-
‘ఏపీ హైకోర్టు చర్య అసాధారణం’.. ఇదేమి సుమోటో!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పలు కేసులను మూసి వేస్తూ ఆయా మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపడుతూ సుమోటోగా హైకోర్టు విచారణ జరుపుతుండటంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ వ్యవహారంపై సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబరిచే విధంగా ఉందని న్యాయ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సహా, టీడీపీ నేతలపై లెక్కనేనన్ని కేసులు ఉన్నప్పటికీ ఈ తరహా చర్యలు వారికి వర్తించవా? ఒక్క జగన్ మాత్రమే లక్ష్యమా.. అని ఆశ్చర్య పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని చర్యలకు హైకోర్టు పూనుకోవడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోందని, ఇలాంటి చర్యలు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని అంటున్నారు. చట్టం నిర్ధేశించిన విధి విధానాలకు భిన్నంగా వెళ్లడం ఓ దుస్సంప్రదాయంగా మారి అనేక సమస్యలకు తీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసులు మూసేయాలని బాబు తరహాలో జీవోలు ఇవ్వలేదే.. ‘రాజకీయ నాయకులపై నమోదయ్యే కేసులను కొద్ది కాలం తర్వాత ఆయా ప్రభుత్వాలు ఆ కేసులను ఉపసంహరిస్తూ జీవోలు జారీ చేస్తుంటాయి. కానీ ప్రస్తుత వ్యవహారంలో కింది కోర్టులే తమ ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదైన కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చాయి. పోలీసులు దాఖలు చేసిన ఫైనల్ రిపోర్ట్పై మేజిస్ట్రేట్ సంతృప్తి చెందకుంటే ఆ కేసులో రీ ఇన్వెస్టిగేషన్కు ఆదేశాలు ఇవ్వొచ్చు. ఈ విషయంలో మేజిస్ట్రేట్కు పూర్తి అధికారాలున్నాయి. కోర్టుల్లో కేసుల మూసివేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదు. పోలీసులు దాఖలు చేసే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా కోర్టులు ముందుకు వెళతాయి. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు కేసును మూసి వేసేందుకు అభ్యంతరం చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో మేజిస్ట్రేట్లు ఆ కేసులను మూసివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మినహా చట్ట ప్రకారం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ మేజిస్ట్రేట్లపై ఫిర్యాదులు వస్తే అప్పుడు కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. పైపెచ్చు జగన్మోహన్రెడ్డిపై గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నమోదైన కేసులన్నీ ఒకే అంశానికి సంబంధించినవి. ఒకే అంశంపై బహుళ ఎఫ్ఐఆర్ల నమోదు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చింది. ఇటీవల రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. వాటి పట్ల స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ సుమోటో వ్యవహారమంతా మొన్నటి వరకు హైకోర్టులో కీలక స్థానంలో ఉండి బదిలీపై వెళ్లిన ఓ న్యాయమూర్తి, ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఉత్తరాధి రాష్ట్రానికి చెందిన ఓ న్యాయమూర్తి నడిపిన తతంగమని న్యాయవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ 11 కేసులను మూసేస్తూ ఉత్తర్వులిచ్చిన మేజిస్ట్రేట్లలో అత్యధికులను అప్పటి కీలక న్యాయమూర్తి ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. తప్పుడు సంకేతాలకు తావివ్వరాదు కోర్టులు తన అధికారాలను ఉపయోగించి జారీ చేసే ఉత్తర్వులకు, ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల ద్వారా ఇచ్చే ఉత్తర్వులకు తేడా ఉంది. ఇక్కడ ప్రభుత్వం తాను జీవో జారీ చేసి ముఖ్యమంత్రిపై కేసులను ఉపసంహరించలేదు. మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై విచారణ జరపాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని, దానిని బెంచ్ ముందు ఉంచడం సబబు కాదు. దేని ఆధారంగా సుమోటోగా తీసుకోవాలో అందుకు సంబంధించిన ఆధారాలను, డాక్యుమెంట్లను ప్రతివాదులకు ఇవ్వాలి. ఆ వివరాలేవీ ప్రతివాదులకు ఇవ్వలేదు. కానీ ఓ పత్రిక, టీవీ చానెల్లో మాత్రం వచ్చేశాయి. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓ వ్యవస్థ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉందన్న తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఓ వర్గం చేస్తోంది. – చిత్తరవు నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, విజయవాడ హైకోర్టు చర్య అసాధారణం హైకోర్టు చర్య అసాధారణం. సాధారణంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వులను అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సమీక్షించడం, తప్పుడు ఉత్తర్వులు ఇచ్చి ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం పరిపాటే. కాని ఈ కేసులో మేజిస్ట్రేట్లు నిబంధనలకు అనుగుణంగానే ఉత్తర్వులిచ్చారు. ఇలాంటి ఉత్తర్వులపై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సమీక్షించి సుమోటోగా విచారణ జరపాలనుకోవడం వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఫిర్యాదుదారుగా వ్యవహరించరాదు. ఈ కేసుల్లో తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదుదారు చెప్పలేదు. అలాంటప్పుడు కేసు మూసివేతకు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఇవ్వడంలో తప్పేమీ లేదు. – ఎస్.శరత్ కుమార్, న్యాయవాది, విజయవాడ నాడు తీవ్ర నేరాలపై కూడా కేసుల ఉపసంహరణ హత్యాయత్నం.. అత్యాచారయత్నం.. దాడులు.. బెదిరింపులు.. ఇవేవీ సాధారణ నేరాలు కావు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులలో పిటిషన్లను ఉపసంహరించుకుంది. మరికొన్ని కేసులను ఏకంగా విచారణను మూసి వేసింది. ఎందుకంటే ఈ కేసుల్లో నిందితులు సామాన్యులు కారు. వారిలో చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్రావుతో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ విధంగా ఏకంగా 28 కేసుల్లో 28 అభియోగాలపై విచారణను ఉపసంహరిస్తూ టీడీపీ ప్రభుత్వం ఏకంగా 21 జీవోలు జారీ చేసింది. మరో 131 కేసుల్లో ఏకంగా విచారణే అవసరం లేదని అర్ధంతరంగా క్లోజ్ చేసింది. మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు, మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తి, కొల్లురవీంద్ర, నక్కా ఆనందబాబు, ఆ పార్టీ ప్రముఖులు రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు, అశోక్రెడ్డి, షాజహాన్ బాషా, సీహెచ్ ఆంజనేయులు, ఏ.ఆనందరావు, పతివాడ నారాయణస్వామి నాయుడు, వంగలపూడి అనిత, గొల్లపల్లి సూర్యారావు, మెట్ల సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్ తదితరులపై విచారణను అర్ధంతరంగా ముగించారు. ఇదిలా ఉండగా 2012లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో చంద్రబాబు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ నిర్వహించారు. దీనిపై కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు నమోదైంది. ఈ కేసు విచారణను బాబు సీఎంగా ఉన్న 2017లో అర్ధంతరంగా నిలిపి వేశారు. 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ నేతలపై కేసులను ఎత్తివేస్తూ చంద్రబాబు సర్కార్ జారీ చేసిన జీవోలు -
63 మందిపై కేసు కొట్టివేత
గుత్తి (గుంతకల్లు) : మెయిల్ గ్రీన్ పవర్ లిమిటెడ్ కంపెనీ వేసిన కేసులో పెన్నానది పరివాహక పరిరక్షణ కమిటీ సభ్యులకు ఊరట లభించింది. 63 మందిపై నమోదైన కేసును గుత్తి జేఎఫ్సీఎం జడ్జి వెంకటేశ్వర్లు బుధవారం కొట్టివేశారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం నాగలాపురం (చిట్టూరు) వద్ద మెయిల్ గ్రీన్ పవర్ కంపెనీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. అక్కడ అక్రమంగా బావి (ఇన్ఫిల్ట్రేషన్ వెల్) తవ్వింది. పెన్నానదికి సంబంధించిన అన్ని కాలువలనూ ఈ బావిలోకి మళ్లించింది. చుట్టుపక్కల 20 గ్రామాల్లో ఐదు వేల బోర్లు ఎండిపోయాయి. ఆయా గ్రామాల్లో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. దీంతో కంపెనీపై పోరాటం చేయడానికి రైతులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమయ్యారు. పెన్నానది పరీవాహక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ సభ్యులు బావిని పూడ్చి వేయాలని పదిరోజులపాటు ఆందోళలనలు నిర్వహించారు. బావిని పూడ్చి వేయడానికి ప్రయత్నించారు. దీంతో కంపెనీ నిర్వాహకులు కమిటీలోని 63 మందిపై 427, 447, 147, 188, 353 సెక్షన్ల కింద 2013 మేలో కేసు నమోదు చేయించారు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. ఈ కేసు పలు విచారణల అనంతరం బుధవారం గుత్తి జేఎఫ్సీఎం కోర్టులో తుది విచారణకు వచ్చింది. తుది విచారణలో 63 మంది కమిటీ సభ్యులపై కేసును కొట్టివేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సంగీత వాదించారు. కోర్టు తీర్పు.. కంపెనీకి చెంప పెట్టు తమపై అక్రమంగా బనాయించిన కేసును కోర్టు కొట్టివేయడం మెయిల్ గ్రీన్ పవర్ కంపెనీ ప్రతినిధులకు చెంప పెట్టులాంటిదని పెన్నానది పరివాహక పరిరక్షణ కమిటీ సభ్యులు శరత్ చంద్రారెడ్డి (వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి), ఓబుల కొండారెడ్డి (రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్), ఇమామ్ (కదిలిక ఎడిటర్), న్యాయవాదులు సంజయ్ యాదవ్, ధనుంజయ, వెంకటరమణారెడ్డిలు అభివర్ణించారు. తమపై బనాయించిన కేసును కొట్టివేసిన అనంతరం కోర్టు ఆవరణలోనే వారు విలేకరులతో మాట్లాడారు. మెయిల్ గ్రీన్ పవర్ కంపెనీ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో పాటు బావిని తవ్వి పెన్నానది నీటితో పాటు వంకల, కాలువల నీళ్లను బావిలోకి మళ్లించడం కారణంగా ఉష్ణోగ్రత 49 డిగ్రీలకు చేరుకుందన్నారు. దీంతో గొర్రెలు, పశువులు ఉదయం 11 గంటలకే వేడిమిని భరించలేక ఇళ్లకు వెళ్లిపోతున్నాయన్నారు. పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతినిందన్నారు. నాగలాపురం, గంజికుంట పల్లి, చిట్టూరు గ్రామాల్లోని పిల్లలకు చర్మవ్యాధులు సోకాయన్నారు. భూములను, కాలువలను, దారులను చివరకు దేవాలయ భూములను సైతం కంపెనీ నిర్వాహకులు ఆక్రమించారన్నారు. ఇప్పటికైనా కంపెనీపై చర్యలకు ఉపక్రమించకపోతే మరోసారి పోరాటాలకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
మంత్రి ఫోన్తో నమోదు కాని కేసు
- దూషించినవారిపై చర్యలు తీసుకోవాలంటున్న వైద్యురాలు రాయదుర్గం అర్బన్ : ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు గీతాజ్యోతిని రోగి బంధువులు కళావతి, అశోక్లు దూషించిన ఘటనపై కేసు నమోదు కాకుండా పావులు కదులుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి స్వయంగా కేసు నమోదు చేయండని చెప్పినప్పటికీ జిల్లాకు చెందిన ఓ మంత్రి జోక్యం చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదుకు వెనుకడుగు వేశారు. గురువారం మధ్యాహ్నం రోగి బంధువులు దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపానికి గురైన వైద్యురాలు గీతాజ్యోతితోపాటు మరో వైద్యుడు మన్సూర్ అలీఖాన్లు ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాతావరణంలో తాము వైద్య సేవలదించలేమని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధి స్పందిస్తూ దూషించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్యురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్ఐ నారాయణ కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. కాసేపటి తర్వాత మంత్రి వద్ద నుంచి ఫోన్ రావడంతో అప్పటికే అదుపులోకి తీసుకున్న అశోక్ను సైతం వదిలి పెట్టారు. అశోక్ గతంలో మంత్రి వద్ద డ్రైవర్గా పనిచేయడం వల్లే మంత్రి జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేడర్ను, కార్యకర్తలను రక్షించుకోకపోతే ఎలా అంటూ స్థానిక ప్రజాప్రతినిధికి సైతం సున్నితంగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రజాప్రతినిధి అత్యవసర పని ఉందంటూ విజయవాడకు వెళ్లగా.. స్థానిక టీడీపీ నాయకులు రాజీకి రావాలంటూ వైద్యురాలిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు తెలిసింది. రాజీయత్నాల కోసం ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చెందిన ఒకరికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వైద్యురాలు గీతాజ్యోతి స్పందిస్తూ తాను రాజీ అయ్యే ఉద్దేశం లేదన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటే ఇక్కడ పనిచేస్తానని, లేకపోతే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. ఎస్ఐ మహానంది స్పందిస్తూ రోగి బంధువులు వైద్యురాలికి క్షమాపణ చెప్పామని, కాళ్లు పట్టుకున్నామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement