breaking news
bodan
-
బోధన్ BRS, MIMల మధ్య పెరుగుతోన్న దూరం
-
పట్టాలెక్కేదెప్పుడో?
నారాయణఖేడ్: దశాబ్దాలు గడుస్తున్న బోధన్–బీదర్ రైల్వేలైన్కు మోక్షం కలగడం లేదు. ప్రతీసారి బడ్జెట్లో ఆశలు నెరవేరుతాయని ఎదురుచూడడం.. నిరాశే మూటగట్టుకోవడ పరిపాటిగా మారింది. ఒకటికాదు రెండు కాదు ఎనిమిది దశాబ్దాలుగా బోధన్– బీదర్ రైల్వేలైన్ పట్టాలెక్కడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, నేతలు మారుతున్నా అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. స్వరాష్ట్రంలోనైనా కలనెరవేరుతుందని ఆశించినా అడియాసే ఎదురవుతోంది. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగించేందుకు 1938లో నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. బోధన్–బాన్సువాడ–పిట్లం– నారాయణఖేడ్–బీదర్ ప్రాంతాల ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి లైన్ క్లియర్ చేశారు. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్యకొత్తగా మరో రైల్వేలైన్ సర్వేకోసం ఆదేశించారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్ మీదుగా బీదర్వరకు సర్వే పూర్తి చేశారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. రూ.1,029 కోట్ల వ్యయంతో లైన్ వేయొచ్చని అధికారులు తేల్చారు. నారాయణఖేడ్ సమీపంలోని జి.హుక్రాన సమీపంలో ఈమేరకు అధికారులు హద్దురాళ్లు పాతడం, రోడ్లపై మార్కింగ్ సైతం వేశారు. దశలవారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గమధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితిపై అంచనా వేసి రైల్వేశాఖ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. సర్వే విషయమై అప్పటి ఎంపీ సురేష్ షెట్కార్ పార్లమెంట్లోనూ ప్రస్తావించారు. రాష్ట్రం నుంచి స్పందన కరువు.. 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. ఇప్పటివరకు నాలుగు బడ్జెట్లు పూర్తయినా పైసా విదిల్చింది లేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాలకు నిధులు కేటాయించిన కేంద్రం బోధన్–బీదర్ రైల్వే లైన్కు మాత్రం మొండిచేయి చూపించింది. రూ.1,029 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపొందించారు. జాప్యం కారణంగా వ్యయం రెట్టింపై రూ.2వేల కోట్లకు చేరింది. మారిన నిబంధనల ప్రకారం రైల్వేలైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులు కేటాయిస్తే కేంద్రం సగం కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువయ్యింది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో ఇప్పట్లో ఈ రైలుమార్గానికి మోక్షం కలిగేలా లేదు. రైల్వేలైన్ ఏళ్లనాటి కల రైల్వే లైన్ ఏర్పాటు ఏళ్లనాటి కల. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి. బోధన్–బీదర్ రైల్వేలైన్ ఏర్పాటు జరిగితే రవాణా పరంగా ఎంతో మేలు చేకూరుతుంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. –చిరంజీవి, తుర్కాపల్లి, నారాయణఖేడ్ -
నిజాం షుగర్స్పై రాజకీయ కుట్ర
బోధన్, న్యూస్లైన్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులు, ఫ్యాక్టరీలోని కార్మికుల్లో హర్షం వ్యక్తమైంది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుం దని, తమ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆనందించారు. అయితే రాష్ట్ర విభజన పూర్తికాకముందే నిజాం షుగర్స్ను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశంలో ఫ్యాక్టరీ అంశం చర్చకు వచ్చేలా, ప్రైవేటీకరణ కు అనుకూల వాతావరణం కల్పించేలా ఆ కంపెనీ చూసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త సర్కారు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటుందన్న భయంతో ఆ కంపెనీ కుట్రలు పన్నుతోందని రైతులు, తెలంగాణవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార పక్ష నేతలపై ఆగ్రహం బోధన్ పట్టణంలోని సీడీసీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న రైతుల తో సమావేశం ఏర్పాటు చేసి, ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా తీర్మానం చేయించారు. దీంతో ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకే ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం బోధన్ సీడీసీ కార్యాయలంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్రావు పట్వారీ, సీడీసీ చైర్మన్ పోతారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాశంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాషామోహినొద్దీన్ల ఆధ్వర్యంలో చెరుకు రైతుల సమావేశం ఏర్పాటు చేశారు. నిజాం షుగర్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా, ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలా అన్న అంశంపై అభిప్రాయాలు సేకరించారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న రైతులు కొందరిని పిలిచి ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా తీర్మానం చేయించారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శక్కర్నగర్లోని ఎన్డీఎస్ఎల్ ఎదుట బీఎంఎస్ కార్యదర్శి ఈరవేణి సత్యనారాయణ అధ్వర్యం లో కార్మికులు ఆందోళన చేశారు. ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా తీర్మానం చేసిన అధికార పక్ష నేతల చిత్రపటాన్ని దహనం చేశారు. ఫ్యాక్టరీ జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయ కుట్ర నిజాం షుగర్స్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం రాజకీయ కుట్ర చేస్తోందని ఎన్డీఎస్ఎల్ షుగర్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి రాజయ్య ఆరోపించారు. ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీ ఏనాడూ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ఫ్యాక్టరీ స్వాధీనంపై శాసనసభా సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నిజాం షుగర్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కేపీ శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం శక్కర్నగర్ ఎన్ఎస్ఎఫ్ విశ్రాంతి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పన్నేండేళ్ల కాలంలో ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఏనాడూ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. 2006-07 సీజన్లో టన్నుకు రూ.50 చొప్పున ప్రోత్సాహక రాయితీ ఇస్తామ ని ప్రకటించి ఎగొట్టిందని ఆరోపించారు. 2007-08 సీజన్లో టన్నుకు రూ. 120 ధర తగ్గించిందన్నారు. క్రషింగ్ ఆగిపోతుందేమోన నే భయంతోనే కొందరు రైతులు ఫ్యాక్టరీ యాజ మాన్యానికి అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. సమావేశంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి గోపాల్రెడ్డి, ప్రతినిధులు కొప్పర్తి సుబ్బారావు, కోట గంగారెడ్డి, మారుతి పటేల్ పాల్గోన్నారు. నేడు ఫ్యాక్టరీ ముట్టడి నిజాం షుగర్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఫ్యాక్టరీని ముట్టడించనున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి షకీల్ తెలిపారు. ప్రైవేటీకరణకు ఒప్పుకోం బోధన్ టౌన్ : ఎన్డీఎస్ఎల్ను పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఎం డివిజన్ కార్యదర్శి గంగాధర్ అప్పా ఆరోపించారు. దీనికి తాము ఒప్పుకోబోమని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాన్ని వెంట నే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాం డ్ చేశారు. శుక్రవారం ఆయన బోధన్లోని సాగర్ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ వేశారని, ఇది ఫ్యాక్టరీని ప్రైవేట్పరం చేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు ఫ్యాక్టరీని కట్టబెట్టేందుకే కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు రెండు రైతు కూలీ సంఘాలుగా విడిపోయి ప్రైవేటీకరణకోసం డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపిం చారు. ప్రైవేటీకరణకు అనుకూలంగా రైతులు తీర్మానం చేయడం వెనక మంత్రి సుదర్శన్రెడ్డి హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు శంకర్గౌడ్, గంగాధర్, శ్రీనివాస్, కిష్టాగౌడ్, లింగం పాల్గొన్నారు.