Benazir Bhutto murder case
-
భుట్టోను హత్య చేసింది మేమే
కరాచీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను హత్య చేసింది తామేనని పాక్లోని తెహ్రీక్ తాలిబాన్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. ‘ఇంక్విలాబ్ మెహ్సూద్ సౌత్ వజీరిస్థాన్’ అనే పుస్తకంలో తాలిబాన్ ఈ విషయాన్ని వెల్లడించిందట. ఈ పుస్తకాన్ని తాలిబాన్ నేత అబూ మన్సూర్ అషీమ్ ముఫ్తీ రాశాడు. ఉగ్రవాదులు చేసిన ఘోరాలను వివరిస్తూ 2017 నవంబర్ 30న ప్రచురించిన ఈ పుస్తకం ఆదివారం విడుదలైంది. 588 పేజీలున్న ఈ పుస్తకంలో పలువురు తాలిబాన్ నేతలు, వారు చేసిన ఘోరాలను ప్రచురించారు. బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రాముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి బాంబుల ద్వారా భుట్టోను చంపినట్లు ఈ పుస్తకంలో వెల్లడించారు. మొదట భుట్టోపై కాల్పులు జరిపింది బిలాలేనని, అనంతరం తనకు తాను కాల్చుకున్నాడని రాశారు. ఆత్మాహుతి అనంతరం ఇక్రాముల్లా తప్పించుకున్నాడట. అయితే బుట్టో హత్య వెనుక లాడెన్ హస్తం ఉన్నట్లు గతంలో నిఘావర్గాలు వెల్లడించాయి. బెనజీర్ హత్యకు యత్నం జరుగుతోందన్న సమాచారం అందుకున్న హోంశాఖ, దానిని అడ్డకునే ప్రయత్నం ఏది చేయలేదనే వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా లాడెన్తో హత్య చేయించింది ముషారఫ్ అని ఆరోపణలు సైతం వచ్చాయి. -
ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడు
-
ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడు
► భుట్టో హత్య కేసులో నిర్థారించిన పాకిస్తాన్ కోర్టు ► ఆస్తుల స్వాధీనానికి ఆదేశం ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసుకు సంబంధించి ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని పాక్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పుచెప్పింది. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. భుట్టో హత్య జరిగిన పదేళ్ల తర్వాత వెలువరించిన తీర్పులో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. భుట్టో 2007 డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతం తర్వాత కేసు నమోదు కాగా.. విచారణ సందర్భంగా అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. పదేళ్ల కాలంలో వివిధ కారణాల వల్ల ఎనిమిది మంది జడ్జీలు ఈ కేసును విచారించారు. చివరికి రావల్పిండి కోర్టు కేసు విచారణను బుధవారం ముగించింది. ఈ కేసులో తీర్పు వెలువరించిన జడ్జి అస్గర్ ఖాన్.. ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని ప్రకటించారు. వైద్య చికిత్సల నిమిత్తం గత ఏడాది పాకిస్థాన్ విడిచి వెళ్లిన ముషారఫ్ అప్పటి నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు. రావల్పిండి మాజీ సీపీవో సాద్ అజీజ్, రావల్ టౌన్ ఎస్పీ ఖుర్రమ్ షెహజాద్ను దోషులుగా ప్రకటించింది. వారికి ఒక్కొక్కరికీ 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ 5 లక్షల జరిమానా విధించింది.