breaking news
baggage charges
-
ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్
విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.‘మహారాజా స్కాలర్ స్కీమ్’ వివాదంలో విద్యార్థినికి అనుకూలంగా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. ‘మహారాజా స్కాలర్ స్కీమ్’ (Maharaja Scholar Scheme) నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు రూ. 74,131 జరిమానా విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ (State Consumer Redressal Commission) తీర్పునిచ్చింది.2021లో అదనపు లగేజీ (Excess Baggage) కింద ఒక విద్యార్థిని నుండి రూ. 34,131లను ఎయిర్ ఇండియా అక్రమంగా వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె ఈ పథకానికి అర్హురాలేనని సంస్థ అంగీకరించినప్పటికీ, రీఫండ్ (డబ్బులు తిరిగి ఇవ్వడం) ఇవ్వడంలో ఏళ్ల తరబడి జాప్యం చేసింది. దీంతో ఆ విద్యార్థిని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు విద్యార్థినికి అనుకూలంగా తీర్పునిచ్చింది.జిల్లా వినియోగదారుల కమిషన్ 2024 ఫిబ్రవరి నాటి ఆదేశాల ప్రకారం తనకు చెల్లింపులు చేయకుండా, ఆలస్యం చేయడంతోపాటు, తనను మానసిక క్షోభ గురి చేశారని జైపూర్ నివాసి లావణ్య మాగన్ ఆరోపించింది. దీనికి అదనంగా మరింత పరిహారం అందించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జుడీషియల్ మెంబర్ ముఖేష్, మెంబర్ దినేష్ కుమార్లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.ఫిర్యాదుదారైన విద్యార్థినిని అనవసరమైన మానసిక వేధింపులకు గురైందని, కోర్టు చుట్టూ తిరగడం వల్ల ఆమె విలువైన సమయం వృధా అయిందని కోర్టు విశ్వసించింది. కాబట్టి ఆమె పడిన మానసిక ఆవేదన పూర్తిగా సమంజసమైనదేనని మే 29న కమిషన్ వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత, మాగన్ సదరు స్టూడెంట్ స్కీమ్కు అర్హురాలేనని స్వయంగా సంస్థే అంగీకరించిందని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది.అసలు వివాదం ఏంటి? ఎయిరిండియా ప్రవేశపెట్టిన “మహారాజా స్కాలర్ స్కీమ్” ద్వారా అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక లగేజీ అలవెన్స్ లభిస్తుంది. ఈ స్కీం కిందే యూకేలో చదువుకుంటున్న విద్యార్థిని లావణ్య మాగన్, లండన్నుంచి ఇండియాకు వచ్చేందుకు జూలై 21, 2021న ఎయిరిండియా టికెట్ బుక్ చేసుకుంది. ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ చేసే సమయంలో ఆమెకు ఈ స్టూడెంట్ లగేజీ స్కీమ్ వర్తించదంటూ అదనపు లగేజీ ఛార్జీల కింద 350 బ్రిటిష్ పౌండ్లు (రూ. 34,131) వసూలుచేయడంతో వివాదం మొదలైంది.అకడమిక్ ప్రోగ్రామ్ (చదువు) కాలపరిమితి ముగిసినందువల్ల ఆమె ఈ పథకానికి అర్హురాలు కాదని మొదట ఎయిరిండియా వాదించి, క్లెయిమ్ను తిరస్కరించింది. అయినా మాగన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను నాలుగేళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తి చేశానని, తన ప్రయాణం చదువు పూర్తి కావడానికి సంబంధించిందేనని వాదించింది. చివరికి ఎయిరిండియా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించింది. కానీ దాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో మరోసారి వినియోగరుదారుల కమిషన్ను ఆశ్రయించి విజయం సాధించింది. -
విమానంలో లగేజీ గొడవ, పోలీసు చేయి కొరికేసింది
విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు చాలా టెన్షన్ ఉంటుంది. విమానంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు అనే సందేహాలు మొదలు, సయానికి సెక్యూరిటీ చెకప్ ముగించుకుని గేట్లోకి వెళ్లడం, లగేజీ నిర్దేశించిన బరువులో ఉందా లేదా చూసుకోవడం దాకా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా పరిమితి కంటే లగేజీ బరువు కాస్త ఎక్కువైనా ప్యాసెంజర్లకు చుక్కలే. అదనపు చార్జీల (Excess baggage fee) మోత మోగుతుంది. ఇక్కడే చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అర్జెంటీనాలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్స్ట్రా లగేజీ ఫీజుకు సంబంధించిన హైడ్రామా ఊహించని రేంజ్కి చేరింది.అసలేం జరిగింది?‘మిర్రర్ యూకే’ కథనం ప్రకారం.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ (Buenos Aires) లో గ ‘జార్జ్ న్యూబెరీ ఎయిర్పార్క్’ లో జెట్స్మార్ట్ (JetSmart) విమానంలో ఈ సంఘటన జరిగింది. కొర్డోబాకు వెళ్లాల్సిన ఆ విమానం ఎక్కేందుకు ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చింది. అయితే, ఆమె పరిమితికి మించి క్యాబిన్ లగేజీని తీసుకురావడంతో, దానికి అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ సిబ్బంది కోరారు. దానికి ఆమె నిరాకరించడంతో బోర్డింగ్ గేట్ వద్ద వివాదం మొదలైంది.గేట్ వద్ద గొడవ జరుగుతున్నప్పటికీ, ఆమె సిబ్బంది కళ్లుగప్పి ‘ఫ్లైట్ JA 3104’ లోపలికి వెళ్ళిపోయింది. ప్రామాణిక బోర్డింగ్ నియమాలను ఉల్లంఘించి ఆమె విమానం ఎక్కేసిందని గ్రహించిన సిబ్బంది, వెంటనే భద్రతా సిబ్బందిని ఎలర్ట్ చేశారు.నిజానికి బోర్డింగ్ గేట్ వద్దే ముగిసిపోవాల్సిన ఈ గొడవ, ఆమె విమానం లోపలికి వెళ్లడంతో మరింత వివాదాస్పందగా మారింది. అప్పటికే ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చుని, విమానం టేకాఫ్కు సిద్ధమవుతోంది. ఆ సమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి, ఆమెను కిందకు దించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ మహిళ ఒక్కసారిగా ఒక మహిళా పోలీస్ అధికారిణి కుడి చేతిపై గట్టిగా కొరికింది. ఈ ఊహించని ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుతీవ్ర ఘర్షణ తర్వాత ఎయిర్పోర్ట్ పోలీసుల ఎట్టకేలకు ఆమెను నియంత్రించి, విమానం నుండి కిందకు దించేశారు. దీనిపై అర్జెంటీనా 'నేషనల్ క్రిమినల్ అండ్ కరక్షనల్ ఫెడరల్ కోర్ట్ నెం. 3' ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. గాయపడిన మహిళా అధికారిణి, షిఫ్ట్ సూపర్వైజర్, జెట్స్మార్ట్ విమాన సిబ్బంది నుండి దర్యాప్తు అధికారులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన? -
ఫారిన్ నుంచి ఇక ఎక్కువ తెచ్చుకోవచ్చు..!
విదేశాల నుంచి వచ్చే వారు సాధారణంగా మిత్రులు, బంధువులకు బహుమతులు తీసుకువస్తుంటారు. అయితే ఇప్పటివరకు దిగుమతి సుంకాలు, పరిమితుల కారణంగా ఎక్కువ విలువైన వస్తువులను తీసుకురావడం సాధ్యపడేది కాదు. ఇకపై ఆ పరిస్థితి మారనుంది.అంతర్జాతీయ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్ 2026–27లో కేంద్ర ప్రభుత్వం డ్యూటీ ఫ్రీగా భారత్కు తీసుకురాగల వస్తువుల విలువ పరిమితిని పెంచింది. ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి కొత్త బ్యాగేజీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.కొత్త బ్యాగేజీ నిబంధనలు ఏమిటంటే..వాయు లేదా సముద్ర మార్గంలో వచ్చే భారత సంతతికి చెందిన నివాసితులు, పర్యాటకులు రూ. 75,000 వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్కు తీసుకురావచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి రూ. 50,000 మాత్రమే ఉండేది.అలాగే విమాన లేదా సముద్ర మార్గంలో వచ్చే విదేశీ పర్యాటకులకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచారు.అయితే కొన్ని రకాల వస్తువులకు మాత్రం ఈ సడలింపులు వర్తించవు. 50 యూనిట్లకు మించిన తుపాకీ గుళికలు, 100 కంటే ఎక్కువ సిగరెట్లు, 25 కంటే ఎక్కువ సిగార్లు, 125 గ్రాములకంటే ఎక్కువ పొగాకు, 2 లీటర్లకు మించిన మద్యం, ఆభరణాల రూపంలో కాకుండా బంగారం లేదా వెండి, టెలివిజన్లు వీటిలో ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులుకేంద్ర బడ్జెట్ 2026–27లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ నిర్ణయంతో భారత్లోకి దిగుమతి చేసుకునే వ్యక్తిగత వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ మరింత అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ముందుగానే విడుదలైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. -
లగేజ్తో రైలు ఎక్కుతున్నారా? ఇక కొత్త రూల్స్
ఇండియన్ రైల్వే ప్రయాణికుల లగేజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైళ్లలో సామానుపై ఉన్న నిబంధనలు సడలింపుగా ఉండటంతో, ప్రయాణికులు అధిక బరువు, పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులతో ప్రయాణిస్తున్నారు. ఇది రైలు బోర్డింగ్ సమయంలో రద్దీ పెరగడానికి, ప్రయాణికుల అసౌకర్యానికి, భద్రతా సమస్యలకు దారితీస్తోంది.ఈ నేపథ్యంలో, విమానాశ్రయాల్లో అమలవుతున్న తరహాలోనే, రైల్వే కొన్ని ప్రధాన స్టేషన్లలో సామానుపై పరిమితులు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాగ్రాజ్, మిర్జాపూర్, కాన్పూర్, అలీగఢ్ జంక్షన్ స్టేషన్లలో తొలుత ఈ నిబంధలను అమలు చేయనున్నారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు తమ సామానును ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ల ద్వారా తూకం చేయించాల్సి ఉంటుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే, అదనపు చార్జీలు విధిస్తారు. పరిమాణం ఎక్కువగా ఉండి బరువు తక్కువగా ఉన్న బ్యాగులపై కూడా ప్రత్యేక ఫార్ములా ద్వారా చార్జీలు లెక్కించనున్నారు. ఉచిత సామాను పరిమితి ప్రయాణ తరగతిని బట్టి మారుతుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే ‘ఎల్’ స్కేల్పై 1.5 రెట్లు చార్జీలు విధిస్తారు. కనీస చార్జీ రూ.30, కనీస బరువు 10 కిలోలు, కనీస దూరం 50 కిలోమీటర్లు. 5–12 ఏళ్ల పిల్లలకు ఉచిత లగేజీ పరిమితిలో సగం, గరిష్టంగా 50 కేజీల వరకూ అనుమతి ఉంటుంది. పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులు, బోర్డింగ్ స్పేస్ను ఆక్రమించేలా ఉంటే జరిమానా విధిస్తారు. స్కూటర్లు, సైకిళ్లు వంటి వస్తువులకు ఉచిత పరిమితి వర్తించదు.ప్రయాణ తరగతుల వారీగా ఉచిత సామాను పరిమితిప్రయాణ తరగతిగరిష్ట పరిమితిఉచిత పరిమితిఅదనపు ఛార్జీతో అనుమతించేదిఏసీ ఫస్ట్ క్లాస్150 కిలోలు70 కిలోలు15 కిలోలుఏసీ 2-టయర్ / ఫస్ట్ క్లాస్100 కిలోలు50 కిలోలు10 కిలోలుఏసీ 3-టయర్ / చైర్ కార్40 కిలోలు40 కిలోలు10 కిలోలుస్లీపర్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)80 కిలోలు40 కిలోలు10 కిలోలుసెకండ్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)70 కిలోలు35 కిలోలు10 కిలోలురైళ్లలో లగేజీ పరిమితికి సంబంధించి నిబంధనలు ఇదివరకే ఉన్నాయని, అయితే వాటి అమలు విషయంలో రైల్వే కఠినంగా వ్యవహరించేది కాదని అధికారులు చెబుతున్నారు. “లగేజీ నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. వాటి అమలును పర్యవేక్షించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చాం” అని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ తగ్గించటం, బోర్డింగ్ సౌలభ్యం పెంచటం, రైళ్లలో భద్రత మెరుగుపరచటం ఈ చర్యల లక్ష్యంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది -
రైలు ప్రయాణికులకు కీలక అప్డేట్
ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి ఎంతబడితే అంత బ్యాగేజీ తీసుకెళ్లడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఎందుకంటే పరిమిత స్థాయిలోనే బ్యాగేజీని అనుమతించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. విమానాశ్రయాలలో మాదిరిగానే, ఇప్పుడు ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీని తూకం వేయనున్నట్టు ప్రకటించింది. నిర్దేశించిన పరిమితికి మించి ఎక్కువ లగేజీ ఉంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. కాబట్టి ప్రయాణికులు రైలు ఎక్కేముందే తమ బ్యాగేజీ ఎంతుందో ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సి ఉంటుంది.ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రిజర్వేషన్ టికెట్తో దూర ప్రయాణాలు చేసే వారు అధికంగా బ్యాగేజీ తీసుకెళుతుంటారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వలస కూలీలు కూడా ఎక్కువ సామాన్లతో రైలు ఎక్కుతుంటారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి బ్యాగేజీని పరిమితం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎయిర్పోర్టుల్లో మాదిరిగా రైల్వేస్టేషన్లలోనూ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్లతో లగేజీ (Luggage) తూకం వేసేందుకు ఏర్పాట్లు చేసింది.బరువుతో పాటు సైజు కూడా..బ్యాగేజీ బరువు మాత్రమే కాకుండా పరిమాణాన్ని కూడా తనిఖీ చేస్తామని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. బ్యాగేజీ చాలా పెద్దదిగా ఉండి, కోచ్ లోపల అదనపు స్థలాన్ని ఆక్రమించేట్టు ఉంటే.. ప్రయాణికుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంటే బ్యాగేజీ బరువు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ సైజు పెద్దగా ఉంటే మాత్రం ఫైన్ (Fine) తప్పదు. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రయాగ్రాజ్ నార్త్ సెంట్రల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ హిమాన్షు శుక్లా మీడియాతో చెప్పారు.ఫస్ట్ అక్కడ నుంచే..ప్రయాగ్రాజ్ డివిజన్లోని కీలక స్టేషన్ల నుంచి ఈ విధానాన్ని ప్రారంభించాలని నార్త్ సెంట్రల్ రైల్వే (North Central Railway) నిర్ణయించింది. వీటిలో ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్రాజ్ ఛోకి, సుబేదార్గంజ్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్, తుండ్లా, అలీఘర్ జంక్షన్, గోవింద్పురి, ఎటావా స్టేషన్లు ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్లాట్ఫామ్లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులు తమ బ్యాగుల బరువు చూసుకోవాలి. బ్యాగేజీ బరువు తక్కువగా ఉన్నా పరిమాణం(సైజు) పెద్దగా ఉంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.గరిష్టంగా 70 కిలోలు..రిజర్వేషన్ టికెట్ల ఆధారంగా బ్యాగేజీ పరిమితిని రైల్వే శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా 70 కిలోల సామానుతో మాత్రమే రైలులో ప్రయాణించగలరు. కనిష్టంగా 35 కిలోల వరకు అనుమతిస్తారు. ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లొచ్చు. సెకండ్ ఏసీ 50 కిలోలు, థర్డ్ ఏసీ- స్లీపర్ క్లాస్ 40 కిలోలు.. జనరల్/సెకండ్ సిట్టింగ్ ప్యాసింజర్లకు 35 కిలోలు వరకు బ్యాగేజీ అనుమతిస్తారు. పరిమితి కంటే 10 కిలోల వరకు ఎక్కువ తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. దీనికి మించి లగేజీ ఉన్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ.అధికారులు ఏమంటున్నారు?రైళ్లల్లో ప్రయాణించేవారిలో చాలా మంది అధిక సామాను తీసుకెళుతుంటారు. దీనివల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు భద్రతకు విఘాతం కలుగుతుంది. ప్రయాణికులకు పటిష్ట భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేందుకు లగేజీని నియంత్రించాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవుల్లో రద్దీని మెరుగ్గా నియంత్రించడానికి ఈ చర్య దోహదపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. ఇక నుంచి ట్రైన్ జర్నీ (Train Journey) చేసేవారందరూ బ్యాగేజీ బరువును చెక్ చేసుకోవాల్సిందే.చదవండి: రైలు టికెట్లు ఈజీగా బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వచ్చేస్తోంది -
దేశీయ విమానాల బ్యాగేజీకి ఛార్జీల మోత


