-
పచ్చ దళం.. ధిక్కార ‘గళం’
అవనిగడ్డ/చీరాల/బి.కొత్తకోట/సాక్షి అమలాపురం: ప్రజాగళం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సొంత పార్టీలోనే ధిక్కార గళం వినిపిస్తోంది. పార్టీలో చెలరేగిన టికెట్ల రగడ ఇంకా చల్లారలేదు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు సీటివ్వకుంటే పార్టీ సభ్యత్వాలకు, సర్పంచ్ పదవులకు రాజీనామా చేస్తామని పలువురు టీడీపీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ మద్దతుదారులైన సర్పంచ్లు సమావేశమయ్యారు. బుద్ధప్రసాద్కు అన్యాయం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ► చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోని చేనేత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు ఓటెయ్యొద్దని ఇంటింటికీ తిరిగి ప్రచారమూ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పొన్నలూరు ప్రాంతానికి చెందిన కొండయ్య చీరాలకు వచ్చి చేనేత నాయకులను బహిరంగంగా దూషించి అవమానించడమే దీనికి కారణమని చేనేత నాయకులు ఆరోపిస్తున్నారు. పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, టీడీపీ నేత చాట్రాసి రాజేష్ వేర్వేరుగా కొండయ్యకు ఓటెయ్యొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేతలకు ఎక్కడా సీటు ఇవ్వకుండా చంద్రబాబు తమను మోసం చేశారని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు అన్నగుండ ఆదినారాయణ మరి కొందరు రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేతల ఓట్లు 40 లక్షలు ఉన్నాయని, తమ సత్తా టీడీపీకి చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ► తంబళ్లపల్లె టీడీపీ టికెట్ వ్యవహారం మళ్లీ మొదటికొచి్చంది. గతనెల 24న టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించినా రాజకీయాలకు సంబంధం లేని ఆయనను అభ్యర్థిగా ఎలా పెడతారంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్యాదవ్, పార్టీ నేతలు కొండా నరేంద్ర తదితరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. దీంతో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, శంకరయాదవ్, మధుసూదన్రెడ్డి తదితరుల పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే బీజేపీ కొత్తగా రాజంపేట, తంబళ్లపల్లెలో ఒకదానిని బీజేపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న దృష్ట్యా తంబళ్లపల్లెను ఆ పార్టీకి ఇచ్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ► అమలాపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గెలుపు సాధ్యం కాదనే వాదన సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. గత ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీడీపీ ఆఫీసులో జనసేన చేరికలు విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో జనసేన పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహిస్తున్న దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణం నియోజకవర్గంలో బుధవారం ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇక్కడ జనసేనకు సొంత కార్యాలయం లేకపోవడంతో చేరికల కార్యక్రమాన్ని నగర టీడీపీ కార్యాలయంలో జనసేన అభ్యర్థి చేపట్టారు. ఈ సీటును జనసేన నుంచి ఇద్దరు కార్పొరేటర్లు, మరో నాయకుడు ఆశించారు. అయితే వారిని కాదని వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ శ్రీనివాస్కు పవన్ సీటు ఇచ్చారు. దీంతో జనసేన నేతలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఈ గందరగోళంలో పార్టీ కార్యాలయ ఏర్పాటును నేతలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం జనసేనలో ఓ నలుగురు చేరడానికి రావడంతో అభ్యర్థి వంశీకృష్ణ నగరంలోని టీడీపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణామానికి విస్తుపోయిన టీడీపీ శ్రేణులు తమ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
టీడీపీ బుద్ధ ప్రసాద్ ఆవేదన
-
3న ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎంతమంది నటీనటులు ఉన్నా ‘విశ్వ నట చక్రవర్తి’ ఒక్కరే. వెండితెర విలక్షణ నటునిగా సినీ పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టిన ఆ మహానటుడు యస్వీ రంగారావు. 1918 జూలై 3న ఆయన జన్మించారు. జూలై 3వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘సంగమం’ సంస్థ ఆధ్వర్యంలో యస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ‘సంగమం’ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఎస్వీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్గారు, కె.వి.రమణాచారిగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. యస్వీఆర్తో కలిసి నటించిన వారితో పాటు తర్వాత కాలంలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను సత్కరిస్తున్నాం’’ అన్నారు. -
విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం
- రూ.1.50 కోట్లతో భవన నిర్మాణానికి చర్యలు - ఘంటసాల ఉపయోగించిన వస్తువులు ఇచ్చేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులు - తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు - ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ(కృష్ణా జిల్లా): విజయవాడలో రూ.1.50 కోట్లతో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట స్మారక మ్యూజియంను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉపసభాపతి, తెలుగు భాషాభివృద్ధి అధ్యన కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఉపసభాపతి కార్యాలయం నందు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పల్లె రఘునాధరెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు కలిసి ఈనెల 19, 20 తేదీల్లో తమిళనాడులో పర్యటించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గృహానికి వెళ్లి ఘంటసాల వస్తువులను పరిశీలించి మ్యూజియం ఏర్పాటు విషయం ప్రస్తావించగా వారు అంగీకరించినట్టు చెప్పారు. ఘంటసాల వాడిన కళ్లజోడు, తంబుర, కుర్చీ, చెప్పులతో పాటు సంగీత పరికరాలు, 2వేలు గ్రాం ఫోన్ రికార్డులు మ్యూజియంకు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు బుద్ధప్రసాద్ వెల్లడించారు. విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని, రూ.1.5 కోట్లతో నిర్మించే ఈ మ్యూజియం పనులు వీలైనంత త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడులో తమిళభాష పట్ల ప్రజలు ఎంతో మక్కువ చూపుతారని చెప్పారు. అక్కడ భాషాభివృద్ధికి తమిళ సంస్థలు ఎన్నో పనిచేస్తున్నాయని తెలిపారు. తమిళభాషను పరాయివాళ్లకు నేర్పించేందుకు 20వేల మంది పనిచేస్తున్నారని తెలుగును ఇదే తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని బుద్ధప్రసాద్ చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన తెలుగు భాషాభిమానులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు రూపకల్పన చేస్తామన్నారు. -
శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన సభలో సభ్యుల ప్రస్తావించిన పలు అంశాలపై ఓ కమిటీని నియమించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ సభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా ఈ కింది అంశాలపై పరిశీలన జరుపుతుంది సభా కార్యకలాపాలకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో విచారిస్తుంది. అసెంబ్లీ ఐదో, ఆరో సమావేశాల ఆడియో వీడియో టేపులను పరిశీలించి, సభలో సభ్యుల ప్రవర్తన, సభలోనే స్పీకర్ మీద వ్యాఖ్యలు తదితర అంశాలను పరిశీలిస్తుంది ఇకమీదట సభా నిర్వహణ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలను సూచిస్తుంది కమిటీ తొలిసారి సమావేశమైన తర్వాత 20 రోజుల్లోగా తన పరిశీలనలు, సూచనలు, ప్రతిపాదనలను స్పీకర్కు సమర్పించాలి. కమిటీ గడువు కూడా తొలి సమావేశం జరిగినప్పటి నుంచి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement