-
జవహర్నగర్లో భారీ చోరీ
హైదరాబాద్: జవహర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. నాగారం లక్ష్మీనగర్ కాలనీలోని రచ్చ సుభద్రారెడ్డి అనే మహిళ ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి సుమారు రూ.10 లక్షల నగదు, 8 తులాల బంగారం అపహరించారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ క్రైమ్ డీసీపీ జానకి, కుషాయిగూడ ఏసీపీ రఫిక్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీ
► రూ.4 లక్షల నగదు మాయం ► 13 సవర్ల బంగారం కూడా.. ఒంగోలు : నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధి సుందర్ నగర్లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న డీఎంసీ రంగన్న ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లోని హాల్లో నిద్రిస్తుండగా ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన దొంగ బీరువాలోని రూ.4 లక్షల నగదును అపహరించుకెళ్లాడు. రంగన్న దంపతులు ముందు హాలులో నిద్రిస్తున్నారు. బాత్ రూమ్కు వెళ్లినప్పుడు వెనుక తలుపులు వేయటం మరిచిపోయారో ఏమోగానీ వెనుక నుంచి సులభంగా లోనికి ప్రవేశించిన దుండగుడు బెడ్రూమ్లోని దిండు కింద ఉన్న తాళాలు తీసుకొని బీరువా తెరిచాడు. బీరువాలోని బ్యాగులో కుటుంబ అవసరాలకు తెచ్చి పెట్టుకున్న నగదును అపహరించుకెళ్లాడు. నగదుతో పాటు బీరువాలోనే ఉన్న 13 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.25 వేల విలువైన వెండి వస్తువులు కూడా పట్టుకెళ్లాడు. తెల్లవారి లేచి చూసుకునే సరికి వెనుక తలుపులు తీసి ఉన్నాయి. బీరువా కూడా తెరిచి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గుర్తించి ఆ సమాచారాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఇచ్చారు. దొంగతనం చేసేందుకు వచ్చిన దుండగుడు అతను తెచ్చుకున్న తాళాలను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఎస్సైలు నాగేశ్వరరావు, సురేష్లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని బీరువాపై వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురంలో భారీ చోరీ
ధర్మవరం : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ధర్మవరం మండలం కేశవనగర్లోని ఓ వ్యాపారి ఇంట్లో ఆదివారం రాత్రి చోరికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.... స్థానికంగా నివాసముంటున్న రమేష్ ఇంట్లోకి అర్థరాత్రి దొంగలు ప్రవేశించి 75 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ. 1.65 లక్షలు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి బెడ్రూంలో నిద్రిస్తుండగా.. కిటికీలు తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు. కుమారై పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగదు, నగలు చోరికి గురికావడంతో రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్టీంని రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నారు. -
పిఠాపురంలో భారీ చోరీ
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పిఠాపురం సీతయ్యగారితోటలోని ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి బీరువాలో దాచిన రూ.51 వేల నగదు, 22 కాసుల బంగారు నగలు దోచుకెళ్లారు. బాధితులు సోమవారం ఉదయం స్ధానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement