breaking news
Business centers
-
ఇంటి అందం రెట్టింపు!
సాక్షి, హైదరాబాద్ : గతంలో గోడలకు సున్నం వేయించడమే పెద్ద అలంకరణ. అలాంటిదిప్పుడు గోడలకు చిత్రాలు (ఆర్ట్స్) తగిలించుకోవటం ట్రెండ్. మోడరన్ ఆర్ట్ కేన్వాస్లు నివాస గృహాలతో పాటు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, కార్యాలయాల గోడల మీద దర్శనమిస్తాయి. ► చిత్రాలను వేలాడదీయాల్సిన ఆయా ప్రదేశాలను బట్టి ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అంటూ పెదవి విరుస్తారు. వంట గదిలో తాజా కన్పించే పండ్లు, కూరగాయలు, తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. ఆహార పదార్థాలకు ఉండాల్సిన తాజాదనాన్ని ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది కూడా. ముందు గదిలోనయితే ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధులు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత చిత్రాలు వేలాడదీయవచ్చు. ► కార్యాలయాల్లో అతిథులు వేచి ఉండే చోట చూడగానే వెంటనే అర్థంకాని చిత్రాలను అంటే మోడరన్ ఆర్ట్ను ఎంపిక చేసుకోవచ్చు. వాటిని చూసీ చూడకముందే ఆ కార్యాలయ నిర్వాహకుడిపై అతిథులు ఒక అంచనాకు రాకూడదన్నమాట. అధునాతన చిత్రాన్ని అర్థం చేసుకునే పనిలో అతిథి మునిగిపోతే విసుగు పుట్టకుండా కాలం వెళ్లదీసే అవకాశం ఉంటుంది. కార్యాలయ గోడలకు వేలాడుతున్న మోడరన్ ఆర్ట్కు ఇచ్చేంత గౌరవాన్ని దానికి సంబంధించిన వారు కూడా అతిథుల నుంచి అందుకుంటారు. ► సున్నితమైన రంగులయితే మానసిక ప్రశాంతత కలగజేస్తాయి. ముదురు రంగులు మనసును అల్లకల్లోలం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రంగుల్లోనూ తెలుపు, నీలం, చిలకాకుపచ్చ, పసుపు రంగులు మృదువుగా కనిపిస్తాయి. ఎరుపు, ముదురు ఆకుపచ ్చ, నలుపు రంగులు కంటిని సైతం బెదరగొడతాయి. తేలికపాటి రంగులను ఎంపిక చేసుకోవడ మంచిదేగానీ, గోడ రంగులో చిత్రాలు కలసి కనపడకుండాపోయే ప్రమాదం ఉంటుంది. -
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి
శివాజీనగర్ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని వెంటనే అరికట్టాలని పీడీఎస్యూ జి ల్లా అధ్యక్షుడు జి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. జిల్లాలో విద్యను వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం గా విద్యాసంస్థలను నడుపుతున్నారన్నారు. పా ఠశాలల్లోనే పుస్తకాలు, నోట్పుస్తకాలు, స్టేష నరీ, డ్రెస్సులు, టె, బెల్టులు, షూ ఇతర సామగ్రిని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ, బడిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. తోకపేర్లను తొలగించాలని డిమాం డ్ చేశారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు లంచాలకు ఆశపడి గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో కార్పొరేట్ విద్యాసంస్థలను బహిష్కరించాలన్నారు. పాఠశాలల్లో నా ణ్యత లేని బస్సులను వాడుతున్నారని అ లాం టి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సుధాకర్, జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు గంగాధర్, క్రాం తికుమార్, ఆజాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.