-
చెప్పం.. చేసి చూపిస్తాం!
సాక్షి, కామారెడ్డి : ప్రజల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి త్యాగం చేసిన వ్యక్తికి.. డబ్బు, అవినీతిపరుల మధ్య కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ జరుగుతోందని, త్యాగం చేసిన వారినే గెలిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. తాము అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పమని, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం కామారెడ్డి బీఎల్ఎఫ్ అభ్యర్థి డాక్టర్ పుట్ట మల్లికార్జున్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన వీక్లీ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గంజ్లో గాంధీ విగ్రహం సాక్షిగా పరువు తీసుకుని బజారు పాలైన వ్యక్తులకు ఓటు వేయవద్దని, నిజాయతీపరుడైన బీఎల్ఎఫ్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఓట్లు మనవి రూ.కోట్లు వాళ్లవి అని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం ఒక్క సారి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. కామారెడ్డిలో 54 వేల మంది బీడీ కార్మికులుంటే వారి సంక్షేమ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఆలోచించాయా? అని ప్రశ్నించారు. ఇక్కడ బీడీ కార్మికులకు ఇళ్ల కట్టించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని, భూ కబ్జాదారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కాంట్రాక్టర్లనే పట్టించుకున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో టీఆర్ఎస్, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రత్యామ్నాయం గా బీఎల్ఎఫ్కు ఓటువేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తాం బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తామని రాఘవులు తెలిపారు. 30 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, తొమ్మిదేళ్ల టీడీపీ, నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం వెనకబడిందన్నారు. అంతేకాక నాయకులు రంగులు మారుస్తున్నారే తప్ప రాష్ట్రం, ప్రజల తలరాతను మార్చడం లేదని.. అందుకోసం బీఎల్ఎఫ్ పోటీలోకి వచ్చిందన్నారు. అవకాశం ఇస్తే రాష్ట్రాన్నే మార్చి చూపుతామన్నారు. అనంతరం వీక్లీ మార్కెట్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి పుట్ట మల్లికార్జున్ నామినేషన్కు భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషనల్ పత్రాలు అందజేశారు. పోలీసులతో వాగ్వాదం నామినేషన్ వేయడానికి కార్యాలయానికి వెళ్తుండగా, పోలీసులు రాఘవులును, ఎంసీపీఐయూ జాతీయ కార్యదర్శి గౌస్, అభ్యర్థి మల్లికార్జున్ తదితరులను అడ్డుకున్నారు. మెడలో వేసుకున్న పార్టీల కండువాలు తీసేసి, లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో రాఘవులు 15 నిమిషాల పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ఎర్రరంగు చొక్కాలను వేసుకుని వస్తే, వాటిని కూడా విప్పించేస్తారా? అని పోలీసులపై అగ్రహం వ్యక్తం చేశారు. తాను 6 నియోజవర్గాలలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఎక్కడా అడ్డుకోలేదని, ఇక్కడ మాత్రం ఏమిటని ప్రశ్నించారు. నిన్న, మొన్న ఇతర పార్టీల వారు కండువాలతో వెళితే పట్టించుకోలేదని, తమను మాత్రం అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. ఏ చట్టం ప్రకారం లోనికి పంపించరో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారితో చెప్పించాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత కామారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అక్కడ ఉన్న సీఐ ఫోన్ చేసి, రాఘవులుతో మాట్లాడించారు. దీంతో బీఎల్ఎఫ్ నేతలు మెడలోని కండువాలను తీసి, నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్లారు. -
గ్యాస్, పింఛన్ల పంపిణీని పరిశీలించిన కేంద్ర బృందం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పంపిణీ విధానాలను కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. కొండపల్లిలోని శ్రీలక్ష్మీబాలాజీ గ్యాస్ ఏజెన్సీస్ ద్వారా వినియోగదారులకు గ్యాస్ పంపిణీ జరిగే విధానాన్ని తెలుసుకున్నారు. గ్యాస్ బుకింగ్ చేసే పద్ధతి నుంచి వినియోగదారుడి ఇంటికి సరఫరా చేసే వరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియపై ఆరా తీశారు. గ్యాస్ సరఫరాలో ఆధార్ నమోదు ప్రాధాన్యతను తెలుసుకున్నారు. అనంతరం గుంటుపల్లి గ్రామంలో వృద్ధులకు సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అమలు చేస్తున్న ఆన్లైన్ విధానాన్ని పరిశీలించారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ వేమూరి మానస, సర్పంచి దొప్పల రమణ, వీఆర్వోలు రమేష్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement