breaking news
Bisvajit
-
తొలి ఆకుపచ్చని చిత్రం
బిస్వజీత్ బోరా అస్సాం దర్శకుడు. మాయా ఖోలీ అరుణాచల్ ప్రదేశ్ నిర్మాత. ఇద్దరూ కలిసి నిర్మిస్తున్న ‘ఐసా యే జహాన్’ అనే చిత్రం ఈ ఏడాది మే నెలలో విడుదల కాబోతోంది. ఇంతవరకు వీళ్లు బాలీవుడ్ చిత్రం తీసింది లేదు. కానీ ఈ చిత్రంతో చరిత్రను సృష్టించబోతున్నారు. ఎలాగంటే, ‘ఐసా యే జహాన్’... భారతదేశపు తొలి కార్బన్-న్యూట్రల్ చిత్రం కాబోతోంది! కార్బన్-న్యూట్రల్ అంటే? దీనికి అర్థం తెలుసుకోవాలంటే ముందు ‘కార్బన్ ఫుట్ప్రింట్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక మనిషి తన అలవాట్లు, చర్యలు, కదలికలు, వస్తు వినిమయాల ద్వారా పర్యావరణంలోకి విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ మోతాదును ఆ మనిషి ‘కార్బన్ ఫుట్ప్రింట్’ అంటారు. అయితే అంతే మోతాదులో ఆ మనిషి పర్యావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్ను తొలగించగలిగితే అది ‘కార్బన్-న్యూట్రల్’ అవుతుంది. అంటే చెల్లుకు చెల్లు. ‘ఐసా యే జహాన్’ టీమ్ చేస్తోంది కూడా ఇదే. సినిమా నిర్మాణ సమయంలో నటీనటులు, సెట్టింగుల ద్వారా వెలువడిన కార్బన్ ఫుట్ప్రింట్ కు సమాన స్థాయిలో పర్యావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్ను తొలగించడానికి మొక్కలు నాటడం వంటి పర్యావరణ హిత కార్యక్రమాలను వీరు చేపట్టారు. నాటిన వెంటనే కార్బన్ న్యూట్రల్ జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు వీరు విడుదల చేసిన కార్బన్కు సమాన స్థాయిలో భవిష్యత్తులో ఆ మొక్కల ద్వారా కార్బన్ నివారణ జరుగుతుంది. ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు ముంబై, ఆ చుట్టుపక్కల ఇప్పటి వరకు 400 మొక్కల వరకు నాటింది. పల్లెల పచ్చదనానికి దూరమైన కాంక్రీటు జనారణ్యంలో చిక్కుకు పోయిన పట్టణ కుటుంబాల చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు బోరా అంటున్నారు. ‘ఐసా యే జహాన్’ మన దగ్గర తొలి కార్బన్ న్యూట్రల్ చిత్రమే అయినప్పటికీ, హాలీవుడ్లో ఇప్పటికే అలాంటి చిత్రాలు కొన్ని వచ్చాయి. సిరియానా, ది డే ది ఎర్త్ స్టుడ్ స్టిల్, ది డే ఆఫ్టర్ టుమారో... కార్బన్ న్యూట్రల్ చిత్రాలే! -
టీ20 మ్యాచ్లాంటివి!
న్యూఢిల్లీ: నిన్నటితరం నటుడు బిశ్వజీత్ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సరికొత్త నిర్వచన ఇచ్చారు. ఎన్నికలంటే టీ20 మ్యాచ్లాంటివని, ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమన్నారు. తన సినీజీవితంలో ఎన్నో మ్యూజికల్ హిట్లు ఇచ్చి, ప్రేక్షకులను అలరించిన బిశ్వజీత్ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ నుంచి దక్షిణ ఢిల్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. హేమాహేమీలు బరిలో ఉన్న నియోజకవర్గంలో తన గెలుపుపై ఆయన స్పందిస్తూ... టీ20 మ్యాచ్లాంటి ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలవొచ్చునని జోస్యం చెప్పారు. క్రికెట్ మ్యాచ్లో ఏదీ అసాధ్యం ఎలా కాదో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. ఆశా పరేఖ్, వహీదా రెహ్మాన్ వంటి పేరున్న నటీమణులతో నటించి, బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న బిశ్వజీత్ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోరికమేరకు రాజకీయాల్లోకి వచ్చారు. దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్, బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆశిష్ కేతన్లాంటి దిగ్గజాలను ఢీకొంటున్నారు. వీరితో పోటీ పడడంపై ఆయన మాట్లాడుతూ... ‘బరిలో ఉన్నవారిలో ఎవరి చరిత్ర ఏమిటి? ఎవరు బలవంతులు? అనే విషయాలను తాను విశ్వసించనని, టీ20 మ్యాచ్లో ఒక్కోసారి ధావన్ మ్యాచ్ను ముగించవచ్చు లేదంటే ధోనీ ముగించవచ్చు. ఆ రోజు ఎవరిదో వారే విజేతలు. ఈ ఎన్నికలు అంతే.. మిగతావారిలాగే నేనూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ప్రచారం కోసం రోజు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నాను. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. గెలుపుపై ప్రత్యర్థులకు ఎంత ధీమా ఉందో నాకూ అంతే ఉందన్నారు.