-
విప్రో 10,500 కోట్ల షాపింగ్!
న్యూఢిల్లీ: గ్లోబల్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కన్సల్టెన్సీ క్యాప్కోను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా పేర్కొంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. క్యాప్కోను సొంతం చేసుకునేందుకు 1.45 బిలియన్ డాలర్లను(రూ. 10,500 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద కొనుగోలుకావడం గమనార్హం! క్యాప్కో కొను గోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో కన్సల్టింగ్, ఐటీ సర్వీసులందించడంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు విప్రో వివరించింది. ఈ విభాగంలోని అంతర్జాతీయ క్లయింట్ల(సంస్థలు)కు పటిష్టమైన, సమర్ధవంత కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల వ్యూహాత్మక డిజైన్, డొమైన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, క్లౌడ్ తదితర సేవలకు క్యాప్కోకున్న కన్సల్టింగ్ సమర్ధత జత కలవనున్నట్లు పేర్కొంది. వెరసి బ్యాంకింగ్ చెల్లింపులు, క్యాపిటల్ మార్కెట్లు, బీమా తదితర విభాగాలలో మరింత మెరుగైన సేవలకు వీలున్నట్లు తెలియజేసింది. క్యాప్కో తీరిదీ...: 1998లో ఏర్పాటైన క్యాప్కో ప్రపంచవ్యాప్తంగా 100 మందికిపైగా క్లయింట్లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు దీర్ఘకాలంగా సేవలందిస్తోంది. లండన్ కేంద్రంగా 16 దేశాలలో 30 ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది. 5,000 మంది కన్సల్టెంట్స్ ద్వారా సర్వీసులు అందిస్తోంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం(2020)లో 72 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,200 కోట్లు) ఆదాయం సాధించింది. క్యాప్కోకున్న ప్రతిభావంత టీమ్, క్లయింట్లతోపాటు, సిబ్బందికి ఆహ్వానం పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు సంస్థల కలయికతో క్లయింట్లకు అత్యున్నత కన్సల్టింగ్, ట్రాన్స్ఫార్మేషన్స్ సేవలందించనున్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల మధ్య ఒకేవిధమైన బిజినెస్ మోడల్స్, కీలక మార్గదర్శక విలువలు ఉన్నట్లు ప్రస్తావించారు. ఇకపై విప్రో హోమ్ సిబ్బందిగా సేవలందించేందుకు క్యాప్కో ఉద్యోగులు గర్వపడతారని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు సంస్థల కలయిక ద్వారా క్లయింట్లకు అవసరమయ్యే అత్యున్నత ట్రాన్స్ఫార్మేషనల్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ లభించగలవని క్యాప్కో సీఈవో లాన్స్ లెవీ వ్యాఖ్యానించారు. -
పద్మభూషణ్కు పంకజ్ పేరు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును మరోసారి ప్రతిపాదించారు. గతేడాది కూడా అతడి పేరును భారత బిలియర్డ్అండ్ స్నూకర్ సమాఖ్య (బీఎస్ఎఫ్ఐ) పంపించింది. ‘వరుసగా రెండో ఏడాది కూడా పంకజ్ పేరును మేం ప్రతిపాదించాం. అతడు కచ్చితంగా ఈ పురస్కారానికి అర్హుడు. ఈసారి మాకు నిరాశ కలగదనే అనుకుంటున్నాం’ అని బీఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఎస్.బాలసుబ్రమణియన్ తెలిపారు. పంకజ్కు గతంలో పద్మశ్రీ, ఖేల్త్న్ర, అర్జున అవార్డులు దక్కాయి. క్వార్టర్స్లో అద్వానీ : బ్యాంకాక్లో జరుగుతున్న సాంగ్సోమ్ 6 రెడ్ ప్రపంచ చాంపియన్షిప్లో పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్స్కు చేరాడు. గ్రూప్ దశలో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంకజ్ ... ప్రిక్వార్టర్స్లో యువాన్ సిజున్ (చైనా)పై 5-4తో గెలిచాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement