breaking news
Balaji Residency
-
మోటార్ వైరే మంట పెట్టింది!
సాక్షి, హైదరాబాద్: వాటర్ మోటార్ వైరులో ఏర్పడిన షాట్సర్క్యూట్ కారణంగానే బజార్ఘాట్లోని బాలాజీ రెసిడెన్సీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రా థమికంగా నిర్థారించారు. ఉదంతం చోటు చేసుకున్న భవ నం గ్రౌండ్ ఫ్లోర్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను విశ్లేషించిన నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చారు. సోమ వారం జరిగిన ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతిచెందిన విషయం విదితమే. ప్రమాదానికి షార్ట్సర్క్యూటే కారణమని మొదట్లోనే భావించినా... ఎప్పుడు? ఎక్కడ నుంచి జరిగిందనేది తాజాగా క్లూస్ టీమ్ అధికారులు గుర్తించారు. కేసింగ్ దెబ్బతిని వైర్లు బయటకు... ఈ అపార్ట్మెంట్ను జీ+4 విధానంలో నిర్మించారు. మధ్యలో లిఫ్ట్, మెట్లు ఉండగా... వీటికి కుడి వైపున నాలుగు, ఎడమ వైపున నాలుగు చొప్పున ఫ్లాట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ గదితో పాటు యజమాని రమేష్ జైశ్వాల్కు సంబంధించిన అక్రమ గోదాములు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కుడి వైపు వాచ్మెన్ రూమ్ పక్కన పాలిమర్ షీట్లు నిల్వ ఉంచగా.. ఎడమ వైపు రసాయనాల డబ్బాలు ఉంచారు. దీనికి సమీపంలోనే కొన్ని కార్టన్ బాక్సుల్నీ నిల్వ చేశారు. వీటి వెనుక ఉన్న గోడకు స్టార్టర్ నుంచి మీటర్ వరకు వెళ్ళిన వైరు కేసింగ్తో ఉంది. కార్టన్ బాక్సుల్ని పదేపదే కదిపిన కారణంగా కేసింగ్ దెబ్బతినడంతో వైర్లు బయటకు వచ్చి ఉంటాయని, ఇవి రాపిడికి గురికావడంతో పైన ఉండే పొర దెబ్బతిని లోహపు వైరు బయటకు వచ్చి ఉంటుందని క్లూస్ టీమ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మోటార్ ఆన్ చేసిన కొన్ని నిమిషాలకే... అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య సోమవారం ఉదయం 8.15 గంటలకు మోటార్ ఆన్ చేశారు. దాదాపు అర్ధగంట తర్వాత 8.45 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయడం మానేశాయి. దీన్ని బట్టి అప్పుడే షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాచ్మెన్ దంపతులను ప్రశ్నించిన పోలీసులు మరికొన్ని వివరాలు సేకరించారు. షార్ట్సర్క్యూట్ ప్రభావంతో వచ్చిన నిప్పురవ్వల కారణంగా కార్టన్ బాక్సులకు నిప్పు అంటుకుంది. గమనించిన వాచ్మెన్ దంపతులు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ లోపే ఆ బాక్సుల్లో ఉన్న మెటీరియల్ అంటుకుని మంటలు విస్తరించడం మొదలయ్యాయి. వాచ్మెన్ కాలికి గాయం కావడంతో వేగంగా స్పందించలేకపోయాడు. దాంతో మంటలు రసాయనాలకు అంటుకోవడంతో ఊహించని నష్టం జరిగిపోయింది. ఉస్మానియా ఆస్పత్రిలోని బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న మరో బాధితుడు తల్హా (17) పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
వ్యభిచారం గుట్టు రట్టు
టీడీపీ కౌన్సిలర్కు చెందిన లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు వ్యభిచారం చేస్తున్న తొమ్మిది మంది నిందితుల గుర్తింపు పోలీసుల అదుపులో ఏడుగురు యుువకులు, ఇద్దరు వుహిళలు పిడుగురాళ్ళ: పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం పోలీసుల తనిఖీలతో బట్టబయలైంది. ఇద్దరు మహిళ లను, ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ళ పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ భర్త అయిన భవనాశి ఎల్లారావు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కల్యాణ మండపం, దానిపై బాలాజీ రెసిడెన్సీ పేరుతో ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. వీటిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో పట్టణ సీఐ సుబ్బారావు సిబ్బందితో వెళ్లి లాడ్జి, కల్యాణ మండపాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఏడుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంతకాలం రాజకీయ అండదండలతో గుట్టుగా సాగుతున్న వ్యవహారం బహిర్గతమైంది. సోమవారం పట్టణంలో ఏ నలుగురు కలిసినా ఈ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న విషయూన్నే చర్చించుకోవడం విశేషం. పోలీసులపై ఒత్తిళ్లు.. ధైర్యంగా దాడులు చేసిన పోలీసులు తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓ వైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో తనిఖీల్లో పట్టుబడిన వారిని మీడియూ ఎదుట ఉంచడానికి పోలీసులు వివుుఖత చూపిస్తున్నారు. వారం రోజుల కిందట సున్నం బట్టీల వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న వుుగ్గురు వుహిళలు, ఆరుగురు యుువకులను అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు, వారిని వెంటనే మీడియూ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు పట్టుబడినవారు పలుకుబడి ఉన్న వ్యక్తుల కువూరులు కావడంతో వీరందరినీ పట్టణ పోలీస్స్టేషన్లో ఓ గదిలో రహస్యంగా ఉంచారు. మీడియూను కూడా అనుమతించకపోవడంతో పలు అనువూనాలకు తావిస్తోంది. దీనిపై సీఐ సుబ్బారావు మాట్లాడుతూ తాము అదుపులోకి తీసుకున్న నిందితులందరినీ కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. ఎల్లారావు అరెస్టుకు డిమాండ్ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఎల్లారావును వెంటనే అరెస్టు చేయూలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణవుూర్తి డివూండ్ చేశారు. పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ సుబ్బారావును కలసి మాట్లాడుతూ అధికార, ధన బలం ఉందన్న ధీవూతో కల్యాణ మండపంపైనే లాడ్జిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.