-
‘వరికెపూడిశెల’కు పర్యావరణ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పల్నాడు ప్రాంతానికి నీరందించే వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మంత్రిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే సంబంధిత డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి గంగలగుంట సమీపంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ ముందు ఉన్న నది ప్రాంతాన్ని.. అనేక అధ్యయనాల తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. సాగర్ రిజర్వాయర్ ఒడ్డున ఉన్న స్థలం, ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ప్రతిపాదిత జాక్వెల్ పంప్ హౌస్కు నది నీటి ప్రవాహం 10 మీటర్ల వద్ద ఉందని తెలిపారు. ఇది పంట కాలం అంతటా తగినంత నీరు అందుబాటులో ఉండేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు కింద 24,900 ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చి సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జలశక్తి మంత్రితో భేటీ.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో మంత్రి అంబటి భేటీ అయ్యారు. బుధవారం లోక్సభలో వైఎస్సార్సీపీ పక్షనేత మిథున్రెడ్డితో కలిసి షెకావత్ను కలిశారు. మంత్రిగా తొలిసారి ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినట్లు అంబటి చెప్పారు. -
జీఎస్టీపై నేడు కాంగ్రెస్ అసమ్మతి పత్రం!
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై అసమ్మతి పత్రం (డిసెంట్ నోట్) ఇవ్వటానికి కాంగ్రెస్ సంసిద్ధమైంది. బిల్లులో తాము కోరిన ఐదు మార్పుల్లో దేనినీ ఎంపిక కమిటీ ఆమోదించేలా లేకపోవటంతో అసమ్మతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ మినహాయింపు ఉన్న పొగాకు, విద్యుత్ను జీఎస్టీలో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లులో ఉన్న విధంగా.. వివాద పరిష్కారం నిబంధనను కూడా కొత్త బిల్లులో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. జీఎస్టీ 18 శాతం మించరాదని గరిష్ట పరిమితిని బిల్లులో విధించాల్సిందిగా పట్టుపడుతోంది. వీటిలో ఏవీ అంగీకరించే అవకాశాలు కనిపించకపోవటంతో.. బీజేపీ ఎంపీ భూపీందర్యాదవ్ నేతృత్వంలో శుక్రవారం సమావేశం కానున్న 21 మంది సభ్యుల ఎంపిక కమిటీ భేటీలో అసమ్మతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement