breaking news
Bofors sataghni
-
బోఫోర్స్ కేసులో కాంగ్రెస్కు ఊరట
-
సీబీఐ ‘బోఫోర్స్’ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నల కొనుగోలు కుంభకోణం కేసులో 2005 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అదే తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది, బీజేపీ నేత అజయ్ అగర్వాల్ పిటిషన్ వేశారనీ, ఆ పిటిషన్లో∙సీబీఐ కక్షిదారుగా చేరొచ్చని కోర్టు సూచించింది. హిందుజా సోదరులు సహా బోఫోర్స్ కేసులోని నిందితులందర్నీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో కేసువేసింది. సాధారణంగా హైకోర్టులో తీర్పు వెలువడిన తర్వాత 90 రోజుల్లోనే ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. అయితే సీబీఐ 13 ఏళ్ల తీవ్ర జాప్యం తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిందనీ, ఈ ఆలస్యానికి సరైన కారణం కూడా చెప్పలేకపోయిందంటూ కోర్టు సీబీఐ పిటిషన్ను తోసిపుచ్చింది. ‘ తీవ్ర జాప్యానికి సీబీఐ తెలిపిన కారణాలతో మేం సంతృప్తి చెందడం లేదు. ఇదే కేసుకు సంబంధించి అజయ్ అగర్వాల్ పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉంది. ఆ పిటిషన్లోనే సీబీఐ కూడా కక్షిదారుగా చేరి వాదనలు వినిపించవచ్చు. విచారణను పునఃప్రారంభించేందుకు అనుమతి కోరవచ్చు’ అని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హేమంత్ గుప్తాలు సభ్యులుగా గల ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు నాటి యూపీఏ ప్రభుత్వాలు తమకు అనుమతివ్వక పోవడం కారణంగానే 13 ఏళ్ల ఆలస్యమైందని సీబీఐ వాదించింది. -
రిపబ్లిక్ డే పరేడ్లో స్వదేశీ బోఫోర్స్ శతఘ్ని!
తొలిసారి ‘ధనుష్’ ప్రదర్శన భోపాల్: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో తొలిసారి దేశీయ బోఫోర్స్ శతఘ్ని.. ‘ధనుష్’ప్రత్యేక ఆకర్షణ కానుంది. తొలిసారి స్వదేశంలో తయారైన ఈ దీర్ఘ పరిధి శతఘ్నిని పరేడ్లో ప్రదర్శించ నున్నారు. ఈ 155 ఎంఎం శతఘ్నిని జబల్పూర్కు చెందిన గన్ కారేజ్ ఫ్యాక్టరీ (జీసీఎఫ్) రూపొందించింది. ఒక్కో దాని ధర రూ.14.5 కోట్లు. 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ప్రత్యేక అతిథులుగా గిరిజనులు: ఈ నెల 26న ఢిల్లీ రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు ప్రత్యేక అతిథులుగా హాజరుకావాలని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 40 మంది గిరిజనులను కేంద్రం ఆహ్వానించింది. పరేడ్, బీటింగ్ రిట్రీట్లను వీక్షంచనున్న వీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రులను కలుసుకుంటారు.