-
డేంజర్.. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది..
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎనీ డెస్క్.. టీం వీవర్.. లాంటి డెస్క్ టాప్ యాప్లను మీ ఫోన్లో అపరిచిత వ్యక్తులు డౌన్లోడ్ చేయిస్తే నష్టపోయే పరిస్థితి ఉంది. అవతలి వ్యక్తి చెబుతున్న విధంగానే అన్నింటికీ మీరు క్లిక్ చేస్తూ పోతే మీకు తెలియకుండానే మీ ఫోన్ అవతలి వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఫోన్ పే, యూట్యూబ్, బ్యాంకింగ్ యాప్ వంటివి మీ ఫోన్లో ఏం తెరిచినా అన్నీ అవతలి వ్యక్తికి కనిపిస్తాయి. చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్లు రావు దీంతో మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే అకౌంట్ పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి తెలుస్తాయి. తరువాత ఆయా అకౌంట్స్లో నగదును సులువుగా స్వాహా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ వచ్చే సందేశాలు, మెసేజ్ లింక్లను పట్టించుకోకూడదు. విద్యుత్ బకాయిలు, ఈకేవైసీ పూర్తి, బ్యాంకు అనుసంధానం వంటి సేవల కోసం యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను కూడా నమ్మొద్దు. -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది. -
బీ కేర్ఫుల్ 12th Dec 2019
-
లొట్టలేస్తున్నారా.. జర జాగ్రత్త!
ఏలూరు (మెట్రో) : ఫాస్ట్ఫుడ్ సెంటర్.. జిల్లాలోని ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. పట్టణాలు, పలెల్లు తేడా లేకుండా ప్రతి ముఖ్యకూడలిలోనూ ఒకటి నుంచి నాలుగైదు వరకు దర్శనమిస్తున్నాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో సుమారు 200 వరకూ పాస్ట్ఫుడ్ సెంటర్లు, జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి. మున్సిపల్ కేంద్రాల్లోనూ, చిన్న పంచాయతీల్లోనూ పాస్ట్ఫుడ్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల మొబైల్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పుట్టుకొస్తున్నాయి. హైస్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్ఫుడ్ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ప్రజల ఆదరణ చూసి ఫుడ్ కోర్టులు ఏ వీధిలో చూసినా దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 20 నుండి 40 శాతం ఫాస్ట్ఫుడ్ సెంటర్లు పెరుగుతూ వస్తున్నాయి. చిన్నారుల్లో స్థూలకాయం చిన్నారులు చిరుతిళ్లుపై ఎక్కువగా ఆధారపడుతుంటే కచ్చితంగా ఒబిసిటీ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నా వాటిని పెడచెవిన పెడుతున్నారు. అదే విధంగా జంక్ఫుడ్ మార్కెట్ విస్తరించడం కూడా శుభపరిమాణం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది రాబోయే అనారోగ్యానికి హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లు, పాన్పరాగ్ వంటివి ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్లే జంక్ఫుడ్స్ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. మధుమేహం, గుండె రక్తనాళాల వ్యాధులకు జంక్ఫుడ్ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యమూ అంతే ఆహార తనిఖీ శాఖ నిర్లక్ష్యం కూడా ఈ ఫాస్ట్ఫుడ్ సెంటర్లు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కనీసం వీటిపై ఏ మాత్రం దాడులు చేయకపోవడంతో ఈ సెంటర్లలో కల్తీలు చేసినా ప్రశ్నించే నాథుడే లేకుండా పోతున్నాడు. ఫాస్ట్ఫుడ్ వినియోగం ఇలా 10–15 సంవత్సరాల లోపు వారు 85 శాతం ఉంటే, 16–20 సంవత్సరాల లోపు 65 శాతం, 21–25 సంవత్సరాల లోపు వారు 55శాతం, 26–35 సంవత్సరాల లోపు వారు 45 శాతం, 36–45 సంవత్సరాల లోపు వారు 25 శాతం, 46–50 సంవత్సరాల లోపు వారు 20 శాతం ఈ జంక్ఫుడ్స్పై అధికాసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులు ఫాస్ట్ఫుడ్ వాడకాన్ని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాల సిఫార్సులు చేసింది. పండ్లు, కూరగాయలు ధరలు తగ్గేలా... ఫాస్ట్ఫుడ్ ధరలు పెరిగేలా పన్నులు ఉండాలని పేర్కొంది. వీటిలో ఒకటి పండ్లు, కూరగాయల సాగుకు రాయితీలిచ్చి ప్రోత్సహించాలని పేర్కొంది. రెండో అంశం ఫాస్ట్ఫుడ్స్, కూల్డ్రింక్స్ ప్రచారాన్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లు డబ్బాలపై మరింత స్పష్టమైన సమాచారంతో కూడిన లేబుల్స్ ఉండాలన్నది మూడో సూచన. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ ప్యాకెట్లపై ముద్రించినట్లే పాస్టుఫుడ్ సెంటర్లపైనా, ప్యాకెట్లపైనా ఇలాంటి హెచ్చరికలు ముద్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చెవికెక్కని వైద్యుల సూచన కాలానుగుణంగా లభించే పండ్లు తింటే రోగాలు దరిచేరవని ఫిజ్జా, బర్గర్లు, రోడ్లపై దొరికే ఫాస్ట్ఫుడ్స్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆహారంలో పీచుపదార్థం లేకపోవడంతో మలబద్ధకం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండటంలో ఎసిడిటీ పెరుగుతోంది. వీటన్నింటి నుంచి బయటపడాలంటే సంప్రదాయ వంటకాల గొప్పదనాన్ని, అవి ఇచ్చే ఆరోగ్యాన్ని నేటి తరానికి తెలపాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. చికిత్స కన్నా నివారణే మేలు జబ్బు చేసిన తరువాత చికిత్స పొందటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్స్ అంటే పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తినేస్తున్నారు. ఫాస్ట్ఫుడ్లో వాడే రంగులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బయట ఫాస్ట్ఫుడ్స్లో లభించే ఆహారం వల్ల అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలు, గురక వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం పిల్లలు బయట ఆ టలకు దూరం అయ్యారు. ఇంట్లో టీవీ చూస్తూ గడపడం, వీడియోగేమ్స్, స్మార్ట్ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. దీంతో చిన్నవయసులోనే ఊబకాయులుగా మారుతున్నారు. ఫాస్ట్ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. – డాక్టర్ ప్రవీణ్కుమార్, ప్రభుత్వ వైద్యులు -
కొత్త చట్టం వచ్చింది..రేషన్ డీలర్లు జాగ్రత్త
నెల్లూరు(అర్బన్): పౌర సరఫరాలకు సంబంధించి ప్రభుత్వం గత నెల 11న పాత చట్టం స్థానంలో కంట్రోలర్ ఆర్డర్– 2018 అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని జేసీ వెట్రి సెల్వి తెలిపారు. కొత్తచట్టం ప్రకారం రేషన్ డీలర్లు ఏ మాత్రం మోసాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో రేషన్ డీలర్లకు కంట్రోలర్ ఆర్డర్–2018పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ డీలర్లు తూకాల్లో మోసాలకు పాల్పడినా..సకాలంలో డీడీలు చెల్లించకపోయినా..రేషన్ దుకాణాన్ని సమయం ప్రకారం తీయకపోయినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. గతంలో 6(ఏ) కేసులు నమోదు చేసేవారని, కొత్త చట్టం ప్రకారం 420 కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల డీలర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈపాస్ యంత్రంలో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఐరిష్ ద్వారా సరకులు ఇవ్వాలని సూచించారు. ఐరిష్ పని చేయని చోట 15వ తేదీ తరువాత మూడ్రోజుల పాటు వీఆర్వో ద్వారా సరుకులు ఇవ్వాలన్నా రు. వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారామపురం, తడ, కొండాపురం, గూడూరు, అనంతసాగరం, రాపూరు, తదితర మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగా లేదన్నారు. రేషన్ సరకులు ఇచ్చిన తరువాత పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని లక్షమందికి ఫోన్ చేసి సరుకులు సక్రమంగా ఇస్తున్నారా.. తూకాల్లో మోసాలు చేస్తున్నారా.. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయానే వివరాలు సేకరిస్తున్నారన్నారు. అందువల్ల డీలర్లు జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని నూతన ఓటర్లుగా చేర్పించేందుకు సహకారించాలని కోరారు. అనంతరం ప్రజాపంపిణీలో 100 శాతం మించి సరుకులు అందించిన ఐదుగురు డీలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల రేషన్ డీలర్లు, డీఎస్ఓ, ఏఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement