breaking news
bhanu Prakash Reddy
-
ఆ.. ఇప్పుడు గుర్తొచ్చింది!
సాక్షి,హైదరాబాద్: అంబర్పేట పోలీసుస్టేషన్లో క్రైం సబ్–ఇన్స్పెక్టర్గా పని చేసిన భాను ప్రకాష్ రెడ్డి నోరు విప్పాడు. తన సరీ్వస్ తుపాకీని విజయవాడ తీసుకువెళ్లానని, అక్కడి ఓ లాడ్జిలో మర్చిపోయానని వెల్లడించాడు. దీంతో ఆ పిస్టల్ను వెతుకుతూ నగరం నుంచి రెండు ప్రత్యేక బృందాలు గురువారం అక్కడకు వెళ్లాయి. మరోపక్క ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారిన భాను ప్రకాష్ రెడ్డి గడిచిన మూడేళ్లల్లో ఏకంగా రూ.1.23 కోట్లు నష్టపోయినట్లు వెలుగులోకి వచ్చింది. పుస్తకాల బ్యాగ్లో పిస్టల్ ఉంచి.. అంబర్పేట ఠాణాలో పని చేస్తూ భాను ప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీ పరీక్షలు రాశాడు. వాటికి సిద్ధం కావడానికే ఈ ఏడాది మే నుంచి రెండు నెలల పాటు సెలవులో ఉన్నాడు. నిత్యం తన టేబుల్ అరలో ఉండే తుపాకీని సెలవులో వెళ్తున్న సమయంలో తనతో పాటే తీసుకువెళ్లాడు. ఈ దృశ్యాలు పోలీసుస్టేషన్ సీసీ కెమెరాల్లో అస్పష్టంగా రికార్డు అయ్యాయి. పోటీ పరీక్షలు రాయడానికి విజయవాడ వెళ్లిన భాను ప్రకాష్రెడ్డి అక్కడి ఓ లాడ్జిలో దాదాపు వారం రోజులు బస చేశాడు. పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడల్లా ఆ పిస్టల్ను పుస్తకాల కోసం కేటాయించిన బ్యాగ్లో ఉంచాడు. లాడ్జి ఖాళీ చేసి తిరిగి ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో తుపాకీ ఉంచిన బ్యాగ్ను తనతో తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఏమీ ఎరగనట్లు.. నగరానికి చేరుకుని, డ్యూటీలో చేరిన నాలుగైదు రోజుల తర్వాత భాను ప్రకాష్కు తన పిస్టల్ పోయిన విషయం తెలిసింది. ఆలోచించిన అతగాడు పుస్తకాలతో పాటు తుపాకీ ఉన్న బ్యాగ్ను విజయవాడ లాడ్జిలో మర్చిపోయిన విషయం గుర్తించాడు. వెంటనే ఆ లాడ్జికి వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో దాని ఆచూకీ లభించలేదు. దీనిపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇక్కడ అధికారులకు చెప్పినా తన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని, భవిష్యత్తులో మరో ఉన్నత ఉద్యోగంలో చేరడానికి అడ్డు వస్తుందని భావించాడు. దీంతో ఏమీ ఎరగనట్లు మిన్నకుండిపోయాడు. తమదైన శైలిలో ప్రశ్నించడంతో.. ఈ నెల 12న ఆయుధాల ఆడిటింగ్ జరగడంతో ఇతడి పిస్టల్ మిస్సైన విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి రకరకాలుగా చెబుతూ ఉన్నతాధికారులతో పాటు సహోద్యోగులను ఇతగాడు ముప్పతిప్పలు పెట్టాడు. ఆ తుపాకీని తాను పోలీసుస్టేషన్లోనే ఉంచానని, ఎవరో ఎత్తుకుపోయారని నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఇతగాడికి రికవరీ చేసిన బంగారం కుదువపెట్టిన చరిత్ర ఉండటంతో ఈ తుపాకీ కూడా తాకట్టు పెట్టి ఉంటాడని అధికారులు అనుమానించారు. అతగాడిని బుధవారం రాత్రి సికింద్రాబాద్లోని టాస్్కఫోర్స్ కార్యాలయానికి తరలించి తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం మొత్తం అతగాడు బయటపెట్టాడు. ఇప్పుడు గుర్తుకు వచి్చందని.. ఆ తుపాకీని విజయవాడలో మర్చిపోయానని వెల్లడించాడు. టేబుల్ సొరుగులో తూటాలు నగరం దాటి బయటకు వెళ్లేప్పుడు తన వెంట తుపాకీ తీసుకువెళ్లడం భాను ప్రకాష్కు అలవాటు. అలాంటి సందర్భాల్లో అందులో మ్యాగ్జైన్ ఉన్నప్పటికీ... తూటాలు మాత్రం తీసుకువెళ్లడు. ఈసారి తూటాలు అతడి టేబుల్ సొరుగులో ఉన్నతాధికారులకు లభించాయి. దీంతో కొంత వరకు ఊపిరి పీల్చుకున్న అధికారులు తుపాకీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్కు అలవాటుపడిన భాను ప్రకాష్ తన జీతంతో పాటు కట్నకానుకలూ ఖర్చు చేసేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో అతడి తల్లి పొలం అమ్మి రూ.50 లక్షలు ఇచి్చనట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ వ్యాఖ్యలపై YS జగన్ ఫైర్
-
రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
-
భాను ప్రకాష్ కామెంట్స్ పై ఆర్కే రోజా ఫైర్
-
‘ఈసీ అంటే హెరిటేజ్ కంపెనీ కాదు’
సాక్షి, తిరుపతి : ఓటమి భయంతోనే చంద్రగిరిలో రీపోలింగ్ ఆపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చెప్పినట్లుగా ఈసీ నడుచుకుంటుందని టీడీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ అంటే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పిందల్లా చేయడానికి ఈసీ ఆయన పెట్టిన హెరిటేజ్ సంస్థ, టీడీపీ కాదని విమర్శించారు. చంద్రగిరిలో రీపోలింగ్ అంటే టీడీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీలోనే చంద్రబాబుకు సీటు లేదు కానీ ఇక ఢిల్లీలోని సీటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ తిరిగి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. -
‘బాబుకు చంద్ర గ్రహణం స్టార్టయింది’
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి మరిచి రౌడీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో బీజేపీ నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే హౌజ్ అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదని వ్యాఖ్యానించారు. 1998, 2014లో తమతో పొత్తు పెట్టుకొవడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. నరేంద్ర మోదీ లేకపోతే అధికారంలోకి ఎలా వచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి మీద రౌడీల్లా దాడి చేశారు... టీడీపీ పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యిందని..త్వరలోనే సైకిల్ చక్రాలు ఊడిపోవడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలు 90శాతం పూర్తి చేశామని, 2019లో కూడా నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
బాబు మానసిక స్థితి బాగా లేనట్లుంది: బీజేపీ
ఢిల్లీ: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని డ్రామాగా చిత్రీకరించడం అమానుషమని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో భాను ప్రకాశ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మానసిక పరిస్థితి బాగా లేనట్లుందని అన్నారు. జగన్పై దాడి విచారించాల్సింది పోయి రాజకీయం చేయడం దారుణమన్నారు. 2003లో అలిపిరి బాంబు దాడి జరిగినపుడు అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని, జగన్పై దాడిని ఖండించిన వైనాన్ని కూడా రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కత్తి గనుక మెడకు తగిలి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకోవచ్చునని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఘటనపై స్వతంత్ర వ్యవస్థ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2019లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని జోస్యం చెప్పారు. విచారణ పూర్తి కాకముందే సానుభూతి కోసమే జరిగిందని డీజీపీ చెప్పడం విచారణను దారి మళ్లించడమేనని పేర్కొన్నారు. దాడికి చేసిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ను అభిమానించే కుటుంబం అని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోనే హరికృష్ణ ఒక పార్టీ, లక్ష్మీ పార్వతి ఒక పార్టీ, పురందేశ్వరి మరో పార్టీలో ఉన్నారు..దాడికి పాల్పడ్డ వ్యక్తి కుటుంబం అంతా ఒకే పార్టీ మద్దతు దారులని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. -
నారావారి దేవస్థానంగా టీటీడీ: బీజేపీ
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నారావారి దేవస్థానంగా మారిపోయిందని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ర్ట కార్యదర్శి జి. భాను ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. శ్రీవారి సేవా టికెట్ల పేరుతో తిరుమల జేఈఓ కార్యాలయం కేంద్రంగా లక్షల రూపాయలు రోజూ చేతులు మారుతున్నాయని ఆరోపించారు. టీటీడీని కొంతమంది సిబ్బంది దళారీ క్షేత్రంగా మార్చేశారని మండిపడ్డారు. గత నెల 27వ తేదీన జేఈఓ టికెట్ల తనిఖీలో జరిగిన విచారణ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తోన్న కొంతమంది సిబ్బందికి సేవా టిక్కెట్ల కుంభకోణంలో ప్రమేయముందని ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. -
'దేవుడి భూములు అమ్మదనుకుంటున్నా'
తిరుపతి: కొంతమంది స్వార్థపరులు దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాల భూములను తాకట్టు పెట్టడం కానీ, అమ్మడం కానీ చేయదని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదికాక ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ పూర్తిగా లోటులో ఉంది. ఈ నేపథ్యంలో ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఎర్రచందన విక్రయిస్తుంది. అందుకోసం ఈ రోజు ఈ టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేవాలయాల భూమలను కూడా ప్రభుత్వం విక్రయించే అనుమానం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం దేవాలయాల భూములు అమ్మదని భావిస్తున్నట్లు భానుప్రకాశ్ రెడ్డి పై విధంగా వెల్లడించారు. -
చదరంగం పోటీలకు విశేష స్పందన
తిరుపతి స్పోర్ట్స్: చిత్తూరు జిల్లా చదరంగం సమాఖ్య తిరుపతిలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ పోటీలను రుయా బ్లడ్బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆర్ఆర్.రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ఐదుసార్లు ప్రపంచ కప్ను అందించింది ఒక్క చదరంగం మాత్రమే అని గుర్తుచేశారు. అయినా చదరంగానికి ఆశించిన స్థాయిలో ఖ్యాతి రాకపోవడం బాధాకరమన్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్రెడ్డి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన 25 మందికి నగదు బహుమతులు, 90 మందికి షీల్డ్, సర్టిఫికెట్లు అందించారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ పొనగంటి భాస్కర్, జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గందరగోళంగా పోటీలు తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం నిర్వహించిన చదరంగం పోటీలు గందరగోళంగా జరిగాయి. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధికంగా క్రీడాకారులు హాజరయ్యారు. దాదాపు 600 మందికి పైగా రావడంతో అందరికీ పోటీలు నిర్వహించడం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ గందరగోళం నడుమ పోటీలు ఎవరికి వారే నిర్వహించుకోవడం, ఓడినా తామే గెలిచామని ప్రకటించుకోవడం కనిపించింది. దీంతో గెలిచినా ఓడినట్టు నిర్వాహకులు ప్రకటించడంతో ఏడుగురు క్రీడాకారులు కన్నీటి పర్యంతమవుతూ బయటకు వచ్చారు. విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కో క్రీడాకారుని నుంచి రూ.200 చొప్పున డబ్బు వసూలు చేసి, తీరా నిబంధనలకు విరుద్దంగా పోటీలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. గెలిచిన క్రీడాకారులను సమయం లేదంటూ ఎందుకు పక్కన పెట్టారని నిలదీయడంతో తల్లిదండ్రులను నిర్వాహకులు బుజ్జగించడం కనిపించింది.


