bommarillu Company
-
కోర్టుకు హాజరైన ‘బొమ్మరిల్లు’ డెరైక్టర్లు
నిలదీసేందుకు ప్రయత్నించిన బాధితులు టెక్కలి,న్యూస్లైన్, అధిక వడ్డీలను ఆశ చూపి ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చు టోపి పెట్టిన విశాఖపట్నానికి చెందిన బొమ్మరిల్లు సంస్థ రీజనల్ డెరైక్టర్లను శుక్రవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి సమీప ప్రాంతాలకు చెందిన బాధితులంతా కోర్టు వద్దకు చేరుకుని డెరైక్టర్లను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. అయితే గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు డెరైక్టర్లను బాధితుల కంట పడకుండా గోప్యంగా కోర్టుకు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖపట్టణం ప్రధాన కేంద్రంగా ఉన్న బొమ్మరిల్లు సంస్థ అధిక వడ్డీలను ఆశ చూపి సామాన్యుల నుంచి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి సంస్థను మూసివేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణం రీజియన్కు చెందిన సంస్థ డెరైక్టర్లు బాబూజీ, యర్రయ్య, శ్రీనివాసరావు, వెంకట్రావు, నారాయణరావు తదితరులను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పలు పోలీసుస్టే షన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో పలాస ప్రాంతానికి సంబంధించి కేసు విచారణకు విశాఖ పోలీసులు వారిని పలాస తీసుకెళ్లాలని శుక్రవారం భావించినప్పటికీ అక్కడ జడ్జి సెలవులో ఉండడంతో టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులంతా కోర్టు వద్దకు చేరుకుని వారిని నిలదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కోర్టులో హాజరుపరిచిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడంతో బాధితులు చేసేదిలేక వెనుదిరిగారు. -
నొల్లుకుంది రూ.10 కోట్లు !
విజయనగరం క్రైం, న్యూస్లైన్: విజయనగరం పట్టణంలోని ఎత్తుబ్రిడ్జి సమీపంలో ఉన్న బొమ్మరిల్లు సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఒకటో పట్టణ పోలీసులు సంస్థ కార్యాలయంలో ఈ తనిఖీలు చేశారు. విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనువాస్, సీఐ కె.రామారావు ఆధ్వర్యంలో ఒకటో పట్టణ ఎస్ఐ ఎస్.ధనుంజయ్రావు ఆధ్వర్యంలో పీఎస్ఐలు కాంతారావు, ఫకృద్దీన్, ఏఎస్ఐ అప్పలనాయుడు ఇతర సిబ్బంది సంస్థ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రి, ఓచర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. ఓచర్లు, కంప్యూటర్లో ఉన్న డిపాజిట్దారుల చెల్లింపులు, తదితర వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. సోమవారం రాత్రి ఎస్.కోటకు చెందిన ఇద్దరు బాధితులు ఒకటో పట్టణ స్టేషన్లో బొమ్మరిల్లు సంస్థపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డిపాజిట్ సొమ్ము రూ.10 కోట్లపైనే ? జిల్లాలో బొమ్మరిల్లు బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నా రు. వీరు డిపాజిట్ చేసిన సొమ్ము రూ.10 కోట్లపైనే ఉంటుందని అంచనా. జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో బొమ్మరిల్లు డిపాజిట్ దారులు ఉన్నారు. వందకు 12 శాతం వడ్డీ ఎర వేయడం, నాలుగేళ్లకు డిపాజిట్ చేసిన సొమ్ము రెండింతలు ఇస్తామని ఆశ పెట్టడంతో చాలా మంది పెద్ద మొత్తంలో ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. బొమ్మరిల్లు సంస్థలో ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసిన వారే తర్వాత ఏజెంట్లుగా అవతారమెత్తారు. వారి పరిచయాలను ప్రజలు కాదనలేక లక్షల్లో డిపాజిట్లు చేశారు. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు డిపాజిట్లు చేశారు. రైల్వేలో పనిచేసే ఒక ఉద్యోగి రూ.20లక్షలు, ఆ సంస్థ కార్యాలయానికి భవనం అద్దెకు ఇచ్చిన యజమాని కూడా రూ.14 లక్షల వరకు డిపాజిట్లు చేసినట్లు తెలుస్తోంది నట్టేట మునిగిన డిపాజిట్దారులు.. బొమ్మరిల్లు సంస్థ బొర్డు తిప్పేయడంతో డిపాజిట్దారులు నట్టేట మునిగారు. కాయకష్టం మీద సంపాదించిన సొమ్ము... తమ పిల్లలకు అత్యవసర కాలంలో అవసరమవుతుందని భావించి డిపాజిట్లు చేశారు. రూ.ఐదు లక్షల లోపు డిపాజిట్ చేసిన వారిలో ఎక్కువ మంది పేదలే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు రోజుకు, నెలకు ఇలా చిన్నచిన్న మొత్తాల్లో డిపాజిట్ చేసిన వారు ఉన్నారు. తొమ్మిది మందిపై కేసు నమోదు.. బొమ్మరిల్లు సంస్థ డెరైక్టర్, మరో ఎనిమిది మంది ప్రతినిధులపై కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్ఐ ఎస్.ధనుంజయ్రావు తెలిపారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన తర్వాత ఎంతమంది డిపాజిట్దారులు ఉన్నారనేది తెలుస్తుందని పేర్కొన్నారు. బోర్డు తిప్పేయడానికి సిద్ధంగా మరో సంస్థ....? మరో ఫైనాన్స్ సంస్థ కూడా బోర్డు తిప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు సంస్థ కంటే ముం దుగా నెలకొల్పిన ఆ సంస్థ డిపాజిట్లదారులకు ఖరీదైన ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, నాలుగున్నర ఏళ్లకే డిపాజిట్లు చేసిన సొమ్ముకు రెంటింపు సొమ్ము అందిస్తామని చెప్పి ప్రచారం చేసింది. డిపాజిట్ల కాలపరిమితి పూర్తయి ఆరునెలల కాలం దాటిన ఆ సంస్థ ఇంకా డిపాజిట్దారులకు డబ్బులు ఇవ్వడం లేదని తెలిసింది. బొమ్మరిల్లు సంస్థలాగా ఈ సంస్థ కూడా బోర్డు తిప్పేస్తుందేమోనన్న భయాందోళనలో ఆ సంస్థ డిపాజిట్దారులు ఉన్నారు. -
నిలువునా ముంచేశారు
-
నిలువునా ముంచేశారు
శ్రీకాకుళం క్రైం, న్యూస్లైన్: మీరు పది వేలు కట్టండి... నాలుగున్నర సంవత్సరాల తరువాత వంద గజాల స్ధలాన్ని ఉచితంగా ఇస్తాం!, మీ దగ్గరున్న సొమ్ములను మా దగ్గర డిపాజిట్ చేయండి.. అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తామంటూ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను నమ్మించిన బొమ్మరిల్లు కంపెనీ చివరకు బోర్డు తిరగేసింది. ఖాతాదారులను నిలువునా ముంచేయడంతో ఆందోళన చెం దుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వివరాల్లోకి వేళ్తే.. శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ సమీపంలో కొత్త వంతెన వద్ద బొమ్మరిల్లు కంపెనీని కొన్నెళ్ల కిందట అట్టహాసంగా ప్రారంభించారు. కమిషన్ ఆశచూపి జిల్లా మొత్తం మీద ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏజెంట్లు పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలను బొమ్మరిల్లు డిపాజిట్దారులుగా చేర్పించారు. రూ. కోట్లలో వసూలు చేసిన సొమ్ములను కంపెనీ తన ఖాతాలో జమచేసుకుంది. పదివేల రూపాయలు జమ చేసి నాలుగున్నర సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంచేస్తే వంద గజాల స్థలం ఇస్తామని చెప్పారు. సీతంపేట మండలం పులిట్టి గ్రామంలో సర్వే నంబర్ 49/10లో స్థలాన్ని ముందుగానే పది రూపాయల స్టాంపుపేపరుపై రాసి ఇచ్చేశారు కూడా. ఈ మోసాన్ని గుర్తించలేని వారు అధిక మంది డబ్బులు చెల్లించారు. అయితే, గత కొద్ది నెలల కిందట ఖాతాదారులు తమ డిపాజిట్లు మెచ్యూరిటీ కావడంతో సొమ్ము చెల్లించాలని, లేకుంటే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని నిలదీశారు. ఇదిగోఅదిగో అంటూ సంస్థ నిర్వాహకులు తప్పించుకుంటూ వచ్చారు. చివరకు గత నెలలో పూర్తిగా బోర్డు తిరగేసి సిబ్బంది మాయమైనట్టు తెలియడంతో లబోదిబోమంటున్నారు. వేల సంఖ్యలో సంస్థ ఖాతాదారులు ఉన్నట్టు తెలుస్తోంది. సిరిపురంలోనే 67 మంది డిపాజిట్ దారులు సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన వారే 67 మంది డిపాజిట్ దారులు ఉన్నారంటే ఇక జిల్లా మొత్తం వీరి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ 67 మంది నుంచి సుమారు 30 లక్షల వరకు వసూలు చేసిన బొమ్మరిల్లు కంపెనీ జిల్లా మొత్తం మీద కోట్ల రూపాయలను వసూలు చేసి ఉంటుందని అంచనా. సిరిపురం గ్రామానికి చెందిన 67 మంది బాధితులు మూకమ్మడిగా ఆదివారం వచ్చి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను ఏ విధంగా మోసం చేశారు, ఎటువంటి బాండ్లు ఇచ్చారు తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మరిళ్లు డెరైక్టర్లు వానపల్లి వెంకటరావు, కాపు శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, జి.ఎర్రయ్యలతో పాటు శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ ఎన్డీవీ.గిరిలపై సీఐ రాధకృష్ణ కేసు నమోదు చేశారు. పలాసలో కూడా... పలాస రూరల్: అధిక వడ్డీ పేరుతో భారీగా డిపాజిల్లు సేకరించిన బొమ్మరిల్లు ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. సోంపేటకు చెందిన పొందూరు కూర్మారావు, ఈశ్వరరావులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ సాయికాలనీకు చెందిన ఏజెంట్ కణితి కృష్ణారావు, బొమ్మరిల్లు యాజ మాన్యంపై కేసు నమోదు చేశామని కాశీబుగ్గ ఎస్సై ఆర్.వేణుగోపాల్ తెలిపారు. నమ్మించి తప్పించారు నేను 34 వేల రూపాయలను డిపాజిట్ చేశాను. గత ఏడాది నవంబర్ 2వ తేదీకి మెచ్యూరిటీ అయ్యింది. డబ్బులు చెల్లించాలని కోరితే 15 రోజుల్లో ఇచ్చేస్తామని నిర్వాహకులు తెలిపారు. చివరకు డిసెంబర్ ఒకటో తేదీన వెళ్లి చూసే సరికి ఎవ్వరూ లేకుండా పోయారు. -కె.అప్పన్న, బాధితుడు కమీషన్కే పనిచేశా శ్రీకాకుళం పట్టణంలోని బ్రాంచ్ మేనేజరు ఎన్డీవీ గిరి ద్వారానే ఏజెంట్ కింద చేరాను. కేవలం కమీషన్ కోసమే కంపెనీలో పనిచేశాను. లక్ష రూపాయలు కట్టిస్తే నాలుగు వేల రూపాయలు కమీషన్ ఇచ్చేవారు. ఇలా మోసం చేసి కంపెనీ బోర్డు తిరగేసేస్తుందని అనుకోలేదు. కంపెనీ నిర్వాహకులను పట్టుకుని ఎలాగైనా డబ్బులు వచ్చేలా పోలీసులే చర్యలు తీసుకోవాలి. తమ తప్పేమీ లేదు. పోలీసులకు అవసరమైన సహకారం అందిస్తాం. -గంథం గోవింద్, బొమ్మరిల్లు ఏజెంట్