-
పోప్ హితవు
ఒకే జెండర్కు చెందినవారు కలిసి సహజీవనం చేద్దామనుకోవడంలో తప్పేమీ లేదని క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించి పెను సంచలనం రేపారు. అలాంటి లైంగిక భావనలున్నవారు కూడా దేవుని బిడ్డలే...వారిని దూరంగా విసిరికొట్టడం కానీ, బాధించడంగానీ సరైంది కాదని, వారి సహజీవనాన్ని కూడా వివాహంగా గుర్తించాలని ఒక డాక్యుమెంటరీలో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు దేశదేశాల్లోని ప్రభుత్వాలను ఆలోచింపజేస్తాయి. వాస్తవానికి 2013లో పోప్గా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఆయన ప్రకటన చేశారు. అయితే అలాంటివారి సహజీవనాన్ని చట్టబద్ధం చేయాలని గట్టిగా కోరడం ఇదే ప్రథమం. పోప్ తాజా ప్రకటన ఆధునిక కాలానికి అనుగుణంగా మతంలో సంస్కరణలు తీసుకురావాలని కోరుకుంటున్నవారికి బలాన్నిస్తుంది. అదే సమయంలో సంప్రదాయవాదులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఎవరూ తమ వ్యక్తిగత లైంగిక భావనల కారణంగా బెదిరింపులూ, వేధింపులూ ఎదుర్కొనే పరిస్థితి వుండ కూడదు. అలాంటివారికి చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చినప్పుడు మాత్రమే వారు అందరిలా సమా జంలో ప్రశాంతంగా జీవించగలుగుతారు. కానీ మన దేశంతో సహా అనేక దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377లోని అసహజ నేరాల జాబితా స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూస్తోంది. అందుకు యావజ్జీవ శిక్ష లేదా పదేళ్లవరకూ శిక్ష, జరిమానా విధించవచ్చునని ఆ సెక్షన్ చెబుతోంది. సుప్రీంకోర్టు సైతం ఆ సెక్షన్ రాజ్యాంగబద్ధమైనదే నంటూ 2012లో తీర్పునిచ్చింది. అయితే 2018లో దాన్ని సవరించుకుంది. పరస్పర అంగీకారం వున్న స్వలింగసంపర్క సంబంధాలు నేరం కాదని తీర్పునిచ్చింది. ప్రాణులను స్త్రీ, పురుషులుగా మాత్రమే ప్రకృతి ఎంపిక చేయనప్పుడు లైంగికత అంటే ఫలానా విధంగా మాత్రమే వుండాలని శాసించే హక్కు ఎవరికీ ఉండబోదని అమెరికన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సి కిన్సే ఒక సందర్భంలో చెప్పాడు. మన రాజ్యాంగం వ్యక్తిగత స్వేచ్ఛకూ, సమానత్వ భావనకూ, మైనారిటీల హక్కులకూ రక్షణ నిచ్చింది. కానీ భిన్న లైంగిక భావనలున్న స్వలింగ సంపర్కులను నేరస్తులుగా పరిగణించే చట్టం మాత్రం దశాబ్దాలపాటు యధావిధిగా కొనసాగింది. సున్నితంగా ఆలోచించే స్వభావమూ, సహాను భూతితో వ్యవహరించే గుణమూ న్యాయవ్యవస్థలో కొరవడితే రాజ్యాంగం ప్రవచించే ఉన్నతా దర్శాలు, వాగ్దానాలు ఉత్త మాటలుగా మిగిలిపోతాయి. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం నీడలో కూడా ప్రకృతి సహజమైన చర్యను నేరంగా పరిగణించే సెక్షన్ 377 ఏడు దశాబ్దాలు కొన సాగిందంటే అది మన న్యాయవ్యవస్థ వైఫల్యమనే చెప్పాలి. బ్రిటిష్ వలసవాదులు తమ దేశంలో అమలవుతున్న చట్టాన్ని 1861లో యధాతథంగా ఇక్కడ అమల్లోకి తెచ్చారు. అయితే స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించడానికి అనువైన చట్ట నిబంధనలు ఇంకా ఏర్పడలేదు. తమని 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం కింద దంపతులుగా గుర్తించాలంటూ ఇటీవలే ఢిల్లీకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు కవితా అరోరా, అంకితా ఖన్నాలు హైకోర్టు తలుపులు తట్టారు. తాము దంపతులుగా సహజీవనం చేస్తున్నామని, అందరి కుటుంబాలకూ బంధువులు వచ్చిపోతున్నట్టే తమ వద్దకూ వస్తుంటారని, అలాంటపుడు తమ సహజీవనాన్ని వివాహంగా గుర్తించడంలో అభ్యంతరం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీం కోర్టు ప్రకటించి రెండేళ్లవుతున్నా వివాహచట్టాల్లో అందుకు వీలు కల్పించే సహజీవనాన్ని పొందు పరచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాన్ని వివాహంగా ఎందుకు గుర్తించాలన్న సంశయం వచ్చినవారికి కవితా అరోరా, అంకితా ఖన్నా సవివరమైన జవాబిస్తున్నారు. బ్యాంకులో ఉమ్మడి ఖాతా తెరవాలంటే వారిమధ్య చట్టబద్ధమైన సంబంధం వున్నట్టు రుజువుండాలి. ఇద్దరు మహిళలను దంపతులుగా, కుటుంబంగా గుర్తించడం అసాధ్యం కనుక అధికారికమైన అడ్రస్ ప్రూఫ్ వారి నివాసగృహానికి లభించడం లేదు. పాస్పోర్టు పొందాలన్నా అదే ఇబ్బంది. ఆ చిరునామాలో నివసిస్తున్న వారిలో ఒకరిని యజమానిగా, మరొకరిని అద్దెకుంటున్నవారిగా మాత్రమే పరిగణించ గలమని పోలీసుల వాదన. ఇక వారసత్వ హక్కులు వంటివి సరేసరి. పీఎఫ్, గ్రాట్యుటీ వంటివి పొందేటపుడు నామినీగా గుర్తించడం, వారితో వున్న సంబంధాన్ని తెలపడం కూడా అసాధ్యం. ఇలా చట్టపరమైన అవరోధాలు ఎన్నో వున్నాయి. వీరి తరహాలోనే మరో ఇద్దరు స్వలింగ సంపర్కులు తమ వివాహాన్ని హిందూ వివాహ చట్టం కింద గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన వింతగా వుంది. ఒకే జెండర్కు చెందినవారి మధ్య వివాహం భారతీయ విలువల ప్రకారం సమ్మతం కాదని, అది పవిత్రంగా పరిగణించడం సాధ్యపడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. మరి స్వలింగ సంపర్కం రాజ్యాంగబద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం ఏం గౌరవిస్తున్నట్టు? ఇది మన దేశానికి పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. ప్రపంచ దేశాలన్నిటా ఇలాంటి పరిస్థితే వుంది. దాదాపు 30 దేశాల్లో మాత్రమే ఇంతవరకూ స్వలింగసంపర్కుల వివాహాన్ని గుర్తించే చట్టాలున్నాయి. చాలాచోట్ల ఈ వివాహాలను అనైతికతగా పరిగణించే ఛాందసవాదులదే పైచేయి. కొన్నిచోట్లయితే అది మరణశిక్షకు అర్హమైన నేరం! అందువల్లే పోప్ ఫ్రాన్సిస్ చేసిన ప్రకటన స్వలింగసంపర్కులకు కొత్త బలాన్నిచ్చింది. ఏ దేశానికైనా సామాజిక, సంప్రదాయిక కట్టుబాట్లుం టాయి. అయితే అవి రాజ్యాంగ నైతికతతో విభేదించినప్పుడు రాజ్యాంగం మాటే చెల్లుబాటు కావాలి. ప్రజాస్వామ్య రిపబ్లిక్లు ఏర్పడిన దేశాల్లో కూడా ఇంకా బూజుపట్టిన భావాలదే పైచేయి అవుతున్న వేళ పోప్ ప్రకటన అక్కడి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. -
ఇస్లాం గడ్డపై కేథలిక్ల బహిరంగ సభ
అబుధాబీ: ఇస్లాం గడ్డపై తొలిసారి పర్యటిస్తున్న క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక కేథలిక్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ సభకు సుమారు 1.70 లక్షల మంది కేథలిక్లు హాజరయ్యారు. ఓపెన్ టాప్ వాహనంలో వాటికన్ జెండాలను ఎగురవేస్తూ పోప్ స్టేడియంలోకి ప్రవేశించారు. స్టేడియంలో సుమారు 50 వేల మంది కేథలిక్లు ఉండగా.. స్టేడియం బయట ఏర్పాటుచేసిన పెద్ద పెద్ద స్క్రీన్ల ద్వారా పోప్ ప్రసంగాన్ని మరో 1.20 లక్షల మంది వీక్షించారు. సుమారు 4 వేల మంది ముస్లింలకు కూడా సభకు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు స్థానిక చర్చి అధికారులు తెలిపారు. సభకు భారీగా హాజరైన వలస కార్మికులు, శరణార్థులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. ‘ఇంటిని విడిచిపెట్టి ఇంత దూరంలో జీవనం కొనసాగించడం చాలా కష్టతరమైంది. మిమ్మల్ని ప్రేమించే వారి ఆప్యాయతలను మీరు కోల్పోతున్నారు. అలాగే భవిష్యత్కు సంబంధించిన అనిశ్చితి కూడా మీలో నెలకొని ఉంటుంది. కానీ భగవంతుడు చాలా నమ్మదగినవాడు. తనను నమ్ముకున్న వాళ్లను ఎన్నటికీ విడిచిపెట్టడు’ అని పోప్ వలస కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏ ఈలో భారత్, ఫిలిప్పీన్స్కు చెందిన కేథలిక్ వలస కార్మికులు అధిక శాతంలో ఉన్నారు. దేశంలో సుమారు 10 లక్షల మంది కేథలిక్లు నివసిస్తున్నారు. అంటే యూఏఈలో ప్రతీ 10 మందిలో ఒకరు కేథలిక్ కావడం గమనార్హం. -
దారుణ హత్య.. పొడిచి అడవిలోకి పరార్
సాక్షి, తిరువనంతపురం : కేరళలో ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురయ్యారు. అదే చర్చిలో పనిచేస్తూ సస్పెన్షన్కు గురైన వ్యక్తే ఆయనను కత్తితో పలుమార్లు పొడిచేసి సమీపంలోని అడవిలోకి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఫాదర్ చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులం జిల్లాలోని మలయత్తూర్ క్యాథలిక్ చర్చ్లో ఫాదర్ జావియర్ తెలిక్కాట్ (52) ఫాదర్గా పనిచేస్తున్నారు. జానీ అనే వ్యక్తి చర్చిలో మెయింటెన్స్ పనులు, స్మశానంలో పనులు చూసుకుంటున్నాడు. అయితే, జానీ కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఫాదర్ జావియర్ అతడిని పనిలో నుంచి తొలగించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న జానీ ఫాదర్ కురుయిష్మల కొండపైకి యాత్రకు వెళ్లి గురువారం ఉదయం 10.45గంటల ప్రాంతంలో కిందికి దిగి వస్తుండగా అనూహ్యంగా కత్తితో ఫాదర్ ముందుకు దూసుకొచ్చి వాదన పడుతూనే దాడికి పాల్పడ్డాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే తీవ్ర గాయాలతో కన్నుమూశారు. ఈ సంఘటన ఆ చుట్టుపక్కల సంచలనంగా మారింది. జానీ కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. అతడు అడవిలోకి పారిపోవడంతో అటవీశాఖ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. -
మైనర్ల పై హత్యాచారయత్నం
వయనాడ్(కేరళ): ఎవరూ లేని అనాథల జీవితాలు చిద్రం చేయడానికి కొందరు కీచకులు ప్రయత్నించారు. 7గురు బాలికలపై నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేరళలోని వయనాడలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వాయనాడలోని ఓఅనాధాశ్రమంలో బాలికలపై పక్కనే ఉన్న దుకాణం యజమాని బాలికలకు స్వీట్స్, చాకోలెట్స ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 5గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వయనాడలో ఓ చర్చి ఫాదర్ ఓ మైనర్ బాలికను తల్లిని చేసిన సంఘటనలో 7గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement