-
సీఎం జగన్కు విశాఖ అంటే ఎంతో ఇష్టం..
సాక్షి, విశాఖ: సీఎం జగన్మోహన్రెడ్డికి విశాఖ నగరంపై ప్రత్యేక మమకారం ఉందని, ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా వెనక్కు తగ్గేది లేదని, విశాఖ రాజధాని కావడం తధ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబు, అతని తనయుడు లోకేశ్ బాబుకు విశాఖలో పర్యటించే అర్హత లేదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలవడంతో బంద్ విజయవంతమయ్యిందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలతో టీడీపీ ఖేల్ ఖతం అవుతుందన్న ఆయన.. ఆ పార్టీని ఆల్ బెవర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ(ఏబీసీ పార్టీ) అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన హయాంలో తప్పుడు డాక్యుమెంట్లతో అనుయాయులకు విలువైన భూములు కట్టబెట్టడాన్ని ఆయన ప్రస్థావించారు. త్వరలో విశాఖలో లక్షా 90 వేల మందికి సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో బంద్ విజయవంతం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన బంద్కు ప్రభుత్వ సహకారం తోడవడంతో బంద్ విజయవంతమైందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసేందుకు కూడా చంద్రబాబుకు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్సీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పొస్కో ఏపీకి రావడం నిజమే కానీ.. ప్రభుత్వం కృష్ణ పట్నం, భావనపాడులో పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు గల్లి గల్లి తిరుగుతున్నారని, మా నాయకుడు జగన్మోహన్రెడ్డికి ఆ అవసరం లేదని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలే స్వచ్ఛందంగా తమకు ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలేవైనా రిజల్ట్ ఎప్పుడూ వైఎస్సార్సీపీ అనుకూలంగానే వస్తుందన్నారు. -
బంద్ విజయవంతం
ఖమ్మం, న్యూస్లైన్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జిల్లాలోని వందలాది గ్రామాలను నీట ముంచడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. సీపీఎం, సీపీఐ, సీసీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై రాస్తారోకో చేశారు. విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీలకు చెందిన మహిళా, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, మోటార్సైకిల్ ర్యాలీలు చేపట్టారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జలదీక్షలు చేశారు. బస్సులు బయటకు రాకుండా బస్టాండ్, డిపోల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ జేఏసీ అనుబంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలువురు ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. పలు చోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు తెరుచుకోకపోవడంతో ని త్యం కలకళలాడే వ్యాపార కూడళ్లు వెలవెలబోయాయి. పెట్రోల్ బంక్లు తెరుచుకోలేదు. బ్యాంకులు మూసివేయడంతో కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. ఖమ్మంలో సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి దుకాణాలను బంద్ చేయించారు. పోలవరం డిజైన్ మార్చాలని, భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని మండలాలను ఖమ్మం జిల్లాలో ఉంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, మహిళా సంఘం కార్యకర్తలు బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఐద్వా నాయకురాలు గట్టు రమాదేవికి స్వల్ప గాయాలయ్యాయి. సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. సీపీఐ ఆధ్వర్యంలోనూ మోటార్సైకిల్ ప్రదర్శన చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మం బస్ డిపో వద్ద ధర్నా, అనంతరం నగరంలో ప్రదర్శన నిర్వహించారు. వీరికి మద్దతుగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ప్రదర్శనలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించి పలు దుకాణాలను బంద్ చేయించారు. అనంతరం అఖిలపక్ష పార్టీలతో కలిసి మోటార్సైకిల్ర్యాలీ నిర్వహించారు. భద్రాచలం డివిజన్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. దీంతో డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బంద్ విజయవంతం కోసం సీపీఎం, సీపీఐ, టీడీపీ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ కార్యకర్తలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు. రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకోవటం, రాస్తారోకో, ధర్నాలు చేయడం తగదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశారు. సీపీఎం నాయకులు అంబేద్కర్ సెంటర్లో ఆర్టీసీ బస్సుకు గాలి తీసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డగించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉదయమే రోడ్లపైకి వచ్చిన సీపీఎం శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పాల్వంచలో కొన్ని చోట్ల వ్యాపార సముదాయాలు తెరిచే ఉంచారు. పినపాక నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల మండల కేంద్రాల్లో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు బంద్లో పాల్గొని బంద్ను విజయంతం చేశాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాలలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు బ్యాంకులను అఖిలపక్ష నాయకులు బంద్ చేయించారు. సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ నాయకులు పట్టణంలో ప్రదర్శనలు చేశారు. వైరా, కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలు, అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. సబ్డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట, ముల్కలపల్లి మండలాల్లో బంద్ జరగలేదు. ముల్కలపల్లి మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పాలేరు నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. ఖమ్మం రూరల్ మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. నేలకొండపల్లి మండలంలో టీఆర్ఎస్, సీపీఎం, న్యూ డెమోక్ర సీ, టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలను, వాణిజ్య సముదాయాలను మూసివేయించారు. కూసుమంచి మండలంలో సీపీఎం, ఏఐఎస్ఎఫ్ నాయకులు దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. తిరుమలాయపాలెం మండలంలో న్యూడెమోక్రసి, సీపీఎం, సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. -
‘నాగై’ బంద్!
సాక్షి, చెన్నై : జాలర్ల అరెస్టుకు నిరసనగా నాగపట్నంలో వాణిజ్య బంద్ విజయవంతం అయింది. దుకాణాలన్నీ మూత బడటంతో జనం తంటాలు పడ్డారు. ఆమరణ దీక్షలోకు పూనుకున్న వారిలో 20 మందికి అస్వస్థతకు లోనై స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలిం చారు. సచివాలయంలో సీఎం జయలలితతో జాలర్ల సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. నాగపట్నం జాలర్లు 200 మందికి పైగా శ్రీలంక చెరలో బందీగా ఉన్న విషయం తెలిసిందే. తమ వాళ్ల విడుదలకు డిమాండ్ చేస్తూ అక్కరై పేట, చీక్కినా కుప్పం తదితర ఎనిమిది గ్రామాల జాలర్ల కుటుంబా లు ఆమరణ దీక్షకు దిగాయి. చేపల వేటను నిషేధించా యి. నాగపట్నం తపాలా కార్యాలయం వద్ద వీరు వారం రోజులుగా దీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు సైతం దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు, వర్తక సంఘాలు, లారీ యజమానులు, డ్రైవర్ల సంఘాలు కదిలాయి. వీరి నేతృత్వంలో ఆ జిల్లాలో ఆందోళనలు జరుగుతోన్నాయి. వాణిజ్య బంద్: సోమవారంతో దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. వీరి దీక్షకు మద్దతుగా నాగై జిల్లా వాణిజ్య బంద్కు వర్తక సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో జిల్లాలో అన్ని దుకాణాలు మూత బడ్డాయి. పూంబుహార్, తరంగంబాడి, వేదారణ్యం, నాగుర్ తది తర ప్రాంతాల్లో జాలర్లకు మద్దతుగా ఆందోళనలు జరి గాయి. ప్రజా సంఘాలు, పార్టీలు జాలర్లకు మద్దతు ప్రకటించాయి. దీక్ష చేస్తున్న వారిలో 20 మంది మహిళలు ఉదయం అస్వస్థతకు లోనయ్యారు. ఉన్నట్టుండి స్పృహ తప్పడంతో దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తంజావూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సీఎంతో భేటీ: తమ మీద జరుగుతున్న దాడుల్ని ఏకరువు పెట్టేందుకు, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ జాలర్ల సంఘాల ప్రతినిధులు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం జయతో భేటీ అయ్యారు. నాగపట్నం, పుదుకోట్టై, రామనాధపురం జిల్లాలకు చెందిన జాలర్ల సంఘాల ప్రతినిధులు వీరముత్తు, సెల్వన్, శివజ్ఞానం, వడి వేలు, విజయ్ తదితరులు సీఎంతో అరగంట పాటుగా సమావేశం అయ్యారు. శ్రీలంక నావికాదళం పైశాచికత్వాన్ని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక చెరలో బందీలుగా ఉన్న జాలర్లను విడిపించాలని, పడవల్ని తిరిగి స్వాధీనం చేసుకోనేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామంటూ సీఎం జయలలిత చెప్పారు. నాగైలో సాగుతున్న దీక్షను విరమింప చేయాలని, జాలర్లకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. దీంతో జాలర్ల సంఘాలన్నీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు ప్రకటించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement