breaking news
bees attack
-
సరదాగా పిక్నిక్ వెళ్తే ఏం జరిగిందంటే.?
-
తేనెటీగల బీభత్సం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
రావికమతం(అనకాపల్లి జిల్లా): రావికమతం మండలం గర్నికం గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధ దంపతులు ఆర్లె కామునాయుడు (61), అతని భార్య నూకాలమ్మ( 57)పై శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది. గ్రామానికి సమీపంలో వారి పశువుల పాకలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనులు చూసుకుంటున్న తరుణంలో మేతకు వెళ్లి వచ్చే పశువులు సమీపంలో ఉన్న ఒక చెట్టు వద్ద ఒకదానితో మరొకటి తలపడి అలజడి చేశాయి. చదవండి: కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు దీంతో ఆ చెట్టుపై ఉన్న తేనెపట్టులోని ఈగలు బెదిరి పశువులతోపాటు వృద్ధ దంపతులపైనా గుంపుగా దాడి చేశాయి. దీంతో వారు కేకలు వేయగా సమీపంలోని రైతులు గోనె సంచులు చుట్టుకుని వెళ్లి వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లారు. కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందారు. -
తేనెటీగల దాడిలో 13 మందికి గాయాలు
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా ఏజెన్సీ పరిధిలోని పెదబయలు మండలం పోయిపల్లి పంచాయతీ జర్సింగి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం తేనెటీగల దాడిలో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గ్రామ సమీపంలో ఉన్న మామిడి చెట్టుపై 50కి పైగా తేనె పట్లు ఉన్నాయి. ప్రతి రోజూ పిల్లలు ఆ చెట్టు కింద ఆడుకుంటుంటారు. వారిలో ఒకరు శుక్రవారం తేనె పట్టుపై రాయి విసరడంతో ఒక్కసారిగా ఈగలు పిల్లలపై దాడి చేశాయి. వారి అరుపులు విని గ్రామస్తులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. పిల్లల్ని తేనెటీగల దాడి నుంచి రక్షించే ప్రయత్నంలో వారు కూడా కొందరు గాయపడ్డారు. మొత్తం 13 మంది గాయపడగా వారిలో పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. పరిస్థితి విషయంగా ఉన్న ముగ్గురు బాలలను పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.