-
ఇన్ఫ్రాటెల్- అదానీ పోర్ట్స్ జూమ్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్చేసి 44,537ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. నిఫ్టీ 135 పాయింట్లు ఎగసి 13,061 వద్ద ట్రేడవుతోంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మార్క్ను నిఫ్టీ అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ట్రాన్స్పోర్టేషన్, రవాణా మౌలిక సదుపాయాల విభాగంలో దేశీయంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్కు 14వ ర్యాంక్ లభించినట్లు డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండైసెస్(డీజేఎస్ఐ) తాజాగా పేర్కొంది. ఎస్ఏఎం కార్పొరేట్ సస్టెయినబిలిటీ ఆధారంగా డోజోన్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో అదానీ పోర్ట్స్కు మాత్రమే చోటు దక్కినట్లు తెలియజేసింది. దీంతో డీజేఎస్ఐ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఇకపై అదానీ పోర్ట్స్ కౌంటర్పై దృష్టి పెట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ కౌంటర్కు డిమాండ్ నెలకొంది. వెరసి అదానీ పోర్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతంపైగా జంప్చేసింది. రూ. 402ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం ఎగసి రూ. 396 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్తో విలీనం పూర్తి చేసుకోవడం ద్వారా భారతీ ఇన్ఫ్రాటెల్ అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో ఏర్పాటైన సంయుక్త సంస్థలో భారతీ ఎయిర్టెల్కు 36.7 శాతం, వొడాఫోన్ గ్రూప్నకు 28.12 శాతం చొప్పున వాటా లభించింది. ఈ బాటలో పీఎస్ ఏషియా హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మారిషస్కు 3.25 శాతం వాటా దక్కింది. టవర్ల రంగంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్కు డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్చేసి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 238 వరకూ ఎగసింది. విలీనం పూర్తయిన వార్తలతో గత మూడు రోజులుగా ఈ కౌంటర్ జోరు చూపుతోంది. వెరసి 28 శాతంపైగా లాభపడింది. -
బీఈఎల్- భారతీ ఇన్ఫ్రాటెల్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే సానుకూల వార్తల కారణంగా ఓవైపు పీఎస్యూ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్), మరోపక్క టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ పూర్తి ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్ తాజాగా తెలియజేసింది. ఎల్సీఏ, ఆకాష్ వెపన్ సిస్టమ్, స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తదితరాల నుంచి రూ. 15,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఆశిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని అంచనా వేసింది. అంతేకాకుండా 20-21 శాతం స్థాయిలో ఇబిటా మార్జిన్లు సాధించగలమని అభిప్రాయపడింది. దీంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీఈఎల్ షేరు 6 శాతం జంప్చేసి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. వెరసి రెండు రోజుల్లో 13 శాతం లాభపడినట్లయ్యింది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 443 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. భారతీ ఇన్ఫ్రాటెల్ టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ ఇండస్ టవర్స్తో విజయవంతంగా విలీనాన్ని పూర్తిచేసుకున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. తద్వారా ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఈ సంయుక్త సంస్థలో మాతృ సంస్థ భారతీ ఎయిర్టెల్కు 36.73 శాతం వాటా లభించగా.. వొడాఫోన్ గ్రూప్ 28.2 శాతం వాటాను పొందింది. ప్రావిడెన్స్కు సైతం 3.25 శాతం వాటా దక్కింది. ఈ నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 210 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 214 వరకూ ఎగసింది. నేటి ట్రేడింగ్ తొలి గంటలోనే (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) ఈ కౌంటర్లో 10 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! -
కెనరా బ్యాంక్- ఇన్ఫ్రాటెల్.. బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు దీర్ఘకాలంగా వేచిచూస్తున్న ఇండస్ టవర్స్తో విలీన అంశం మరోసారి వాయిదా పడటంతో టెలికం రంగ మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో పీఎస్యూ కెనరా బ్యాంక్ రూ. 3259 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2108-19) క్యూ4లో రూ. 552 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. పన్నుకు ముందు నష్టం సైతం రూ. 2550 కోట్ల నుంచి రూ. 3335 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) తగ్గడం, ఉద్యోగ వ్యయాలు పెరగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్ఐఐ 9 శాతం తక్కువగా రూ. 3319 కోట్లను తాకింది. ఉద్యోగ వ్యయాలు రెట్టింపై రూ. 2175 కోట్లను తాకగా.. ఇతర ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 2175 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కెనరా బ్యాంక్ కౌంటర్ బలహీనపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 104 వద్ద ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ షేరు 4 శాతం తిరోగమించి రూ. 110 దిగువన స్థిరపడింది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్తో విలీనానికి ఇంతక్రితం నిర్ణయించిన జూన్ 24 గడువును తాజాగా రెండు నెలలు పొడిగిస్తున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. బుధవారం సమావేశమైన బోర్డు ఆగస్ట్ 31వరకూ విలీన గడువును పొడిగించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. నిజానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇండస్ టవర్స్ విలీన అంశానికి గడువును ఈ 24 వరకూ పొడిగిస్తున్నట్లు ఏప్రిల్ 24న భారతీ ఇన్ఫ్రాటెల్ తెలియజేసింది. టెలికం టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్లో వొడాఫోన్ ఐడియాకు సైతం 11.15 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 222 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 218 వరకూ జారింది. కాగా.. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా భారతీ ఇన్ఫ్రాటెల్ షేరుకి అండర్వెయిట్ రేటింగ్ను ఇచ్చింది. రూ. 175 టార్గెట్ ధరను సైతం ప్రకటించింది. -
ఇన్ఫ్రాటెల్ పతనం- శంకర బిల్డ్ ఖుషీ
ఇండస్ టవర్స్ విలీనంపై కొనసాగుతున్న అనిశ్చితికి మరోమారు తెరతీస్తూ.. నేడు నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ తాజాగా వెల్లడించింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ శంకర బిల్డ్ ప్రో కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఇన్ఫ్రాటెల్ షేరు నష్టాలతో కళతప్పగా.. శంకర బిల్డ్ భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. భారతీ ఇన్ఫ్రాటెల్ టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ నేడు నిర్వహించవలసిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నేడు నిర్వహించతలపెట్టిన సమావేశంలో ఇండస్ టవర్స్ విలీనంపై బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తొలుత పేర్కొంది. అయితే బోర్డు తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొన్ని ఇన్పుట్ల అవసరమున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ వివరించింది. దీంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ నెల 24లోగా తిరిగి బోర్డు సమావేశాన్ని చేపట్టనున్నట్లు బీఎస్ఈకి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రాటెల్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమైంది. రూ. 214 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఈ నెల 4న ఇండస్ టవర్స్ విలీనంపై అనిశ్చితి కొనసాగుతున్నట్లు కంపెనీ వివరించింది. కాగా.. 2019 మార్చికల్లా ముగియవలసిన విలీన ప్రక్రియ నాలుగోసారి వాయిదా పడటం గమనార్హమని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి! శంకర బిల్డ్ ప్రొ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 61 ఎగసి రూ. 364 వద్ద ఫ్రీజయ్యింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన శంకర బిల్డ్ ప్రొ పన్నుకు ముందు లాభం(పీబీటీ) మూడు రెట్లు ఎగసి రూ. 15 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 74 శాతం పెరిగి రూ. 27 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 2.6 శాతం నుంచి 4.06 శాతానికి మెరుగయ్యాయి. ఈ కాలంలో మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 667 కోట్లను తాకింది. -
ఇన్ఫ్రాటెల్- యూపీఎల్.. ఖుషీఖుషీగా
జూన్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. అయితే ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీ ఇన్ఫ్రాటెల్, యూపీఎల్ లిమిటెడ్ కౌంటర్లు టాప్ పెర్ఫార్మర్లుగా నిలుస్తున్నాయి. టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఇన్వెస్ట్చేయనున్న వార్తలు మొబైల్ టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్కు జోష్నివ్వగా.. క్యూ4 ఫలితాలకుతోడు.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బయ్ రేటింగ్.. యూపీఎల్ షేరుకి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. భారతీ ఇన్ఫ్రాటెల్ వొడాఫోన్ ఐడియాలో గూగుల్ 5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలతో టెలికం మౌలికసదుపాయాల కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్చేసి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 242ను అధిగమించింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. మార్చి 19న నమోదైన కనిష్టం రూ. 121 నుంచి చూస్తే 100 శాతం దూసుకెళ్లింది. టెలికం టవర్లు, కమ్యూనికేషన్స్ పరికరాల ద్వారా మొబైల్ కంపెనీలకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. కంపెనీకి గల అతిపెద్ద కస్టమర్ల జాబితాలో మొబైల్ దిగ్గజాలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లను ప్రధానంగా ప్రస్తావించవచ్చు. దీంతో ఇటీవల దేశీ మొబైల్ టెలికం కంపెనీలలో పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు ఇన్ఫ్రాటెల్ బిజినెస్కు డిమాండ్ను పెంచే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా షేరు ఇటీవల జోరు చూపుతున్నట్లు తెలియజేశారు. యూపీఎల్ లిమిటెడ్ గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో అగ్రి కెమికల్స్ దిగ్గజం యూపీఎల్ రూ. 761 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 31 శాతం పెరిగి రూ. 11141 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యూపీఎల్ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తూ రూ. 466 టార్గెట్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న యూపీఎల్ షేరు తాజాగా ఎన్ఎస్ఈలో 6.4 శాతం జంప్చేసి రూ. 416కు చేరింది. తొలుత రూ. 420కు ఎగసింది. దీర్ఘకాలంలో కంపెనీ అమ్మకాలు 7-10 శాతం మధ్య పుంజుకోగలవని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. తద్వారా మార్కెట్ వాటాను మరింత పెంచుకోగలదని ఆశిస్తోంది. అరిస్టా లైఫ్సైన్స్ కొనుగోలు ద్వారా కంపెనీ ఇటీవల కొలంబియా, మెక్సికోలతోపాటు దేశీయంగా మార్కెట్ వాటాను పటిష్టం చేసుకుంటున్నట్లు అభిప్రాయపడింది. ముడివ్యయాలు తగ్గుతున్న కారణంగా రానున్న రెండేళ్లలో ఇబిటా మార్జిన్లు 0.8 శాతం బలపడగలవని ఊహిస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement