breaking news
Captain Steve Smith
-
సమరానికి సై...
-
సమరానికి సై...
► నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు ► ఉత్సాహంతో కోహ్లి సేన ► తీవ్ర ఒత్తిడిలో కంగారూలు వేదిక ఏదైనా వరుసగా 19 టెస్టుల్లో పరాజయం దగ్గరికే రాలేదు. సొంతగడ్డపై అయితే గత 20 మ్యాచ్లలో 17 విజయాలు సాధించగా ఒక్క ఓటమి కూడా లేదు. నాలుగేళ్ల క్రితం ఇక్కడే కలిసికట్టుగా 53 వికెట్లు తీసి ఆసీస్ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు బౌలర్లు ఇప్పుడు ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ఎదురులేని బ్యాటింగ్తో ప్రత్యర్థుల పని పడుతున్న ఆటగాడు ముందుండి నడిపిస్తుండగా జట్టులో ప్రతీ ఒక్కరు మరొకరితో పోటీ పడుతూ అద్భుత ప్రదర్శన ఇస్తున్నారు. ఇదీ వరల్డ్ నంబర్వన్ భారత్ తాజా స్థితి. ఈ జట్టు జోరును ఆపడం సాధ్యమా... ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత ఇక్కడ ఆడిన పది టెస్టుల్లో ఎనిమిది ఓడి అతి కష్టంగా రెండింటిలో ‘డ్రా’తో బయటపడింది. అనేక మంది దిగ్గజాలు ఉన్న నాటి ఆసీస్ జట్లు కూడా భారత్ ధాటికి నిలువలేకపోయాయి. ఇప్పుడు స్పిన్ పిచ్లపై ఆడటంలో ఏ మాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లను నమ్ముకొని ఆసీస్ భారత్లో అడుగు పెట్టింది. ఉపఖండంలో గత తొమ్మిది టెస్టుల్లో నూ చిత్తుగా ఓడిన ఆ జట్టు, అసలు నాలుగు మ్యాచ్ల సిరీస్లో అసలు ఏమాత్రమైనా నిలబడగలదా లేక పట్టుదలతో పోరాడుతుందా? పుణే: న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తున్న జట్టుతో తలపడేందుకు ఇప్పుడు కంగారూల బృందం సన్నద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు (గురువారం) తొలి టెస్టు ప్రారంభమవుతుంది. భారత్ వరుసగా ఆరు టెస్టు సిరీస్లు గెలిచి ఊపు మీదుండగా, ఆసీస్ ఇటీవలే స్వదేశంలో పాకిస్తాన్ను చిత్తు చేసింది. అయితే అక్కడికంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరిగే ఈ మ్యాచ్లలో ఆసీస్ అదే తరహా ఆటతీరును ప్రదర్శించడం అంత సులువు కాదు. మరోవైపు జట్టులో ప్రతీ ఆటగాడు ఫామ్లో ఉండటంతో వరుస విజ యాలు సాధించిన కోహ్లి సేన మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య భారత గడ్డపై 2013లో జరిగిన సిరీస్లో ఆసీస్ 0–4తో ఓడగా, ఆఖరిసారిగా ఈ రెండు జట్లు ఆస్ట్రేలియాలో 2014లో తలపడిన సిరీస్లో ఆసీస్ 2–0తో నెగ్గింది. ముగ్గురు స్పిన్నర్లతో... ఈ సీజన్లో ఆడిన మూడు టెస్టు సిరీస్లలో కూడా భారత్లో పిచ్లపై ఎలాంటి విమర్శలు రాలేదు. పూర్తిగా స్పిన్ పిచ్లను వాడుకొని ఫలితం సాధించారని ప్రశ్నించే అవకాశం లేకుండా అన్ని మైదానాల్లో అన్ని రకాల పరిస్థితుల్లో జట్టు విజయాలు అందుకుంది. జట్టులో అందరూ ఫామ్లో ఉండటంతో మరింత ఆత్మవిశ్వాసంతో ఈ సిరీస్కు భారత్ సిద్ధమైంది. విజయ్, రాహుల్, పుజారా, రహానేలతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కోహ్లి భీకర బ్యాటింగ్ విషయంలో మరో మాటకు తావు లేదు. వెస్టిండీస్ పర్యటన నుంచి చూస్తే గత 13 టెస్టుల్లో కోహ్లి 80కు పైగా సగటుతో 1,457 పరుగులు సాధించాడు. వరుసగా నాలుగు సిరీస్లలో ‘డబుల్ సెంచరీలు’ అతని ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్లో బంగ్లాదేశ్తో ఆడిన టెస్టులో కీపర్ సాహా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక అశ్విన్, జడేజాల బ్యాటింగ్ విషయంలో కూడా ఎలాంటి సందేహాలు లేవు. గత టెస్టుతో పోలిస్తే ఈసారి స్పిన్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని భారత్ భావిస్తోంది. అందుకే ఒక పేసర్ స్థానంలో జయంత్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక మన స్పిన్ జంట మరోసారి ప్రత్యర్థిని కుప్పకూల్చేందుకు అస్త్రాలతో సిద్ధమైంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్న అశ్విన్, నంబర్టూ జడేజా మరోసారి భారత భాగ్యచక్రాన్ని పరుగెత్తించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. గత 13 టెస్టుల్లో అశ్విన్ ఏకంగా 78 వికెట్లు తీయగా, 10 టెస్టుల్లో జడేజాకు 49 వికెట్లు దక్కాయి. జడేజా కెరీర్లో తీసిన 117 వికెట్లలో 96 భారత గడ్డపైనే వచ్చాయంటే అతను ఇక్కడ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వాలన్నా, ప్రత్యర్థికి దీటుగా బరిలో నిలవాలన్నా ఇద్దరు ప్రధాన బ్యాట్స్మెన్పైనే అంతా ఆధారపడి ఉంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్లను ఆ జట్టు ప్రధానంగా నమ్ముకుంటోంది. భారత్లో వార్నర్ గత రికార్డు అంత గొప్పగా ఏమీ లేకపోయినా... ఐపీఎల్ అనుభవం, ఇటీవలి ఫామ్ వల్ల అతను ఈ సారి మరింత మెరుగ్గా ఆడగలడని ఆసీస్ భావిస్తోంది. గత కెప్టెన్ క్లార్క్లాగే స్మిత్కు కూడా స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల నైపుణ్యం ఉంది. అతను పట్టుదలగా క్రీజ్లో నిలబడగలిగితే ఆసీస్ అవకాశాలు మెరుగు పడతాయి. ఇటీవలే శ్రీలంక చేతిలో 0–3తో చిత్తుగా ఓడినప్పుడు కూడా మంచి ప్రదర్శన కనబర్చిన షాన్ మార్‡్ష స్పిన్ను బాగా ఆడగలడు. మరోవైపు భారత్తో పోలిస్తే ఆసీస్ స్పిన్ విభాగం బలహీనంగానే ఉంది. గతంలో ఇక్కడ ఆడినప్పుడు ప్రభావం చూపిన నాథన్ లియోన్తో పాటు ఓ కీఫ్లను ఆ జట్టులో ప్రధాన స్పిన్నర్లు. లెగ్ స్పిన్నర్ స్వెప్సన్కు అప్పుడే అవకాశం దక్కకపోవచ్చు కానీ పిచ్ను బట్టి మూడో స్పిన్నర్ అవసరమైతే అగర్ లేదా మ్యాక్స్వెల్కు చోటు లభి స్తుంది. మరోవైపు స్టార్క్, హాజల్వుడ్ రూపంలో ఆ జట్టులో ఇద్దరు బ లమైన పేసర్లు ఉం డటం కలిసొచ్చే అంశం. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, జయంత్, ఉమేశ్, ఇషాంత్/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, రెన్షా, షాన్ మార్ష, హ్యాండ్స్కోంబ్, మిషెల్ మార్ అగర్, వేడ్, స్టార్క్, కీఫ్, లియోన్, హాజల్వుడ్. ► నా కెప్టెన్సీ గురించి విశ్లేషించేందుకు ఇది సరైన సమయం కాదు. మరికొన్నేళ్ల తర్వాత కూడా నేను కెప్టెన్గానే ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. జట్టు బాగా ఆడినప్పుడే కెప్టెన్సీ కూడా బాగుంటుంది. అయితే నాయకుడినయ్యాక నా ఆట ఇంకా మెరుగు పడిందని మాత్రం చెప్పగలను. మా దృష్టిలో అన్ని సిరీస్లూ సమానమే. బంగ్లాదేశ్లాగే ఆస్ట్రేలియా జట్టును కూడా గౌరవిస్తాం. ఈ సీజన్లో అన్ని జట్లు మాకు గట్టిపోటీనే ఇచ్చాయి. ఈ వేసవి ఆరంభంలో భారత్లో పిచ్లు పొడిగా ఉండి స్పిన్కు అనుకూలించడం సహజం. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ మాకు సంబంధించి ఇది కఠినమైన సిరీస్ కాబోతుందని తెలుసు. భారత జట్టులో 1 నుంచి 11 వరకు కూడా నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. 0–4తో సిరీస్ ఓడిపోతామని కొందరు చేసిన వ్యాఖ్యలకు నేను ప్రాధాన్యతనివ్వను. మా జట్టుకు భారత్కు గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉంది. సిరీస్ హోరాహోరీగా జరుగుతుంది. పేసర్ స్టార్క్ ఇక్కడా మా ప్రధాన ఆయుధం కాగలడు. శ్రీలంక సిరీస్ పరాజయం మాకు పాఠాలు నేర్పింది. ఈ సారి తగిన వ్యూహాలతో వచ్చాం. – స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ ► ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ► 25 భారత్లో పుణే 25వ టెస్టు వేదిక పిచ్, వాతావరణం పుణే మైదానంలో ఇదే తొలి టెస్టు మ్యాచ్. పిచ్ బాగా పొడిగా కనిపిస్తోంది. తొలి రోజునుంచే బంతి టర్న్ అయ్యేందుకు అనుకూలం. కొంత రివర్స్ స్వింగ్కూ అవకాశం ఉంది. -
ఆస్ట్రేలియా శుభారంభం
తొలి ఇన్నింగ్స్లో 327/5 స్మిత్, మార్ష్ సెంచరీలు భారత్ ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: భారత పర్యటనను ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. భారత్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల మ్యాచ్లో ఆ జట్టు బ్యాట్స్మెన్కు మంచి ప్రాక్టీస్ లభించింది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (161 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్ష్ (173 బంతుల్లో 104; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్లో మిషెల్ మార్ష్ (16 బ్యాటింగ్), వేడ్ (7 బ్యాటింగ్) ఉన్నారు. భారత యువ బౌలర్లు తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత్ ‘ఎ’ జట్టులోకి ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్లు సిరాజ్, రాహుల్ సింగ్లకు ఈ మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశం మాత్రం దక్కలేదు. సైనీకి 2 వికెట్లు... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్తో తొలి టెస్టు తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న టాప్–5 బ్యాట్స్మెన్తో బరిలోకి దిగిన ఆసీస్... ప్రధాన పేసర్లు స్టార్క్, హాజల్వుడ్లకు ఈ మ్యాచ్లో విశ్రాంతినిచ్చింది. ఢిల్లీకి చెందిన పేసర్ నవదీప్ సైనీ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ను దెబ్బ తీశాడు. అతను వేసిన షార్ట్ బాల్ను వార్నర్ (30 బంతుల్లో 25; 4 ఫోర్లు) సరిగా ఆడలేకపోవడంతో ఎడ్జ్ తీసుకొని గాల్లో లేచిన బంతిని కీపర్ ఇషాన్ అందుకున్నాడు. మరి కొద్దిసేపటికే సైనీ బౌలింగ్లోనే దూరంగా వెళుతున్న బంతిని ఆడి రెన్షా (11) కీపర్కే క్యాచ్ ఇచ్చాడు. భారీ భాగస్వామ్యం... 55/2 స్కోరు వద్ద జత కలిసిన స్మిత్, షాన్మార్ష్ స్వేచ్ఛగా ఆడారు. వీరిద్దరు పేస్, స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒక్క ఓవర్ కూడా వేయకుండానే ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ వీరిద్దరిని కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. కెరీర్లో 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న స్మిత్... 154 బంతుల్లో 15వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్కు 40.5 ఓవర్లలో 156 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ రిటైర్డ్ అవుట్గా తప్పుకున్నాడు. 88 పరుగుల వద్ద సైనీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన షాన్ మార్ష్ కూడా కొద్ది సేపటికే కెరీర్లో 21వ శతకం అందుకొని స్వచ్ఛందంగా వెనుదిరిగాడు. మార్ష్ , హ్యాండ్స్కోంబ్ (70 బంతుల్లో 45; 3 ఫోర్లు) నాలుగో వికెట్కు 79 పరుగులు జత చేశారు. భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే హ్యాండ్స్కోంబ్ను పాండ్యా అవుట్ చేశాడు. చివర్లో మిషెల్ మార్ష్ వేడ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా రోజును ముగించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇషాన్ (బి) సైనీ 25; రెన్షా (సి) ఇషాన్ (బి) సైనీ 11; స్మిత్ (రిటైర్డ్ అవుట్) 107; షాన్ మార్‡్ష (రిటైర్డ్ అవుట్) 104; హ్యాండ్స్కోంబ్ (సి) పాంచల్ (బి) పాండ్యా 45; మిషెల్ మార్‡్ష (బ్యాటింగ్) 16; వేడ్ (బ్యాటింగ్) 7; ఎక్స్ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 327. వికెట్ల పతనం: 1–33; 2–55; 3–211; 4–290; 5–305. బౌలింగ్: అశోక్ దిండా 15.2–1–49–0; హార్దిక్ పాండ్యా 17–3–64–1; సైనీ 12.4–4–27–2; నదీమ్ 23–0–90–0; అఖిల్ హేర్వాడ్కర్ 11–0–48–0; శ్రేయస్ అయ్యర్ 7–0–32–0; ప్రియాంక్ పాంచల్ 4–0–11–0. -
ఇదొక్కటే లోటు
క్రికెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఘనతలూ సాధించిన ఆసీస్ జట్టు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ గెలవలేదు. ఇదొక్కటే లోటుగా కనిపిస్తోందని, భారత్లో కప్ గెలవడం ద్వారా టి20ల్లోనూ చాంపియన్లుగా అవతరిస్తామని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
ఆసీస్ దీటైన జవాబు
స్మిత్, బర్న్స్ సెంచరీలు న్యూజిలాండ్తో రెండో టెస్టు క్రైస్ట్చర్చ్: ఓపెనర్ జో బర్న్స్ (321 బంతుల్లో 170; 20 ఫోర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (241 బంతుల్లో 138; 17 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో... న్యూజిలాం డ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటైన జవాబు ఇచ్చింది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 110 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. వోజెస్ (2 బ్యాటిం గ్), లయోన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 7 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్నైట్ స్కోరు 57/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖాజా (24) వికెట్ను కోల్పోయింది. అయితే స్మిత్, బర్న్స్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మిం చారు. పచ్చిక వికెట్పై కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో చెలరేగినా... రెండు సెషన్ల పాటు వికెట్ను కాపాడుకున్నారు. సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ క్రీజులో కుదురుకున్నారు. ఈ క్రమంలో స్మిత్ కెరీర్లో 14వ సెంచరీ పూర్తి చేయగా... బర్న్స్ కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 289 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కివీస్పై మూడో వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే ఆట చివర్లో కొత్త బంతితో వాగ్నేర్ మ్యాజిక్ చేశాడు. 5 బంతుల తేడాలో స్మిత్, బర్న్స్ వికెట్లను తీసి ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత వోజెస్, లయోన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. బౌల్ట్, వాగ్నేర్ చెరో 2 వికెట్లు తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 370 పరుగులకు ఆలౌటైంది. స్మిత్కు బౌన్సర్ దెబ్బ: టీ విరామానికి ముందు ఓవర్లో వాగ్నేర్ వేసిన షార్ట్ పిచ్ బంతి అన్యూహంగా ఎగిసి వచ్చి స్మిత్ తలను బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా కెప్టెన్ కుప్పకూలిపోయాడు. అయితే ఫీల్డర్లు వెంటనే సపర్యలు చేయడంతో పాటు కాస్త తేరుకున్న స్మిత్.. తర్వాత వైద్య చికిత్స తీసుకుని ఇన్నింగ్స్ను కొనసాగించాడు.