breaking news
brahmakumari
-
సీఎం వైఎస్ జగన్కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి: రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జయ, పద్మజ, రాధ రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెపె్టంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సీఎం జగన్ను వారు ఆహ్వనించారు. సీఎం జగన్కు రాఖీలు కట్టిన హౌస్ కీపింగ్ సిబ్బంది రాఖీ పండుగ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం జగన్ చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది తమ అభిమానాన్నిచాటుకున్నారు. -
క్రమశిక్షణతోనే ఉన్నత స్థానం
సత్సంకల్పంతో ముందుకు సాగాలి బ్రహ్మకుమారీల ‘బట్టి’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నవరం : సత్సంకల్పంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుందనే బ్రహ్మకుమారీల సిద్ధాంతం తనను ఎంతగానే ప్రభావితం చేసిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బ్రహ్మకుమారీలు ప్రతిపాదించే ఈశ్వరతత్వం, యోగాభ్యాసం వంటి వాటిని ఆచరించడం వల్లే తనలో క్రమశిక్షణ అలవడిందన్నారు. తాను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అది కారణమైందని చెప్పారు. అన్నవరం దేవస్థానంలోని సీతారామ సత్రంలో బుధవారం బ్రహ్మకుమారీలు నిర్వహించిన ‘సిద్ధి స్వరూప సాధన బట్టి’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తాను బ్రహ్మకుమారీ సమాజంలో సభ్యుడనని చెప్పారు. రాజస్థాన్లోని మౌంటు అబూలోని బ్రహ్మకుమారీల విశ్వవిద్యాలయ కేంద్ర కార్యాలయాన్ని పలుమార్లు సందర్శించినట్టు తెలిపారు. ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ శాంతి, ప్రేమ, సత్సంకల్పం ద్వారా దేన్నయినా సాధించవచ్చనే బ్రహ్మకుమారీల సిద్ధాంతం ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణీయమన్నారు. విశిష్ట అతిథిగా రాజయోగిని, ఢిల్లీ ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ఇన్చార్జి బ్రహ్మకుమారి ఆశా దీదీ మాట్లాడుతూ శ్రద్ధ, మనస్సులో దృఢత్వం, ఏకాగ్రతతో ఏ పని చేసినా సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు. అనంతరం వేదిక మీద ప్రముఖులంతా ‘బట్టి’ కేకును కట్ చేశారు. బ్రహ్మకుమారీల కాకినాడ యూనిట్ ఇన్చార్జి బీకే రజనీ బెహన్ మాట్లాడుతూ 13 ఏళ్లుగా అన్నవరం దేవస్థానంలో బట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బుధవారం నుంచి శనివారం వరకూ తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి వరకూ వివిధ ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐ.వి.రోహిత్, పలు ప్రాంతాల నుంచి వచ్చిన బ్రహ్మకుమారి, బ్రహ్మకుమార్లు పాల్గొన్నారు.