breaking news
Bank Clerk
-
నెల్లూరు: ఈఎంఐ కట్టాలని మెసేజ్.. వెలుగులోకి ఎస్బీఐ ఉద్యోగి మోసం
సాక్షి, నెల్లూరు: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటగిరి బ్రాంచిలో పనిచేస్తున్న షేక్ రబ్బానీ అనే ఉద్యోగి (క్లర్క్) ఓ ఖాతాదారునికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్పై సదరు ఖాతాదారునికి తెలియకుండా రుణం తీసుకున్న కేసుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా మరో ఇద్దరి అకౌంట్ల నుంచి లోన్ కింద రూ.9.26 లక్షలు డ్రా చేసుకున్న కేసులో నిందితుడు రబ్బానీని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగమల్లేశ్వరరావు కథనం మేరకు.. వెంకటగిరి ఎస్బీఐలో పనిచేస్తున్న క్లర్క్ రబ్బానీ తన తల్లి, తమ్ముడు, స్నేహితుడిపై ఉన్న మూడు ఖాతా లను రాపూరు ఎస్బీఐ బ్రాంచ్ నుంచి వెంకటగిరి బ్రాంచ్కు మార్చుకున్నాడు. బ్యాంక్ ఉద్యోగి అయిన రబ్బానీ ఆ కౌంట్లకు ఉన్న పరిమితులను కార్పొరేట్ తరహాగా మార్చుకుని వాటిలో ఓ అకౌంట్ నుంచి రూ.3.22 లక్షలు, మరో అకౌంట్ నుంచి రూ.6.02 లక్షలను రుణం కింద తీసుకున్నాడని తెలిపారు. ఇక బ్యాంక్కు వచ్చిన ఓ ఖాతాదారుడికి ఓ యాప్ ద్వారా రబ్బానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. అయితే ఖాతాదారుడికి తెలియకుండా ఆ ఫిక్స్డ్ డిపాజిట్పై రబ్బానీ రూ.1.35 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ రుణంకు సంబంధించి ఈఎంఐ కట్టాలని మెసేజ్ ఖాతాదారుడికి వెళ్లింది. దీంతో తాను తీసుకోని రుణంకు వాయిదా చెల్లించాలంటూ మెసేజ్ రావడంపై ఆయన బ్యాంక్ మేనేజర్ను సంప్రదించాడు. ఈ వ్యవహారంపై బ్యాంక్లో విజిలెన్స్ విచారణ జరిపి మోసాలకు కారణమైన రబ్బానీపై బ్యాంక్ మేనేజర్ ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు ఆదివారం నిందితుడు రబ్బానీని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. చదవండి: అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే.. ఉత్తుత్తి బ్యాంక్: ఓటీపీ చెప్పాడు.. క్షణాల్లోనే రూ.1,64,612 మాయం -
SBI Clerk 2021: బ్యాంక్ జాబ్స్కు.. బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇలా
బ్యాంకింగ్ రంగంలో కొలువు.. క్లర్క్ నుంచి స్పెషలిస్ట్ కేడర్ వరకు.. ఏ పోస్ట్లో కొలువుదీరినా ఉజ్వల భవిష్యత్తు ఖాయమనే అభిప్రాయం! ఒక్కసారి బ్యాంక్ ఉద్యోగంలో చేరితే ఇక వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకే దేశంలో కొన్ని లక్షల మంది బ్యాంక్ జాబ్ కోసం పరీక్షలకు ప్రిపేరవుతుంటారు! అలాంటి వారందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తీపి కబురు చెప్పింది. క్లరికల్ కేడర్లో 5వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ 2021 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ.. మొత్తం 5,454 పోస్ట్లు ► ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)–2021 ఎంపిక ప్రక్రియ ద్వారా జాతీయ స్థాయిలో 5,454 పోస్ట్లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ నియామకాల ద్వారా 5,000 పోస్ట్లను, బ్యాక్లాగ్ 454 ఖాళీలకు నియామకాలు చేపట్టనుంది. క్లరికల్ కేడర్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ► అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 16, 2021లోపు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది. హైదరాబాద్ సర్కిల్–275 పోస్టులు మొత్తం పోస్ట్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 275 పోస్ట్లు అందుబాటులో ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 111, ఎస్సీ కేటగిరీలో 44, ఎస్టీ కేటగిరీలో 19, ఓబీసీ కేటగిరీలో 74, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 27 ఖాళీలను కేటాయించారు. హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను పరీక్ష మాధ్యమాలుగా పేర్కొనాల్సి ఉంటుంది. రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో రాత పరీక్షల విధానంలో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్. ముందుగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్ రెండూ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత వేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమినరీ పరీక్ష ► అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఇది మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు జరుగుతుంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటుంది. ► ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం నిబంధన అమల్లో ఉంటుంది. ఈ నిబంధన కారణంగా.. అభ్యర్థులు ఒక విభాగానికి సంబంధించిన సమాధానాలను దానికి కేటాయించిన సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ► అభ్యర్థులు పరీక్ష హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్ మాధ్యమం ఉంటుంది. –ఒకవేళ మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులకు.. మెయిన్ తర్వాత ప్రత్యేకంగా వారు ఎంపిక చేసుకున్న భాషలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సర్కిల్లో అధికార భాషకు సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్కు హాజరు కావాలి. మెయిన్ ఎగ్జామినేషన్ ► ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా..మొత్తం పోస్ట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్కు పది మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్కు ఎంపిక చేస్తారు. ఈ మెయిన్ పరీక్ష కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50ప్రశ్నలు–60 మార్కులకు చొప్పున మొత్తంగా190 ప్రశ్నలు–200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు. తుది జాబితా ఇలా ఎంపిక ప్రక్రియలో రెండు దశల(ప్రిలిమినరీ, మెయిన్) విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. నియామకం ఖరారు చేసే క్రమంలో మెయిన్లో చూపిన ప్రతిభనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీలో నిర్ణీత కటాఫ్ మార్కులు పొందితేనే.. మెయిన్ పరీక్ష పేపర్ మూల్యాంకనం చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమినరీ నుంచే చక్కటి ప్రతిభ చూపేలా సన్నద్ధం కావాలి. ఉమ్మడి ప్రిపరేషన్ రెండు దశల్లో నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్పైనా దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్లో ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలను మెయిన్లోని జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీలతో అనుసంధానించుకుంటూ ప్రిపరేషన్ సాగించే వీలుంది. జూన్లో పరీక్ష ఎస్బీఐ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష జూన్లో జరిగే ∙అవకాశముంది. అదే విధంగా మెయిన్ను జూలై 31న నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే విధంగా నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి. ముందుగా ప్రిలిమ్స్ తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్లను చదవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. మెయిన్ ఎగ్జామ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. మెయిన్లో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. వాస్తవానికి ఈ రెండు సబ్జెక్ట్లకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేలా సమయం కేటాయించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిపరేషన్ పటిష్టంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఈ విభాగం ముఖ్య ఉద్దేశం అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ను పరీక్షించడం. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్పై అవగాహన పెంచుకోవాలి. ఇడియమ్స్,సెంటెన్స్ కరెక్షన్, వొ కాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్పై పట్టు సాధించాలి. జనరల్ ఇం గ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీ మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రధానంగా అర్థమెటిక్ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్మాస్ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్లపై ప్రత్యేక దృక్పథంతో అడుగులు వేయాలి. రీజనింగ్ ఇది కూడా రెండు దశల్లోనూ(ప్రిలిమ్స్, మెయిన్స్) ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రిలిమ్స్ సమయానికి ఈ అంశాలపై పట్టు సాధిస్తే.. మెయిన్లో అధిక శాతం సిలబస్ను కూడా పూర్తి చేసినట్లవుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్లో మాత్రమే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మెయిన్లో మాత్రమే ఉండే మరో విభాగం.. కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్స్ గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్లకు హాజరు కావడం మేలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆయా విభాగాలు, అంశాల పరంగా వెయిటేజీపై అవగాహన వస్తుంది. గ్రాండ్ టెస్ట్ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా.. తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్ మేనేజ్మెంట్ పరంగా స్పష్టత వస్తుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ పరీక్షను దృష్టిలోపెట్టుకొని చదివితే.. ప్రిలిమ్స్లో సులువుగా నెగ్గడంతోపాటు మెయిన్కు కూడా సన్నద్ధత లభిస్తుంది. క్లర్క్ కెరీర్ గ్రాఫ్ ఇలా ► క్లర్క్ కేడర్లో జూనియర్ అసోసియేట్గా కొలువు సొంతం చేసుకుంటే.. చీఫ్ మేనేజర్,డీజీఎం వంటి స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ► ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఆరు నెలల ప్రొబేషన్ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే క్లర్క్గా కెరీర్ మొదలవుతుంది. ► ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సీజీఎం స్థాయి వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ► క్లర్క్గా నియమితులైన అభ్యర్థులకు మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే ట్రైనీ ఆఫీసర్ హోదా లభిస్తుంది. ► జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ విధానంలో 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే సమయానికి డీజీఎం హోదాకు సైతం చేరుకోవచ్చు. ► ప్రస్తుతం అమలవుతున్న సర్వీస్ నిబంధనల ప్రకారం–క్లర్క్ స్థాయిలో కొలువుదీరిన వారు చీఫ్ మేనేజర్ స్థాయికి చేరుకోవడం ఖాయం. ఎస్బీఐ నోటిఫికేషన్– ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 27, 2021 నుంచి మే 17, 2021; ► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్ నెలలో జరుగుతుంది. ► మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: జూలై 31, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers -
I LOVE U చేప్ప లేదని ఇలా చేసాను
-
సర్కారు కొలువే లక్ష్యం
కర్నూలు(విద్య), న్యూస్లైన్: కానిస్టేబుల్ నుంచి వీఆర్ఏ, వీఆర్వో, పంచాయతీరాజ్ సెక్రటరీ, బ్యాంక్ క్లర్క్.. పోస్టు ఏదైనా పోటీ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో శిక్షణ పొందితే గానీ పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కర్నూలు, నంద్యాలలలోని కోచింగ్ సెంటర్లు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో వీఆర్ఓ, వీఆర్ఏ రాతపరీక్ష ఫిబ్రవరి రెండో తేదీన జరగనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి దాదాపు 58వేల మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 105 వీఆర్వో పోస్టులకు గాను 554వేల మంది దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వ ఉద్యోగాలపై నిరుద్యోగులకు ఉన్న మక్కువ ఏపాటిదో తెలిసిపోతోంది. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య 60వేలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మీ-సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించేందుకు ఈనెల 12వ తేదీ చివరి రోజు కాగా 13వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ అర్హత ఉన్న ఈ పోస్టులకు అంతకుమించి అర్హత ఉన్న పలువురు అభ్యర్థుల మనోభావాలను ‘న్యూస్లైన్’ తెలుసుకునే ప్రయత్నం చేసింది. -
బ్యాంక్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులకు స్థానిక ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ రవిచంద్ర, స్టడీ సర్కిల్ డెరైక్టర్ ఆర్ సురేంద్రకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు 60 మంది అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన లేక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తామన్నారు. శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని, ఆ సమయంలో బ్యాంకు పరీక్ష హాల్ టికెట్ కాపీని ఇచ్చిన తరువాత నెలకు స్టయిఫెండ్ అందిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను అక్టోబర్ 11వ తేదీలోగా డెరైక్టర్, ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం, అబ్బాస్నగర్, కర్నూలు అనే చిరునామాకు పంపాలని కోరారు. వివరాలకు 08518-230275కు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు. ఎలాంటి హాస్టల్ వసతి లేదని, దరఖాస్తుల్లో అభ్యర్థులు తమ ఫోన్ నంబర్లను తెలియజేయాలన్నారు.