breaking news
CBIT record
-
క్యాంపస్ ప్లేస్మెంట్లలో సీబీఐటీ రికార్డు
మొదటి దశలో 1,244 మందికి ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) క్యాంపస్ ప్లేస్మెంట్లో రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్లో జరిగిన మొదటి దశ క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఆ కాలేజీకి చెందిన 1,244 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేసుకోనున్న ఈ విద్యార్థులు రూ.3.25 లక్షల నుంచి రూ.7.5 లక్షల వార్షిక వేతనం పొందనున్నారు. '36 ఏళ్ల సీబీఐటీ ప్రస్థానంలో ఇన్ని ఉద్యోగాలు పొందడం ఇదే ప్రథమం. త్వరలో ప్రారంభం కానున్న రెండో దశలోనూ మా విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తారు. ఎన్నో దేశీయ, విదేశీ కంపెనీలు ప్లేస్మెంట్ల కోసం రానున్నాయి' అని సంస్థ ప్లేస్మెంట్ అధికారి ఎన్.ఎల్.ఎన్.రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి దశలో కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు ఒరాకిల్, జేపీ మోర్గాన్, డెలాయిట్, ఎకోలైట్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు తమ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయని వివరించారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు సీబీఐటీ విద్యాసంస్థ అధ్యక్షుడు వి.మాలకొండారెడ్డి, ప్రిన్సిపల్ బి.చెన్నకేశవరావు అభినందనలు తెలిపారు. -
ప్లేస్మెంట్లలో సీబీఐటీ రికార్డు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటైన చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) విద్యార్థులు రికార్డు సంఖ్యలో ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఇప్పటి వరకూ 1010 మంది విద్యార్థులు (2015 బ్యాచ్) క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందారని సీబీఐటీ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్ హెడ్ డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి గురువారం తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ తమ కాలేజీకి చెందిన 12 మంది విద్యార్థులకు దేశంలోనే అత్యధిక వార్షిక వేతనాన్ని రూ. 12 లక్షలు ఆఫర్ చేసిందని ఆయన వెల్లడించారు. డెల్లాయెట్, ఆక్సెంచర్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమినీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఆఫర్ చేశాయని వివరించారు. జేపీ మోర్గాన్, ఫోర్డ్, ఐగేట్ వంటి ఐటీ, ఉత్పత్తి, తయారీ సంస్థలు ప్లేస్మెంట్ల కోసం తమ కాలేజీకి రానున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు సీబీఐటీ అధ్యక్షుడు ఉండేలా మాలకొండారెడ్డి అభినందనలు తెలిపారు.


