breaking news
Brij Bedi
-
కిరణ్ బేడీ భర్త కన్నుమూత
న్యూఢిల్లీ: తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ(76) ఆదివారం గుర్గావ్లో గుండెపోటుతో మరణించారు. బ్లాడర్లో క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత 5 నెలలుగా అమృత్సర్, ఢిల్లీలలో చికిత్స పొందుతున్నారని కిరణ్ బేడీ వెల్లడించారు. అమృత్సర్లోని ఫోర్టిస్-ఎస్కార్ట్స్లో చికిత్స పొందుతున్న ఆయన్ను గత నెల 28న ఇక్కడి మేదాంత-మెడిసిటీ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్సచేస్తుండగా శనివారం ఉదయం 11గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. పంజాబ్లో మత్తుపదార్ధాలకు బానిసలైన వారి బాగుకోసం, వారి పిల్లల విద్యాభ్యాసం కోసం ఆయన ఎంతగానో కృషిచేశారు. ఆయనకు అమృత్సర్ అంటే మహా ప్రాణం. అక్కడ పాఠశాలను ప్రారంభించి 600 మందికి విద్యనందిస్తున్నారు’ అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. -
'నా భార్యకు బీజేపీ కేడర్ సహకరించలేదు'
చండీగఢ్: బీజేపీ కేడర్ సహకరించకపోవడం వల్లే పార్టీ పరాజయం పాలైందని ఆ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ అన్నారు. గత ఎన్నికల్లో క్రిష్ణానగర్ నియోజక వర్గం నుంచి హర్షవర్థన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ అదే నియోజక వర్గం నుంచి బరిలో నిలిచిన కిరణ్ బేడీ 2200 ఓట్ల తేడాతో ఓటమి చెందింది..అంటే బీజేపీ కేడర్ సహకరించలేదనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి 17 రోజుల ముందు కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.