‘బద్మాషులు’ వచ్చేస్తున్నారు
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్పై బి. బాలకృష్ణ, సి. రామ శంకర్ నిర్మించారు.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బద్మాషులు చిత్రం జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీపా ఆర్ట్స్ ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్కు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన లభించింది. గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యంతో, ఆకట్టుకునే కథనంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుంది. దర్శకుడు శంకర్ చేగూరి రిఫ్రెషింగ్ టేకింగ్తో, రెండు గంటల పాటు నవ్వులు పూయించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాత్రలు సహజంగా, స్థానికతను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులకు ‘మన ఊరి కథ’ అనే భావనను కలిగించనున్నాయి.