-
భారత్ బయోటెక్.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం - అందుకేనా?
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఒక ఆవాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దీని వల్ల ఉపయోగం ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాలు, విద్యా పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా.. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం బయో థెరప్యూటిక్స్ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను సరైన సమయంలో రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతాయి. ప్రాణాంతక వ్యాధుల భారీ నుంచి కాపాడానికి వ్యాక్సిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనా మహమ్మారి సమయంలో చాలా దేశాలకు వ్యాక్సిన్స్ అందించిన ఘనత భారత్ సొంతం. ఈ సమయంలోనే మన దేశం సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం సందర్భంగా.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ 'కృష్ణ ఎల్లా' మాట్లాడుతూ.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో ఏర్పడిన ఈ బంధం పరిశోధనలను సులభతరం చేస్తుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, సైన్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు. కొత్త వ్యాక్సిన్లు, బయోథెరఫిటిక్స్ అభివృద్ధిలో మా నైపుణ్యాన్ని హైలైట్ చేయడానికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్తో కలిసి, ప్రపంచ ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే లక్ష్యమని.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ 'జామీ ట్రిక్కాస్' అన్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ప్రపంచ డిమాండ్లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను అందించగలిగాయి. ఏకంగా 2.4 బిలియన్ డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేసిన రికార్డ్ భారత్ సొంతమైంది. దీంతో దేశ ఖ్యాతిని గుర్తించిన చాలా సంస్థలు, ఇండియన్ కంపెనీలతో చేతులు కలపడానికి ఆసక్తి చూపాయి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించుకోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి రూపకల్పన కోసం భారతదేశం ఆర్&డీ పెట్టుబడులను కొనసాగిస్తోంది. -
Global Investors Summit: ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఏపీలో పెట్టుబడులపై వివిధ కంపెనీలు తన పెట్టుబడులను ప్రకటించారు. జిందాల్ కంపెనీ రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం భేష్. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. 10వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి కల్పించబోతున్నట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్ వన్గా ఉందన్నారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు మాట్లాడుతూ.. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. సీఎం జగన్ విజన్ అద్భుతం. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం అని అన్నారు. సియాంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మా కంపెనీలకు మరింత విస్తరిస్తాం. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జరుగుతోందన్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచాలనికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందన్నారు. నైపుణ్యానికి ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. -
కోవాగ్జిన్కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
న్యూఢిల్లీ/జెనీవా: హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవాగ్జిన్’కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. కోవాగ్జిన్ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్(ఈయూఎల్)లో చేర్చినట్లు డబ్ల్యూహెచ్ఓ బుధవారం ప్రకటించింది. కోవాగ్జిన్కు ఈయూఎల్ హోదా కల్పించవచ్చంటూ డబ్ల్యూహెచ్ఓకు చెందిన స్వతంత్ర సాంకేతిక సలహా బృందం(టీఏజీ) ప్రతిపాదించడంతో టీకాకు మార్గం సుగమమైంది. గర్భిణులకు.. ఇప్పుడే చెప్పలేం కోవాగ్జిన్కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినందుకు గాను డబ్ల్యూహెచ్ఓకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు, దేశ ప్రజల విశ్వాసానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ దీపావళి అని పేర్కొన్నారు. దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ భారత్కు అభినందనలు తెలియజేశారు. కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో కోవాగ్జిన్ చక్కగా పని చేస్తున్నట్లు సాంకేతిక సలహా బృందం గుర్తించింది. దీంతో ఎలాంటి రిస్కు లేదని తేల్చింది. 18 ఏళ్లు దాటిన వారంతా ఈ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ మరో ట్వీట్లో సూచించింది. నాలుగు వారాల వ్యవధితో రెండు డోసులు తీసుకోవాలని పేర్కొంది. అయితే, గర్భిణులకు కోవాగ్జిన్ ఇవ్వొచ్చా లేదా అనేది చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం సరిపోదని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న 14 రోజుల తర్వాత కోవాగ్జిన్ టీకా కరోనాపై దాదాపు 78 శాతం సమర్థతను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్ను నిల్వ చేయడం చాలా తేలిక అని, అందుకే తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలకు ఈ టీకా చక్కగా సరిపోతుందని వివరించింది. లక్షణాలు కనిపించే కరోనాపై 77.8 శాతం, డెల్టా వేరియంట్పై 65.2 శాతం కోవాగ్జిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే రోమ్లో జి–20 సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయెసస్తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కోవాగ్జిన్కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి రావడం విశేషం. కోవాగ్జిన్ షెల్ఫ్ లైఫ్ 12 నెలలు కోవాగ్జిన్ టీకా షెల్ఫ్ లైఫ్ను తయారీ తేదీ నుంచి 12 నెలల దాకా పొడిగించేందుకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అంగీకరించినట్లు భారత్ బయోటెక్ సంస్థ బుధవారం వెల్లడించింది. కోవాగ్జిన్ షెల్ఫ్లైఫ్ అనుమతి తొలుత ఆరు నెలలకే లభించింది. తర్వాత దీన్ని తొమ్మిది నెలలు పొడిగించారు. తాజాగా ఒక సంవత్సరం(12 నెలల) పొడిగించడం విశేషం. అంటే టీకాను తయారు చేసిన తర్వాత 12 నెలల్లోగా ఉపయోగించవచ్చు. (చదవండి: కోవాగ్జిన్ను గుర్తించిన ఆస్ట్రేలియా) విదేశాలకు వెళ్లేవారికి ఇక్కట్లు తప్పినట్లేనా? భారత్లో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా కోవాగ్జిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతి దక్కడం పట్ల ఊరట వ్యక్తమవుతోంది. భారత్లో ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది ఈ టీకా తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగస్థులు, గృహిణులు, కార్మికులు.. ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు. అయితే, కోవాగ్జిన్కు డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి రావడంలో తీవ్ర జాప్యం జరగడంతో విదేశాలకు వెళ్లేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారు విదేశాలకు వెళ్లిన తర్వాత తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. సొంత ఖర్చుతో కరోనా పరీక్ష చేయించుకొని నెగెటివ్ ఆర్టీ–పీసీఆర్ రిపోర్టు ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఆమోదం పొంది కరోనా టీకాను తీసుకోక తప్పలేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించిన కరోనా టీకాలను ప్రపంచంలో దాదాపు చాలా దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. అయితే అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రం వారి సొంత ఔషధ నియంత్రణ సంస్థలు కూడా ఆమోదం తెలిపితేనే... ఏ టీకానైనా అనుమతిస్తారు. అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ), యూరోప్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) అనుమతులను కోవాగ్జిన్ పొందాల్సి ఉంటుంది. తర్వాతే కోవాగ్జిన్ తీసుకున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లుగా అమెరికా, యూరోప్ దేశాలు పరిగణిస్తాయి. మిగతా దేశాల్లో మాత్రం ఈ టీకా తీసుకున్న భారతీయులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్లీ మరోసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పని ఉండదు. చదవండి: ‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’ -
చిన్నారులకు కోవాగ్జిన్.. అనుమతించిన నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్ 2,3వ దశ ట్రయల్స్ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్ బయోటెక్. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్తో రెండు డోసుల వ్యాక్సిన్ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. (చదవండి: కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) ఈ నేపథ్యంలో ‘‘పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్ ఇచ్చేందుకుభారత్ బయోటెక్ కంపెనీకి అనుమతులిచ్చాం” అని సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం -
Oral Vaccine: ప్రయోగాలకు ఐసీఎంఆర్ రెడీ!
కొవిడ్-19 జబ్బు కోసం ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ను ఇదివరకే భారత్ బయోటెక్ రూపొందించింది. ప్రస్తుతం అది క్లినికల్ ట్రయల్స్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు నోటి ద్వారా అందించే టీకాను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది ఐసీఎంఆర్. . కోల్కతా: ఈ మేరకు ఒక ప్రతిపాదనను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి పంపినట్లు భారత వైద్య పరిశోధన మండలి-కలరా అండ్ ఎంటెరిక్ సీసీజెస్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. జర్మనీకి చెందిన ఒక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని ఐసీఎంఆర్–ఎన్ఐసీఈడీ డైరెక్టర్ శాంతా దత్తా వెల్లడించారు. ప్రయోగానుమతి లభించి, నిధుల లభ్యత కాగానే పని ఆరంభిస్తామన్నారు. ఒక్కసారి టీకా తయారయ్యాక జంతువులపై ప్రయోగిస్తారని తెలిపారు. మాములు టీకా తయారీలో ఉన్నట్లే ఇందులో అన్నిరకాల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ల్యాబ్లో ఓరల్ వ్యాక్సిన్ తయారీకి కనీసం 5–6 సంవత్సరాలు పడతుందని ఆమె వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement