breaking news
Bommagani Dharma bhiksham
-
ధర్మభిక్షానికి భారతరత్న ఇవ్వాలి
సంస్థాన్నారాయణపురం: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షానికి కేంద్రం భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మభిక్షం విగ్రహాన్ని శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్రను పాఠ్యంశాలుగా చేర్చడానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ధర్మభిక్షం విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమానికి నీరా పాలసీ తీసుకొచ్చామన్నారు. కార్మికులు ప్రమాదం జరిగి మృతి చెందితే రూ.5 లక్షల పరిహారం, గాయాలైతే రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, గీత పనివారల సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అసామాన్య...సామాన్యుడు!
నల్లగొండ :విద్యార్థి నాయకుడు.. హాకీ టీమ్ కెప్టెన్.. ఆర్యసమాజ్ సారథి.. ఆంధ్ర మహాసభ ఆర్గనైజర్.. కార్మిక సంఘాల నాయకుడు.. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. కమ్యూనిస్టు.. జర్నలిస్ట్.. ఎమ్మెల్యే.. ఎంపీ.. ప్రజా జీవితమే పరమావధిగా ఆజన్మ బ్రహ్మచారిగా గడిపిన ఆదర్శ నేత.. వెరసి ఇన్ని లక్షణాలు.. రూపాలు అచ్చుబోస్తే.. బొమ్మగాని భిక్షం అలియాస్ బొమ్మగాని ధర్మభిక్షం..!. ధర్మాన్ని కోరిన విద్యార్థి నాయకుడిగా నాటి హైదరాబాద్ కొత్వాల్ రాజ్బహద్దూర్ వెంకటరామారెడ్డి భిక్షంకు పెట్టిన పేరు ధర్మభిక్షం..‘‘భిక్షం మాంగా ధర్మ్.. కియాఇన్కా నామ్ ధర్మ్భిక్షు హై..’’! అన్న నాటి నుంచి ఆయన ధర్మభిక్షంగానే ప్రాచుర్యం పొందారు....::: ఎన్.క్రాంతీపద్మ ఇదీ నేపథ్యం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో గీతకార్మికుల ఇంట ఫిబ్రవరి 15, 1922న ధర్మభిక్షం జన్మించారు. ఆయన కుటుంబం సూర్యాపేటలో స్థిరపడింది. విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్న చైతన్య శీలి. విద్యార్ధి సంఘం నాయకుడిగా పనిచేశారు. తాను సొంతంగా నడిపిన హాస్టల్లోని విద్యార్థులను ఉద్యమంలోకి వచ్చేలా ఆర్గనైజ్ చేశారు. కార్మిక నాయకుడిగా.. వివిధ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి ఉద్యమించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మూసీ ప్రాజెక్టుల నిర్మాణాల సమయంలో ఆయన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పోరాడారు. ఆర్యసమాజ్లో పనిచేసిన సమయంలో జీవహింసకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ తర్వాత ఆంధ్రమహాసభతో మమేకమయ్యారు. ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పాత్రికేయునిగా కూడా పనిచేశారు. విద్యార్థి జీవితం ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను ధిక్కరించి సహ విద్యార్థులతో కలిసిబహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతి గృహం ఏర్పాటు చేశారు. సూర్యాపేటలోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. తెలుగుతో పాటు ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. సాయుధ పోరాట యోధుడు నిజాంపై సాయుధ పోరాటం మొదలైన తర్వాత తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధ పోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్టయ్యి.. ఔరంగాబాద్, జాల్నా జైళ్లో ఉన్నారు. మొత్తంగా అయిదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు. జాల్నా జైళ్లో ఏకంగా పదివేల మంది ఖైదీలతో సమ్మె చేయించిన ఘనత కూడా ఆయనదే. గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరి వరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మభిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు. సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి కంటే సీనియర్ అయిన ధర్మభిక్షం, సాయుధ పోరాటంలో మాత్రం ఇద్దరూ కలిసి ఒకేసారి పాల్గొన్నారు. బీఎన్ అజ్ఞాత జీవితం గడపగా, ధర్మభిక్షం జైలు జీవితం ఎక్కువ కాలం గడిపారు. రాజకీయ జీవితం స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1957లో నకిరేకల్ నుంచి, 1962లో నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. భారత ప్రభుత్వం నుంచి తామ్ర పత్ర పురస్కారం అందుకున్నారు. గ్రామీణ పేదల హక్కుల కోసం యువత, విద్యార్థులు, అసంఘటిత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు నడిపారు. స్వాతంత్య్ర సమరయోధునిగానూ ఆయనది అసమాన పాత్ర. నల్లగొండలో పలు కార్మిక సంఘాలను స్థాపించారు. 1991–1996 మధ్య పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ (గ్రామీణాభివృద్ధి శాఖ) సభ్యులుగా పనిచేశారు. -
నల్లగొండ.. అండెవరికో ?
సాయుధ రైతాంగ పోరాటంలో నల్లగొండది ఓ ప్రత్యేక చరిత్ర. ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ప్రధాన నాయకుల్లో రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి సాయుధ పోరాట యోధులంతా ఇక్కడి వారే. బందూకుల నుంచి బ్యాలెట్ దాకా సాగిన వీరి రాజకీయ జీవితంతో జిల్లాకు గుర్తింపు వచ్చింది. అంతటి ఘనమైన చర్రిత ఉన్న నల్లగొండ తెలంగాణ రాష్ట్ర పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల పోరులో ఇక్కడి లోక్సభ స్థానం ప్రతిష్టాత్మకంగా మారడంతో అన్ని పార్టీలూ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నాయి. నల్లగొండ: లోక్సభ నియోజకవర్గం ప్రస్తుత ఎంపీ, గుత్తా సుఖేందర్రెడ్డి ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు: నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ (ఎస్టీ). మొత్తం ఓటర్లు: 14,60,881 పురుషులు: 7,29,653 మహిళలు: 7,31,192 ప్రస్తుతం బరిలో నిలిచింది: 9 ప్రత్యేకతలు: మెజారిటీ ప్రాంతం నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోకి వస్తుంది. సిమెంటు పరిశ్రమ, పారా బాయిల్డ్ రైసు మిల్లులు ఎక్కువ . ఎస్సీ, బీసీ, రైతు, కార్మికులు మహిళల ఓట్లు కీలకం ప్రధాన అభ్యర్థులు వీరే: గున్నం నాగిరెడ్డి ( వైఎస్సార్ సీపీ) గుత్తా సుఖేందర్రెడ్డి (కాంగ్రెస్) తేరా చిన్నపురెడ్డి (టీడీపీ ) నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం) పల్లా రాజేశ్వర్ రెడ్డి (టీఆర్ఎస్) ఎన్. క్రాంతి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన టీ కాంగ్రెస్ ఎంపీల్లో ఒకరైన గుత్తా సుఖేందర్రెడ్డి ఈసారి తెలంగాణ ఓటుపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే తొలిసారి టీఆర్ఎస్ కూడా బరిలోకి దిగుతూ అదే తెలంగాణవాద ఓటుపై ఆశలు పెట్టుకుంది. మరో వైపు పరువు నిలబె ట్టుకునేందుకు మాత్రమే పోటీకి దిగుతున్న టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. సీపీఎం కూడా నల్లగొండలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గుత్తాకు ఎదురుగాలి గత ఎన్నికల సమయంలో రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఎంపీగా టికెట్ దక్కించుకున్న ‘గుత్తా’.. వైఎస్ హవాతో బయటపడ్డారు. అయితే ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా బరిలోకి దిగడంతో ఆయన గెలుపు నల్లేరుమీద నడక కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా.. నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో అభివృద్ధి ఊసే ఎత్తని కాంగ్రెస్ తీరును ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏర్పాటైన తొలి రైల్వేలైన్ బీబీనగర్-నడికుడి లైన్లో రైల్వేకు కావాల్సినంత ఆదాయం ఉన్నా డబ్లింగ్ పనులు కానీ, విద్యుద్దీకరణ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వైరి పార్టీలు విమర్శలు సంధిస్తున్నాయి. అలాగే నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ.. ఇలా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద ఉన్నా ఇక్కడి రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడంతో రైతులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి, సాగునీటి గురించి కాంగ్రెస్ పాలకులు ఆలోచించడమే మర్చిపోయారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుత ఎన్నికల్లో కాం గ్రెస్కు ప్రతిబంధకంగా మారనున్నాయి. అగమ్యగోచరంగా టీడీపీ పరిస్థితి ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడంతో కేవలం ఉనికి కోసమే ఇక్కడ బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తువల్ల ఇక్కడ టీడీపీకి ఒనగూడే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువనేది రాజకీయ విశ్లేషకుల భావన. నాగార్జునసాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న తేరా చిన్నపురెడ్డిని ఈసారి నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపుతూ టీడీపీ ప్రయోగం చేస్తోంది. అయితే నల్లగొండ అసెంబ్లీ సీటును బీజేపీకి ఇచ్చేయడంతో అక్కడి టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే కోదాడలో సిట్టింగు ఎమ్మెల్యే వేనేపల్లిని పక్కన పెట్టడంతో అక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. ఇవన్నీ తెలుగుదేశానికి ప్రతికూలాంశాలు కానున్నాయి. సంచలనం కోసం టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీగా తమకే పట్టం కడతారన్న ఆశ టీఆర్ఎస్లో కనిపిస్తోంది. అయితే రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని విద్యాసంస్థల అధినేత పల్లా రాజేశ్వర్రెడ్డికి టికెట్ ఇచ్చి సంచలనం కోసం వేచి చూస్తోంది. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో ఆ అభ్యర్థి అందరికీ పరిచయం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తెలంగాణ అభిమాన ఓటు గట్టెక్కించకపోతుందా అన్న ఆశ ఆ పార్టీలో ఉంది. కేడర్పైనే భారం వేసిన సీపీఎం సీపీఎం తొలిసారి జిల్లావ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను ఎన్నికల క్షేత్రంలోకి దింపింది. కేవలం కేడర్పైనే భారం వేసిన సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డిని ఇక్కడి లోక్సభ స్థానం నుంచి పోటీలో నిలిపింది. తమకున్న బలమైన కేడర్తోపాటు కొంత కష్టపడితే విజయం సాధించవచ్చనే ధీమా ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. వైఎస్ సంక్షేమ పథకాలే అండగా వైఎస్సార్ సీపీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పల్లెల్లో ఉన్న ఆదరణ ఓటుగా మారుతుందని వైఎస్సార్ సీపీ భావిస్తోంది. ఆ పార్టీ తరపున బరిలో ఉన్న గున్నం నాగిరెడ్డి.. వైస్సార్ సంక్షేమ పథకాలే తమను విజయ తీరానికి చేరుస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఎస్ఎల్బీసీతోపాటు ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు వైఎస్సార్ హయాంలో చకచకా సాగాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య కూడా ఎక్కువే కావడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. అలాగే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా తమకే పడుతుందని వైఎస్సార్ సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నే.. గెలిస్తే: బలాబలాలు గున్నం నాగిరెడ్డి (వైఎస్సార్ సీపీ) - విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తా - ఫ్లోరైడ్ సమస్యను నివారించేందుకు అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు అందించే కృషి చేస్తా - {పజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రుల్లో పడకల స్థాయిని పెంచుతా - రైతులకు ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తా. 9 గంటలు ఇవ్వడంపై దృషిపెడతా. - రహదారులను మెరుగుపరుస్తా. అనుకూలం - వైఎస్సార్పై ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అభిమానం -ఙ్ట్చఛగ్రామ గ్రామాన ఉన్న వైఎస్ఆర్ అభిమాన ఓట్లు - వైఎస్సార్ ఆరేళ్ల పాలనలో లభించిన సుబిక్షమైన పాలన - ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంటు, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల ఓట్లు ప్రతికూలం - రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలో లేకపోవడం గుత్తా సుఖేందర్ రెడ్డి (కాంగ్రెస్) - నల్లగొండ-మాచర్ల రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తా - పెండ్లిపాకల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడం, నక్కలగండి పనులు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తా - కొత్త జాతీయరహదారి నిర్మాణానికి కృషి చేస్తా - తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తా - నల్లగొండలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తా అనుకూలం - {పత్యేక రాష్ట్ర డిమాండ్తో ఉద్యమించిన టీ కాంగ్రెస్ ఎంపీల్లో ముఖ్యుడు కావడం - పార్టీలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో సత్సంబంధాలు - ఏడు సెగ్మెంట్ల కాంగ్రెస్ కార్యర్తలతో నేరుగా పరిచయాలు ఉండడం ప్రతికూలం - తెలంగాణ కార్యక్రమాల వరకే పరిమితం కావడం - చెప్పుకోదగిన అభివృద్ధి పనులు చేయకపోవడం - కొత్త అభ్యర్థులు, సీపీఐతో పొత్తు దేవరకొండలో ఫలించే అవకాశం లేకపోవడం - తెలంగాణ ఓటు చీలిపోవడం తేరా చిన్నపరెడ్డి (టీడీపీ) - ఫ్లోరైడ్ సమస్య నిర్మూలనకు కృషి - మండల కేంద్రాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ కేంద్రాలు - నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి అనుసంధానంగా కార్పొరేట్ స్థాయిలో నర్సింగ్ కాలేజీ - {పతి మండలానికి డిగ్రీ కాలేజీ, ఐటీఐ, పాలిటె క్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయిస్తా - {పతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి కట్టిస్తా అనుకూలం - నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చూపిన పోరాట పటిమ - వివాద రహితుడు, సౌమ్యుడు ప్రతికూలం - అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు బలహీనులు కావడం - సంస్థాగతంగా ఉన్న గ్రూపుల గొడవలు - తెలంగాణపై టీడీపీ అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం - బీజేపీతో పొత్తు పెద్దగా లాభించకపోవడం నంద్యాల నర్సింహారెడ్డి (సీపీఎం) - నల్లగొండ -మాచర్ల రైల్వేలైను ఏర్పాటు కృషి చేస్తా - కేంద్ర ప్రభుత్వ నిధులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయిస్తా - విద్యాభివృద్ధికి కృషిచేస్తా - భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తా - 9 వేల ఎకరాల అటవీ భూములను పేదలకు పంచిపెడతాం. - యురేనియం త వ్వకాలను నిలిపేస్తాం అనుకూలం - ముందు నుంచీ కమ్యూనిస్టులకు పట్టున్న నియోజకవర్గం కావడం - గ్రామ స్థాయిలో పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు ప్రతికూలం -సమైక్య రాష్ట్ర విధానానికే కట్టుబడి వెనుకబడి పోవడం - అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ చెల్లాచెదురు కావడం హామిర్యాలగూడ మినహా, ఇతర నియోజకవర్గాలో వెనుకబడి ఉండడం పల్లా రాజేశ్వరరెడ్డి (టీఆర్ఎస్) - ప్రజలకు ఫ్లోరైడ్ రహిత జలాలు అందిస్తా - ఎత్తిపోతల పథకాలకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తా - సూర్యాపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయిస్తా - నల్లగొండలో నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయిస్తా - దేవరకొండలో బత్తాయి మార్కెట్, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషిచేస్తా - సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా. - నియోజక వర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా అనుకూలం - తెలంగాణవాద ఓటు ప్రతికూలం - స్థానికేతరుడు కావడం - రాజకీయాలకు కొత్త. నియోజకవర్గ ప్రజలకు కొత్త ముఖం - పనిచేసే క్షేత్ర స్థాయి బలగం సరిగా లేకపోవడం