C Ramapuram dump yard issue
-
జైల్లో ఎమ్మెల్యే, 35 మంది నిరాహారదీక్ష
చిత్తూరు: చెత్త డంపింగ్యార్డు తరలింపు కోసం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జైల్లోనూ నిరసన కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా ఆహారం ముట్టకుండా నిరాహారదీక్ష చేస్తున్నారు. పోలీసులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఆహారం తీసుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. చెవిరెడ్డితో పాటు అరెస్టైన మరో 35 మంది నిరసనదీక్ష కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రామాపురంలో ఉన్న చెత్త డంపింగ్యార్డును తరలించాలన్న డిమాండ్తో నిరాహారదీక్ష చేపట్టిన చెవిరెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం పుత్తూరు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆయనను పోలీసులు చిత్తూరు సబ్జైలుకు తరలించారు. చెవిరెడ్డితో పాటు మరో 35 మందికి కోర్టు వచ్చే నెల 7 వరకు రిమాండ్ విధించింది. -
జైల్లో ఎమ్మెల్యే దీక్ష
చిత్తూరు: ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన చెత్త డంపింగ్యార్డు తరలింపు కోసం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జైల్లోనూ నిరాహాదీక్ష కొనసాగిస్తున్నారు. మంచినీళ్లు ముట్టకుండా చిత్తూరు సబ్జైలులో దీక్ష చేస్తున్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. తన పోరాటాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. రామాపురంలో చెత్త డంపింగ్యార్డును తరలింపు డిమాండ్తో నిరాహారదీక్ష చేపట్టిన చెవిరెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం పుత్తూరు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆయనను పోలీసులు చిత్తూరు సబ్జైలుకు తరలించారు. చెవిరెడ్డితో పాటు మరో 35 మందికి కోర్టు వచ్చే నెల 7 వరకు రిమాండ్ విధించింది. తమ తరపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్కు నిరసనగా రామాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వీరికి రామచంద్రాపురం, తిరుపతి రూరల్ ప్రజలు మద్దతు పలికారు.