-
World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోండి ఇలా..
కర్నూలు (హాస్పిటల్): స్ట్రోక్ అంటే చాలా మంది హార్ట్ ఎటాక్ అనుకుంటారు. కానీ స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు. దీనినే సాధారణ భాషలో పక్షవాతం అంటారు. హార్ట్ ఎటాక్ అంటే అందరికీ అవగాహన వస్తోంది. కానీ బ్రెయిన్ స్ట్రోక్పై చాలా మందికి అవగాహన లేదు. కాళ్లు, చేతులు పడిపోతేనో, మూతి వంకరపోయిన తర్వాత మాత్రమే వైద్యుల వద్దకు వెళ్తున్నారు. దీనికి ముందు లక్షణాలు గుర్తించి వెంటనే వైద్యుల వద్దకు వెళితే జరగాల్సిన నష్టాన్ని సాధ్యమైనంతగా నివారించుకోవచ్చు. దీనినే గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తారు. బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన అవగాహన దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 44 లక్షలకు పైగా జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో 4 లక్షల జనాభా పెరిగి ఉంటుంది. అంటే మొత్తం జనాభాలో 5శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంటే 48 లక్షలలో 2.4లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారు. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీలోనూ ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స ఉంది. ఈ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా వైద్యం అందుతుండటంతో లక్షణాలు కనిపించిన నాలుగున్నర గంటల్లో (గోల్డెన్ పీరియడ్)లో బాధితులు సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స అందుకోవాలి. ఇందుకోసం అవసరమై న ఇంజెక్షన్లు, మందులు వైద్యులు రోగికి అందించి చికిత్స చేస్తారు. ఇలాంటి గోల్డెన్ పీరియడ్లో వెళ్లడం వల్ల అవయవాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడవ చ్చు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి వారం స్ట్రోక్ బాధితుల సంఖ్య ఐదేళ్ల క్రితం 120 దా కా ఉండేది. అది ప్రస్తుతం 160 వరకు చేరుకుంది. స్ట్రోక్కు కారణాలు దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, మద్యపానం, ధూమపానం అతిగా సేవించడం, స్థూలకాయం కారణంగా ఒంట్లో కొవ్వుస్థాయిలు (కొలె్రస్టాల్) పెరిగిపోవడం, గుండెజబ్బులకు మందులు సరిగ్గా వాడకపోవడం వంటివి స్ట్రోక్కు దారి తీస్తాయి. స్ట్రోక్తో జరిగే తీవ్రనష్టం మనిషి మెదడుకు వెళ్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడటం కారణంగా మెదడు పనితీరు క్షీణించి స్ట్రోక్ వస్తుంది. 85శాతం మందికి కాళ్లు, చేతులు, చచ్చుపడిపోవడం, కొందరికి మూతి వంకర పోవడం, మాట నత్తిగా రావడం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు కోల్పోవడం వంటివి జరుగుతాయి. 15శాతం మందిలో మాత్రమే మెదడులో నరాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం అవుతుంది. గోల్డెన్ పీరియడ్లో వస్తేనే మేలు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే నాలుగున్నర గంటల్లోపు సమీప న్యూరోఫిజీషియన్ ఉన్న ఆసుపత్రికి వెళితే వెంటనే వారు థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది వెంటనే నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పల్చన చేసి రక్త సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే నిమిష నిమిషానికి బ్రెయిన్లో న్యూరాన్స్ తగ్గిపోతాయి. దీనివల్ల మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. నాలుగున్నర గంటలు దాటి ఆలస్యంగా వచ్చినా అడ్వాన్స్గా వచ్చిన మెకానికల్ థాంబెక్టమి అనే విధానం ద్వారా మెదడుకు యాంజియో నిర్వహించి గడ్డకట్టిన రక్తాన్ని తొలగించవచ్చు. ఇది ఖర్చుతో, రిస్క్తో కూడిన పని. కావున నాలుగున్నర గంటల్లోపు రావడం లేదా అస్సలు స్ట్రోక్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం. –డాక్టర్ హేమంతకుమార్, న్యూరోఫిజీషియన్, కర్నూలు స్ట్రోక్ లక్షణాలను బట్టి శస్త్రచికిత్స అన్యూరిజం అనేది రక్తనాళాల్లో బలహీనమైన ప్రాంతం. ఇది బయటకు ఉబ్బుతుంది. రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం వల్ల హేమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. అన్యూరిజం పగిలిపోయినట్లయితే మెదడు దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం అవుతుంది. లక్షణాలను బట్టి సర్జికల్ క్లిప్పింగ్, ఎండోవాసు్కలర్ థెరపి లేదా కాయిలింగ్, ప్రో డైవర్టర్లు, ఆర్టిరియోవెనస్ మాల్ ఫార్మేషన్, డీ కమోప్రెసివి క్రానియోటమి విధానాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంటుంది. రోగి వయస్సు, వైద్య పరిస్థితిని బట్టి స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. –డాక్టర్ వై.వరుణ్కుమార్రెడ్డి, న్యూరోసర్జన్, కర్నూలు -
సిటీ బ్రెయిన్కు స్ట్రోక్ ముప్పు..!
నగరంలో పెరుగుతున్న కేసులు మద్యం, ధూమపానం వల్లే ఎక్కువ వైద్యుల పరిశీలనలో వెల్లడి పనిలో అధిక ఒత్తిడి.. రిలాక్స్ కోసం మద్యం.. ధూమపానం.. వెరసి నగర యువత మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీరిలో కొంత మంది కాళ్లు, చేతులు పడిపోయి (ఇస్కామిక్ స్ట్రోక్) నిర్జీవంగా మారుతుండగా, మరికొంత మంది మెదడులో రక్తనాళాలు చిట్లి (హ్యమరేజ్ స్ట్రోక్) తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోనూ ఇలాంటి కేసులు పెరగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - సాక్షి, సిటీబ్యూరో నగర జీవనం చాలా మార్పులకు లోనవుతోంది. ఉరుకుల పరుగుల జీవితం.. కంప్యూటర్లతో కుస్తీలు.. మార్కెటింగ్ టార్గెట్లు.. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి. మారిన ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం.. వెరసి నగరవాసుల మెదళ్లను చిదిమేస్తున్నాయి. మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కాళ్లు చేతులు, మాట, చూపు, పడిపోయి నిర్జీవంగా మారుతున్నారు. సహజంగా 60 ఏళ్లు దాటిన వారిలో కన్పించే వ్యాధి.. సిటీలో నాలుగు పదుల వయసులోపే అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదీ నిపుణుల లెక్క.. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 150- 285 మంది పక్షవాతం బారిన పడుతున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒక పక్షవాతం కేసు నమోదవుతుండ గా, ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పక్షవాతంతో మరణిస్తున్న దేశాల జాబితాలో మనది రెండో స్థానం. ఈ వ్యాధి 35 శాతం మందిలో ధూమపానం వల్ల, 26 శాతం మంది మద్యం, 26 శాతం మంది హైపర్ టెన్షన్, 16 శాతం మంది మధుమేహం, 16 శాతం మంది ఊబకాయం వల్ల పక్షవాతానికి గురవుతున్నట్టు యశోద ఆస్పత్రి వైద్యుల పరిశోధనలో తేలింది. తొలిసారి స్ట్రోక్కు గురైనవారిలో 98 శాతం మంది సకాలంలో ఆస్పత్రిలో చేరి రికవరీ అవుతున్నప్పటికీ.. రెండు శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. బాధితుల్లో 65 శాతం పురుషులు కాగా, 35 శాతం మహిళలు ఉన్నారు. పక్షవాతం వచ్చిన వారిలో ఒక కాలు, చేయి బలహీనంగా మారుతుంది. తూలుతూ నడవడం, మతిమరుపు వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇవి 24 గంటల్లోనే తగ్గిపోతే ‘ట్రాన్సియెంట్ ఇస్కామిక్ ఎటాక్’ అంటారు. చాలా మందిలో గంట వ్యవధిలోనే తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణాలు భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించి జాగ్రత్త తీసుకుంటే మంచిది. మద్యం, పొగవల్లే.. నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ఉద్యోగుల్లో టార్గెట్స్తో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. బీపీ పెరగడంతో అది క్రమంగా హైపర్ టెన్షన్కు దారితీస్తుంది. అధిక మద్యపానం, లెక్కకు మించి సిగరెట్స్ కాల్చడం కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. అధిక బరువు, షుగర్ వంటి వ్యాధులు కూడా పరోక్షంగా దీనికి కారణమవుతున్నాయి. - డాక్టర్ జి.రాజశేఖర్రెడ్డి, న్యూరో ఫిజిషియన్, యశోద ఆస్పత్రి వ్యాయామం తప్పనిసరి సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా, మార్నింగ్ వాక్ వంటి ఎక్సర్సైజ్లు చేయాలి. ఆల్కాహాల్, స్మోకింగ్ను వదిలేయాలి. సంప్రదాయ ఆహారంతో కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. బీపీ లెవల్స్ 120/80కి మించకుండా జాగ్రత్త వహించాలి. - డాక్టర్ చెన్న రాజేష్రెడ్డి, న్యూరాలజిస్ట్, అపోలో ఆస్పత్రి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement