-
సరదాగా చదరంగంలోకి వచ్చా..!
సాక్షి, తుని: సరదాగా నేర్చుకున్న చదరంగం క్రీడ సమాజంలో గుర్తింపు ఇస్తుందని ఊహించలేదు.. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరకు మహిళా గ్రాండ్ మాస్టర్ కావడం వెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉందని బొడ్డా ప్రత్యూష అన్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరానికి చేరడం వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిదని ఆమె వివరించారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది. ప్రత్యూష తండ్రి ప్రసాద్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. విధులు ముగించుకుని ఇంటికొచ్చాక తన తండ్రి చదరంగం ఆడుతుండడం ప్రత్యూష ఆసక్తిగా గమనించేవారు. ఇలా ఏడేళ్ల వయసులో ఆమె సరదాగా చదరంగం అలవాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ క్రీడలో రాణిస్తూ వచ్చారు. ఇలా 16 ఏళ్ల పాటు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని మేటి చెస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఇంగ్లాండ్లో జరిగిన చెస్ టోర్నీలో విజయం సాధించి మహిళా గ్రాండ్ మాస్టర్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. మహిళా గ్రాండ్ మాస్టర్ ప్రత్యూష ప్రపంచ చాంపియన్ లక్ష్యం ప్రస్తుతం విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రత్యూష కుటుంబం ఉంటుంది. చిన్నతనంలో ప్రత్యూష తండ్రి ప్రసాద్, తాతయ్య వెంకటరమణలు ఈ క్రీడలో ప్రోత్సహించారు. అప్పట్లో శ్రీప్రకాష్ విద్యా సంస్థలో చదువుతూనే చెస్ టోర్నీల్లో పాల్గొని రాణించారు. ఇప్పటి వరకు 45 దేశాల్లో జరిగిన పోటీల్లో 25 అంతర్జాతీయ, 8 జాతీయ స్థాయి పతకాలను సాధించారు. 2016లో రెండు నార్మ్లు సాధించినా మూడో నార్మ్కు మూడేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం 2,230 రేటింగ్లో ఉన్న ప్రత్యూష 2,500 రేటింగ్కు చేరుకుంటే మూడు గ్రాండ్ మాస్టర్స్ నార్మ్లు సాధించి గ్రాండ్ మాస్టర్ కావాలని ఆశిస్తున్నారు. అదే సాధిస్తే ఆమె పురుషులతో కూడా ఆడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఉన్నారు. మూడో మహిళా గ్రాండ్ మాస్టర్గా ప్రత్యూష ఘనత సాధించారు. ప్రపంచ చాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభినందన మహిళా గ్రాండ్ మాస్టర్ సాధించిన ప్రత్యూష భవిష్యత్లో గ్రాండ్ మాస్టర్ కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. ఇటీవల అమరావతిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా సారథ్యంలో ముఖ్యమంత్రిని ప్రత్యూష కలిశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహమిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రత్యూషకు నాలుగో స్థానం
కరైకుడి (తమిళనాడు): జాతీయ మహిళల చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష నాలుగో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ చాంపియన్షిప్లో ప్రత్యూష ఎనిమిది పాయింట్లు సాధించింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రత్యూష ఏడు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో పరాజయం పాలైంది. 10 పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ భక్తి కులకర్ణి (ఎయిరిండియా) టైటిల్ నిలబెట్టుకోగా... 8.5 పాయింట్లతో వంతిక అగర్వాల్ (ఢిల్లీ), దివ్య దేశ్ముఖ్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా వంతిక రన్నరప్గా నిలిచింది. దివ్య దేశ్ముఖ్కు మూడో స్థానం లభించింది. ఈ టోర్నీలో పోటీపడిన ఇతర ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు జి.హర్షిత (7.5 పాయింట్లు) పదో స్థానంలో, వి.తోషాలి (6 పాయింట్లు) 38వ స్థానంలో నిలిచారు. -
ప్రత్యూషకు మరో గెలుపు
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. మహాలక్ష్మితో శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన ప్రత్యూష 40 ఎత్తుల్లో గెలిచింది. తొమ్మిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 3.5 పారుుంట్లతో 11వ స్థానంలో ఉంది. మరోవైపు పద్మిని రౌత్ ఏడు పారుుంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 12 మంది క్రీడాకారిణిల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నారుు. -
ఒలింపియాడ్కు ప్రత్యూష
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ పోటీల్లో పాల్గొనే భారత మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూషకు తొలిసారి స్థానం లభించింది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 14 వరకు అజర్బైజాన్లోని బాకు నగరంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా (ఢిల్లీ), పద్మిని (ఒడిషా) జట్టులోని ఇతర సభ్యులు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement