తమిళనాడులో అరెస్టు చేసిన బెంగాల్ పోలీసులు
సాక్షి, చెన్నై: కోర్టు ధిక్కార కేసులో ఆర్నెల్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న కోల్కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ను మంగళవారం పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు అరెస్టుచేశారు. నెలరోజులకుపైగా ఆచూకీ లేకుండా పోయిన ఆయనను తమిళనాడు లోని కోయంబత్తూరు దగ్గర్లోని మలుమి చ్చంపట్టి గ్రామంలోని ఓ రిసార్టులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజులుగా ఆయన ఇక్కడే తలదాచు కుంటున్నారని సీఐడీ ఉన్నతాధికారి చెప్పారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో కర్ణన్ వాదనకు దిగారని, అరెస్టు చేయకుండా అడ్డుకున్నారని చెప్పారు. తర్వాత కర్ణన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. కర్ణన్ను నేడు కోర్టులో హాజరుపరిచాక కోల్కతాకు తరలించనున్నట్లు చెప్పారు. కర్ణన్ ఫోన్కాల్స్ను పసిగట్టిన తర్వాత ముగ్గురు కోల్కతా పోలీసుల బృందం గత మూడు రోజులుగా ఇక్కడే మకాంవేసి కర్ణన్ జాడను నిర్ధారించుకున్నారు.
కోర్టు ధిక్కార కేసులో సీజేఐ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్.. కర్ణన్కు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వెలువడిన అదేరోజు చెన్నైకు చేరుకున్న కర్ణన్ ఆ తర్వాత అరెస్టు, జైలు శిక్షను తప్పించుకునేందుకు కనిపించకుండాపోయారు. దీంతో కర్ణన్ అరెస్టు కోసం కోల్కతా పోలీసులు తమిళనాడులో గాలింపు తీవ్రంచేశారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి అరెస్టుచేశారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 11న కోల్కతా హైకోర్టుకు బదిలీఅయ్యారు.
జస్టిస్ కర్ణన్ అరెస్ట్
Published Wed, Jun 21 2017 2:41 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement