breaking news
BSNL landline
-
బిఎస్ఎన్ఎల్ మరో ప్రమోషనల్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ల్యాండ్లైన్ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. 'ఎక్స్పీరియన్స్ ఎల్ఎల్ 49' అనే కొత్త ప్రమోషనల్ ఆఫర్ ప్రారంభించింది. దీని ద్వారా ల్యాండ్లైన్ ఖాతాదారులకు అపరిమిత కాలింగ సౌకర్యాన్ని అందిస్తోంది. కేవలం రూ.49కే ల్యాండ్లైన్ కనెక్షన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 'ఎక్స్పీరియన్స్ ఎల్ఎల్ 49' ఆఫర్ కింద రూ.49లకే లాండ్ లైన్ కనెక్షన్ రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు రాత్రి 9గం.నుంచి ఉదయం 7గం. లవరకు ఉచిత కాలింగ్ ఆఫర్. అలాగే నెలలోని అన్ని ఆదివారాల్లో ఏ నెట్ వర్క్కైనా (24 గంటలూ) అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆరునెలల సమయం ముగిసిన అనంతరం వినియోగదారులు నెలవారీ ప్లాన్ ప్రకారం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇదే సేవలో ఉచితంగా ఒక సిమ్ కార్డ్ ను కూడా ఉచితంగా అందిస్తోంది. అలాతే కొత్త వినియోగదారులు రూ.149 రీచార్జ్పై ఏ నెట్వర్క్కైనా (లోకల్ అండ్ ఎస్టీడీ) ప్రతిరోజు 30 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పిస్తోంది. -
ఊపిరిలూదిన ‘ఉచిత కాల్స్’
* బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ కనెక్షన్లకు రికార్డుస్థాయి స్పందన * 25 రోజుల్లోనే 8,350 కనెక్షన్లు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ విభాగానికి ‘ఉచిత కాల్స్’ పథకం మళ్లీ ఊపిరిలూదింది. శరవేగంగా పతనం దిశగా సాగుతున్న ఆ విభాగాన్నీ ఈ పథకం ఆపద్భాందవునిలా ఆదుకుంది. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ కనెక్షన్ల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ఒక్క ఏపీ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పరిధిలోనే సాలీనా లక్ష కనెక్షన్లను సంస్థ కోల్పోతోంది. ఇదే కొనసాగితే ల్యాండ్ లైన్ విభాగాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని గుర్తించిన సంస్థ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు వరకు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్లైన్, సెల్ఫోన్లకు ఉచితంగా కాల్స్ చేసుకునే కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన ఈ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. తొలి 25 రోజుల్లో సంస్థ ఏపీ సర్కిల్ పరిధిలో కొత్తగా 8,350 ల్యాండ్లైన్ కనెక్షన్లను పొందింది. ఏప్రిల్లో 25 రోజుల్లో సంస్థ పొందిన కనెక్షన్లు 4,500. ఆ నెలలో ఏకంగా 9 వేల కనెక్షన్లను సంస్థ కోల్పోయింది. కానీ కొత్త పథకం కారణంగా మేలో 25 రోజులకు 8,350 కనెక్షన్లు నమోదైతే.. కోల్పోయింది 6 వేలు మాత్రమే. నికరంగా 2,350 కనెక్షన్లు పెరిగాయన్నమాట. ఇలాంటి సానుకూల ఫలితాలను గడచిన ఐదేళ్లలో సంస్థ పొందలేకపోయింది. దీంతో ఉచిత పథకం ఇచ్చిన ఉత్సాహంతో జూన్ నుంచి కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.