వైరస్ను ఎదుర్కొనేందుకు రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలివెలుతురు సరిగా ఉండేలా చూసుకోవడం లాంటి చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తోంది. వీడియో: ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి సార్! -
‘ఎస్సీ’ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ అయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీస్) దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎమ్మార్పీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఎస్సీల్లో ఎక్కువ జనాభాగా ఉన్నప్పటికీ మాదిగ ఉపకులాలకు తగిన రిజర్వేషన్లు వర్తించడం లేదన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఈ అంశంపై ఇప్పటికే ఈవీ చిన్నయ్య కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే... ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఆలస్యం అవుతోందని, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యంతర పరిష్కారం ఇవ్వాలని కోరారు. అయితే కేసు విచారణ వేగవంతం చేయాలని రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరలేమని, అదే కేసులో ఇంప్లీడ్ కావాలని పిటిషనర్కు సీజేఐ సూచించారు. ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని రోహత్గి తెలపగా స్పందించిన సీజీఐ, ‘‘ఈ తరహా కేసులో విచారణ చేపట్టకుండా ఎవరైనా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారా?’’అని న్యాయవాదిని ప్రశ్నించారు. అనంతరం ‘‘రాజ్యాంగ ధర్మాసనం కేసులో ఇంప్లీడ్ కావడానికి పిటిషనర్కు అనుమతిస్తున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రతివాదులకు నోటీసులు జారీ పూర్తయిన తర్వాత విచారణ జాబితాలో చేర్చాలి’’అని ధర్మాసనం ఆర్డర్లో పేర్కొన్నారు. వర్గీకరణతోనే న్యాయం: మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరు గుతుందని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతున్నామన్నారు. -
Narendra Modi: సహకారంతోనే సంస్కరణలు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం బలంగా ఉండడం వల్లనే కరోనా సమయంలో కీలక సంస్కరణలు, ప్రోత్సాహకాలు తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో అన్నింటికీ ఒకే మంత్రం అనకుండా, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో అవసరానికి తగినట్లు ఆర్థిక విధానాలను రూపొందించడం జరిగిందని వివరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్డిన్పై ‘‘రిఫామ్స్ బై కన్విక్షన్ అండ్ ఇన్సెంటివ్స్’’ పేరిట ఆయన సంస్కరణల గురించి వివరిస్తూ పోస్టు చేశారు. ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత రాష్ట్రాలు గతంలో కన్నా ఎక్కువగా రుణాలు తీసుకోగలిగాయన్నారు. ‘‘2020–21లో రాష్ట్రాలు అదనంగా రూ. 1.06 లక్షల కోట్లను సమీకరించడం ముదావహం. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం వల్లనే సాధ్యమైంది’’అని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలకు విధాన నిర్ణయాల పరంగా కరోనా కొత్త సవాళ్లు విసిరిందని ప్రధాని గుర్తు చేశారు. భారత్ ఇందుకు మినహాయింపు కాదని, ఒకవైపు ప్రజాసంక్షేమం కుంటుపడకుండా మరోవైపు ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా నిధులు సమీకరించడం మనం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలని చెప్పారు. సమాఖ్య వ్యవస్థలో అన్నింటికీ ఒకే సూత్రం వర్తించలేమన్నది గుర్తించి ఆయా రాష్ట్రాల సంస్కరణలను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో విధాన నిర్ణయాలు తీసుకోవడం కూడా సవాలేనన్నారు. అయితే మన సమాఖ్య వ్యవస్థపై ఉన్న నమ్మకంతో, కేంద్రరాష్ట్రాల మధ్య సహకారంతో ముందుకు సాగామని చెప్పారు. రాష్ట్రాలు వాటి స్థూలోత్పత్తి(జీఎస్డీపీ)లో 2 శాతం వరకు రుణాలు సేకరించే అనుమతినిచ్చామని, అయితే కొన్ని సంస్కరణలు అమలు చేస్తేనే ఇందులో ఒక్క శాతానికి అనుమతి లభిస్తుందని వివరించారు. ఈ కారణంగా పలు రాష్ట్రాలు పలు సంస్కరణలు అమలు చేసాయని తెలిపారు. దీనివల్ల వచ్చిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, అలాగే కొందరే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తారన్న అపవాదుకు భిన్నంగా ఫలితాలున్నాయని చెప్పారు. చదవండి: ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట -
నవంబర్ జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నవంబర్ మాసంలో 27వ తేదీ వరకూ రూ 83,346 కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయి. అయితే అక్టోబర్లో జీఎస్టీ వసూళ్ల కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు మొత్తం రూ 95,131 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ కింద ఇప్పటివరకూ 96 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు నమోదుచేసుకోగా, వారిలో 15 లక్షల మంది కాంపోజిషన్ డీలర్లు.. వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే రిటన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మొత్తం కేంద్ర జీఎస్టీ వాటా రూ58,556 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. జీఎస్టీ కింద ఆదాయం కోల్పోయిన రాష్ర్టాలకు పరిహార మొత్తాలను విడుదల చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. -
‘ప్రత్యేక’ పరీక్ష
త్రికాలమ్ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న రంధిలో అనైతికంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అనూహ్యంగా మిత్రపక్షానికి దూరం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదనే సంకేతాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. శుక్రవారంనాడు పార్లమెంటులో దేశీయాంగ సహాయమంత్రి హెచ్పి చౌదరి ఒక ప్రైవేటు బిల్లుపైన చర్చకు సమాధానం చెబుతూ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి ప్రసక్తి లేదని తేల్చిచెప్పడంతో ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల అనుమానాలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైనాయి. 14వ ఆర్థిక కమిషన్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను సిఫార్సు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు సమకూర్చే విషయం నీతిఆయోగ్ పరిశీలనలో ఉన్నదనీ, నీతిఆయోగ్ నివేదిక అందగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ మంత్రి చెప్పారు. ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు, కొండంత ఆశతో నిరీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా ఫలితంగా ఆదాయం పన్నులో, ఎక్సైజ్ సుంకంలో, విద్యుచ్ఛక్తి చార్జీలలో లభించే రాయితీలను దృష్టిలో పెట్టు కొని అనేక కొత్త పరిశ్రమలు వస్తాయనీ, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయనీ లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధ్యక్షుడు చంద్రబాబునాయుడూ, భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ 2014 ఎన్ని కల బహిరంగ సభలలో ప్రత్యేక హోదాపైన సంయుక్తంగా వాగ్దానం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఈ హామీని పొందుపరిచారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అనేక విడతల హామీలు ఇచ్చారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉంటుందంటే అయిదేళ్ళు సరిపోవు పదేళ్ళు కావాలంటూ రాజ్యసభలో పోరాడిన వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా వస్తున్నదనే చెప్పుకుంటూ వచ్చారు. అయిదేళ్ళు అస్సలు సరిపోదు కనీసం పదిహేనేళ్ళయినా ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వచ్చి నిలుస్తాయంటూ చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందూ తర్వాతా మాట్లాడారు. ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేయడం వల్ల చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? ‘రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, ఆర్థిక సహాయం విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది’ అంటూ ముఖ్యమంత్రి నిష్ఠురమాడారు. భాజపా ఎదురుదాడి ముఖ్యమంత్రిపైన ఎదురుదాడి చేయడానికి భాజపా నాయకులు సంకోచిం చడం లేదు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ‘నిధులు ఉదారంగా ఇస్తున్నాం. కానీ ఖర్చుల లెక్కలు చెప్పడం లేదు. కేంద్ర నిధులను వినియోగించే పథకాల పేర్లు మార్చి సొంతడబ్బా కొట్టుకుంటున్నారు’ అన్నారు. రెండు లక్షల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఆ పథకానికి ‘ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రాం’ అని పేరు పెట్టుకున్నారనీ, గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నిధులు పంపిస్తే ఆ కార్యక్రమం పేరును ‘ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు’గా మార్చారనీ భాజపా నాయకుల విమర్శ. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డిని కలుసుకున్నందుకు కేంద్రమంత్రులను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తప్పు పడితే, ‘ప్రతిపక్ష నాయకుడిని కేంద్రమంత్రులు కలుసుకోవడంలో తప్పేముంది?’ అంటూ భాజపా మంత్రి మాణిక్యాలరావు ప్రశ్నించారు. హైదరాబాద్ హైకోర్టు విభజన జరగపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమనీ, ఇందుకు అవసరమైన ప్రాథమిక సదుపా యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కల్పించవలసి ఉన్నదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పార్లమెంటులో చెప్పారు. ‘రాజధానే లేకపోతే హైకోర్టుకు ప్రాథమిక సదుపాయాలు ఎక్కడినుంచి తెస్తాం?’ అంటూ రాష్ట్ర మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలు పరస్పరం నిందించుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదనీ, రెండు పక్షాల మధ్య దూరం పెరుగుతోందనీ ఈ ఉదంతాలు సూచిస్తున్నాయి. మొదటి నుంచీ నరేంద్రమోదీకీ, చంద్రబాబునాయుడికీ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. మోదీ ఏదీ విస్మరించరూ, క్షమించరూ అంటారు. గుజరాత్లో 2002లో మారణహోమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తప్పించాలని పట్టుబట్టిన మిత్రపక్షాలలో తెదేపా ప్రధానమైనది. ఈ మేరకు ఎన్డీఏ సమావేశంలో తీర్మానం రూపొందించడంలో చంద్రబాబునాయుడిది కీలకపాత్ర అంటారు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు మోదీ ప్రచారానికి వస్తారని తెలిసి అప్పటి నగర పోలీసు కమిషనర్ కృష్ణారావు ‘మోదీ హైదరాబాద్లో అడుగుపెడితే అరెస్టు చేస్తాం’ అని ప్రకటించారు. అప్పుడు అడ్వానీ అడ్డుపడకపోతే మోదీ రాజకీయ జీవితం మరో విధంగా ఉండేది. ఇటీవల చంద్రబాబునాయుడు ప్రధానిని కలిసినప్పుడు ‘నాయుడు గారూ మీరు బలమైన ముఖ్యమంత్రి. గట్టి ముఖ్యమంత్రులు తరచుగా ఢిల్లీకి రారు’ అంటూ వ్యాఖ్యానించారట. చంద్రబాబునాయుడికి ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాలే తక్కువ. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రధానిని కలుసుకునే పరిస్థితి లేదు. పైగా అమిత్ర వైఖరి కనిపిస్తోంది. రాష్ట్రంలో భాజపా నాయకులు తెదేపాతో మైత్రీబంధాన్ని ఎంత త్వరగా తెంచుకుంటే అంత మంచిదని తలపోస్తున్నారు. సొంతంగా ఎదగాలని కలలు కంటున్నారు. అందుకే ఇటీవల వారి మాటలలో పదును పెరిగింది. ‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’ ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? భాజపాతో తెగతెంపులు చేసుకోవాలా? ఇద్దరు కేంద్రమంత్రులను ఉపసంహరించుకోవాలా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి శనివారం డిమాండ్ చేసింది కూడా ఇదే. చంద్ర బాబునాయుడు భాజపాకి రాంరాం చెప్పగలరా? అవమానాలను సహిస్తూ మౌనంగా మైత్రీబంధంలో కొనసాగుతారా? చాలా జటిలమైన సమస్య. ‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’ అన్నది ఎమ్జీ రామచంద్రన్ సిద్ధాంతం (డాక్ట్రిన్). అమెరికాలో రొనాల్డ్ రేగన్ లాగానే ఎమ్జీ రామచంద్రన్ కూడా సినిమాలో విజయఢంకా మోగించి రాజకీయాలలోనూ బావుటా ఎగురవేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడి మాదిరిగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూడా నూటికి నూరుపాళ్ళు ఆచరణవాది. భేషజాలు లేవు. పంతాలూ పట్టింపులూ లేవు. ఇందుకు ఎంజీఆర్ తీసుకున్న కీలకమైన రాజకీయ నిర్ణయాలే నిదర్శనం. 1976లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. 1977 మార్చిలో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఎమ్జీ రామచంద్రన్ నాయక త్వంలో అప్పుడే ఏర్పడిన ఆల్ ఇండియా అన్నా డిఎంకె (ఏఐఏడిఎంకె) కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోరాడింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలలోనూ 34 స్థానాలను కాంగ్రెస్-ఏఐఏడిఎంకె గెలుచుకుంది. ఇందులో సగం (17) స్థానాలు ఏఐఏడిఎంకెకి దక్కాయి. దక్షిణాదిన గెలుపొం దిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో ఘోర పరాజయం చెందింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంటనే ఎంజీఆర్ జనతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు జరిగిన రెండు మాసాలకే, 1977 జూన్లో, తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్తో పొత్తుకు స్వస్తి చెప్పి ఏఐఏడిఎంకె ఒంట రిగా పోరాడి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఆ విధంగా ఎంజీఆర్ మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రతీకారం తీర్చుకున్నారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎంజీఆర్ విరోధి కరుణానిధితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. అయినా సరే, ఎంజీఆర్ ఒంటరిగా పోరాడి విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి విధేయత ప్రకటించారు. కాంగ్రెస్-ఏఐఏడిఎంకెల బంధం 1987లో ఎంజీఆర్ మర ణించేవరకూ కొనసాగింది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రంతో సున్నం వేసుకోవడంలో అర్థం లేదని ఎంజీఆర్ అభిప్రాయం. కేంద్రంతో సఖ్యంగా ఉంటే తమిళనాడులో తన పాలనకు అంతరాయం రాకుండా చూసుకోవచ్చు. కేంద్రం నుంచి నిధులు ఉదారంగా లభిస్తాయి. కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే ఏదో ఒక మిషతో అస్థిరత సృష్టించవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించవచ్చు. బొమ్మైకేసుతో మలుపు 1994లో బొమ్మైకేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగపీఠం తీర్పు ఇచ్చిన తర్వాత 360వ అధికరణను విచ్చలవిడిగా వినియోగించి రాష్ట్రపతి పాలన విధించడం తగ్గింది. 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం రావడానికి పూర్వం ‘ఆయారాం గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది. 1980లో ఇందిరాగాంధీ పునరాగమనంతో రాష్ట్రాలలోని జనతా ప్రభుత్వాలకు కాలంచెల్లింది. ఆ సమయంలోనే హర్యానాలో భజన్లాల్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ‘తెలివిగా’ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారింది- అచ్చం మొన్న అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ భాజపా సర్కార్గా మారినట్టు. భజన్లాల్ మెజారిటీ జనతా శాసన సభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొన సాగారు. ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్, అనంతరం కర్ణాటక కాషాయ ఛత్రం కిందికి రావలసిందేనంటూ భాజపా పార్లమెంటు సభ్యుడు కైలాష్ విజయవర్గియా జోస్యం చెప్పారు. మోదీ తలచుకుంటే తెదేపా శాసనసభా పక్షాన్ని చీల్చడం ఏ మాత్రం కష్టం కాదు. చంద్రబాబునాయుడి కంటే నరేంద్ర మోదీ దగ్గర వనరులు అధికంగా ఉంటాయి. ఓటుకు కోట్ల కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించవచ్చు. అవినీతి ఆరోపణలపైనా విచారణ చేయించవచ్చు. కేంద్రం తలచుకుంటే ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు. నానాతిప్పలు పడుతున్నవారిని చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఊహాజనితంగా కనిపించ వచ్చును. ఒకసారి తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకొని, కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులనూ ఉపసంహరించుకొని, ప్రధానమంత్రినీ, కేంద్రప్రభు త్వాన్నీ విమర్శించడం ప్రారంభిస్తే కేంద్రం కాక చంద్రబాబునాయుడికి తగులు తుంది. దోషాలను వెతకడం ప్రారంభిస్తే దొరికిపోవడం ఖాయమని ముఖ్య మంత్రికీ తెలుసు. అందుకనే సాధ్యమైనంత వరకూ భాజపాను పట్టుకొని వేళ్ళా డటానికే చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తారు. ప్రత్యేక హోదా అంటే సర్వస్వం కాదంటూ, హోదా వచ్చినంత మాత్రాన అంతా స్వర్గధామం కాబో దంటూ, అదే సంజీవని అనుకోవద్దంటూ సన్నాయినొక్కులు నొక్కడం అందుకే. ప్రత్యేక హోదా లేకపోవడమే మంచిదనే విధంగా ప్రచారం చేయించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యంలేదు. మొదటి నుంచీ ప్రచారంతోనే జయ ప్రదంగా కొట్టుకొస్తున్నారు. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా, తనకు అనుకూలంగా అసత్య ప్రచారం చేయించి లబ్ధి పొందడం రాజకీయ ఎత్తుగడలలో భాగమేననీ, తప్పు లేదనీ తెదేపా అధినేత విశ్వాసం. ఇదీ చాణక్యమేనని నమ్మకం. తెదేపా సంగతి సరే. ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజలు ఏమి చేయాలి? ఎటువంటి ఉద్యమం నిర్మించాలన్నది వారి ఎదుట నిలిచిన ప్రశ్న. వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి కార్మికవ్యతిరేక విధానాలు
-టీఏకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బంటుశ్రీనివాస్, నర్సాగౌడ్ మెదక్ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీఎకేఎస్)రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బంటు శ్రీనివాస్, నర్సాగౌడ్లు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో టీఏకెఎస్ మెదక్ జిల్లా మొదటి మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక నిర్ణయాల వల్ల లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారని వాపోయారు. కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. హామీలు నెరవేర్చే వరకు సమర శీల పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులకనుగుణంగా ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మారుస్తున్నాయని ఆరోపించారు. అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కరువై, ఈఎస్ఐ, పిఎఫ్ లేకపోవడంతో నానా పాట్లు పడుతున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుంటామన్న తెలంగాణ ఎన్నికలు ముగిసి పోయి ఉన్న కార్మికులను సైతం తొలగిస్తున్నారని వాపోయారు. రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.