-
Kaliyaganj: మళ్లీ హింస.. ఆ వీడియోపై దుమారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కలియాగంజ్ హింసతో అట్టుడికి పోయింది. ఓ మైనర్ గిరిజన బాలిక హత్యాచారానికి గురికావడంపై రగిలిపోయారు స్థానికులు. ఆందోళనకు దిగి పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బాడీని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం, గ్రామస్తులు అడ్డుకునే యత్నాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసకు దారి తీసింది. గురువారం సాయంత్రం.. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని గంగువా గ్రామానికి చెందిన ఓ బాలిక ట్యూషన్కని చెప్పి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆ రాత్రంతా ఆమె కోసం గాలించింది ఆమె కుటుంబం. శుక్రవారం ఆమె శవాన్ని స్థానికులు ఊరి శివారులో ఉన్న ఓ కొలను పక్కన పొదల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆమె హత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి గ్రామస్తులు రగిలిపోయారు. రోడ్లను దిగ్భంధించి.. నిరసనలు చేపట్టారు. పరిస్థితి హింసాత్మకంగా మారే సూచనలు కనిపించడంతో.. పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శనివారం ఒక్కరోజే.. ఆందోళనకారులపై రెండుసార్లు టియర్ గ్యాస్ను ప్రయోగించారు పోలీసులు. మరోవైపు పోలీస్ సిబ్బంది బాధితురాలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన వీడియో ఒకటి రాజకీయ విమర్శలకు దారి తీసింది. అయితే.. గ్రామస్తుల నుంచి బాలిక మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది సాయంతో స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు పంపించామని, ఆలస్యమైతే కీలక ఆధారాలు చెరిగిపోయే అవకాశం ఉన్నందునే కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఉత్తర దినాజ్పూర్ ఎస్పీ సనా అక్తర్ మీడియాకు వెల్లడించారు. బాలిక డెడ్బాడీ పక్కనే ఓ సీసా దొరికింది. బహుశా అది విషం బాటిల్ అయ్యి ఉండొచ్చు. ఆమె ఒంటిపైనా ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘోరంతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు అని ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన ఆధారంగా టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. బెంగాల్లో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని, పోలీసులు సైతం నేరాల కట్టడిలో ఘోరంగా విఫలం అవుతున్నారని మండిపడుతోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ఓ వీడియో పోస్ట్ చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యం అది. అంతేకాదు.. ఆ మైనర్ రాజ్బోంగ్షి కమ్యూనిటీకి చెందిందని అమిత్ మాలవియా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ సుకాంత మజుందార్ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన ఆధారంగా మమతా బెనర్జీ సర్కార్పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే.. పోలీసులు ఆ గ్రామంలోకి రాజకీయ నేతలు రాకుండా ఆంక్షలు విధించారు. কালিয়াগঞ্জে নাবালিকা রাজবংশী মেয়েকে গণধর্ষণ করে নৃশংসভাবে হত্যা করা হয়। ধর্ষিতা পরিবারের সঙ্গে দেখা করলেন রাজ্য সভাপতি ডঃ @DrSukantaBJP, সাংসদ @DebasreeBJP ও @khagen_murmu বিধায়ক গোপাল চন্দ্র সাহা, সত্যেন্দ্রনাথ রায়, চিন্ময়দেব বর্মন ও শ্রীরূপা মিত্র চৌধুরী। pic.twitter.com/S19YFNucha — BJP Bengal (@BJP4Bengal) April 22, 2023 బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఈడ్చుకెళ్తున్నట్లు ట్విటర్లో షేర్ చేసిన వీడియోను జాతీయ మహిళా కమిషన్ కూడా పరిగణనలోకి తీసుకుంది. వివరణ ఇవ్వాలంటూ బెంగాల్ డీజీపీని ఆదేశించింది. In this video, the body West Bengal Police is insensitively dragging is that of a minor rape and murder victim from the Rajbongshi community in Uttar Dinajpur’s Kaliaganj. Such haste is often seen when the purpose is to eliminate or dilute evidence and cover up the crime… pic.twitter.com/zgz2Rxlik1 — Amit Malviya (@amitmalviya) April 22, 2023 ఇంకోవైపు ఎన్సీపీసీఆర్(జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం) సైతం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. నిజనిర్ధారణకమిటీ ద్వారా కేసును పర్యవేక్షించబోతోంది. అంతేకాదు ఈ ఘటనపై తమకు సమాచారం అందింటలేదంటూ.. బెంగాల్ సీఎస్తో పాటు ఉత్తర దినాజ్పూర్ కలెక్టర్పైనా ఆరోపణలు గుప్పించింది. పోలీసులు మాత్రం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. -
కోల్కతా జైలుకు జస్టిస్ కర్ణన్
బెయిల్కు, జైలుశిక్ష రద్దుకూ నో న్యూఢిల్లీ/కోల్కతా: కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ను బుధవారం కోల్కతా జైలుకు తరలించారు. మంగళవారం కోయంబత్తూరు దగ్గర్లోని ఓ రిసార్టులో అరెస్టుచేసిన పశ్చిమబెంగాల్ సీఐడీ పోలీసులు ఆయన్ను ఎయిర్ఇండియా విమానంలో కోల్కతా విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోం(జైలు)కు తరలించారు. ఆరువారాలపాటు కనిపించకుండాపోయిన ఆయనకు జైలు శిక్షకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉపశమనాలు లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాగే కోర్టు ధిక్కార నేరానికిగానూ విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలన్న విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. ఈ అంశాన్ని ఏడు గురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలించి తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పునకు తాము కట్టుబడి ఉండాలని, వెకేషన్ బెంచ్ అయిన తాము ఈ తీర్పును తోసిపుచ్చలేమని, ఈ అంశంపై తాము ఏమీ చేయలేమని వెకేషన్ బెంచ్ జడ్జీలు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ స్పష్టం చేశారు. కోర్టు తిరిగి ప్రారంభమయ్యే వరకూ బెయిల్ మంజూరు చేయాలని కర్ణన్ తరఫు న్యాయవాది మాథ్యూ నెడుంపరా కోర్డును కోరారు. ఈ అంశాన్ని చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించాలని న్యాయస్థానం సూచించింది. జైలులో కర్ణన్కు ఛాతీ నొప్పి: జైలుకు తరలించిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పి వస్తోందని కర్ణన్ చెప్పడంతో ఆయనకు జైలు ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వృద్ధాప్యం కారణంగా కర్ణన్ కాస్త అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు ఈసీజీ తీశామని, వైద్య నివేదికల్లో తేడా ఉంటే ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తామని అధికారులు చెప్పారు. -
జస్టిస్ కర్ణన్ అరెస్ట్
తమిళనాడులో అరెస్టు చేసిన బెంగాల్ పోలీసులు సాక్షి, చెన్నై: కోర్టు ధిక్కార కేసులో ఆర్నెల్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ను మంగళవారం పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు అరెస్టుచేశారు. నెలరోజులకుపైగా ఆచూకీ లేకుండా పోయిన ఆయనను తమిళనాడు లోని కోయంబత్తూరు దగ్గర్లోని మలుమి చ్చంపట్టి గ్రామంలోని ఓ రిసార్టులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజులుగా ఆయన ఇక్కడే తలదాచు కుంటున్నారని సీఐడీ ఉన్నతాధికారి చెప్పారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో కర్ణన్ వాదనకు దిగారని, అరెస్టు చేయకుండా అడ్డుకున్నారని చెప్పారు. తర్వాత కర్ణన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. కర్ణన్ను నేడు కోర్టులో హాజరుపరిచాక కోల్కతాకు తరలించనున్నట్లు చెప్పారు. కర్ణన్ ఫోన్కాల్స్ను పసిగట్టిన తర్వాత ముగ్గురు కోల్కతా పోలీసుల బృందం గత మూడు రోజులుగా ఇక్కడే మకాంవేసి కర్ణన్ జాడను నిర్ధారించుకున్నారు. కోర్టు ధిక్కార కేసులో సీజేఐ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్.. కర్ణన్కు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వెలువడిన అదేరోజు చెన్నైకు చేరుకున్న కర్ణన్ ఆ తర్వాత అరెస్టు, జైలు శిక్షను తప్పించుకునేందుకు కనిపించకుండాపోయారు. దీంతో కర్ణన్ అరెస్టు కోసం కోల్కతా పోలీసులు తమిళనాడులో గాలింపు తీవ్రంచేశారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి అరెస్టుచేశారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 11న కోల్కతా హైకోర్టుకు బదిలీఅయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement