-
లక్ష్యం ఒకటే..ఉత్తర్వులు వేరు
- ఏప్రిల్ 15–22 వరకు ‘అమ్మ ఒడి’ నిర్వహణ - 24 నుంచి మే 10 వరకు ‘మన ఊరు మన బడి’ - 23 నుంచి వేసవి సెలవులు ప్రకటన ... అంతలోనే ఈ ఉత్తర్వు - ఎస్.ఎస్.ఏ.కు ... విద్యాశాఖకు కొరవడిన సమన్వయం - తలలు పట్టుకుంటున్న క్షేత్రస్థాయి అధికారులు రాయవరం: లక్ష్యం ఒక్కటే ... ఉత్తర్వులు వేర్వేరుగా రావడంతో విద్యాశాఖ అయోమయానికి గురవుతోంది. మొన్నటి వరకు విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు విద్యాశాఖ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. రెండు కార్యక్రమాల లక్ష్యం బడి ఈడు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే. ఒకే కార్యక్రమం నిర్వహణ కోసం విద్యాశాఖ, ఎస్.ఎస్.ఏ. వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడంపై రెండు శాఖల మధ్య ఉన్న సమన్వయలోపం బట్టబయలైంది. గందరగోళంలో ఉపాధ్యాయులు.. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమం పేరుతో బడిఈడు చిన్నారులను బడిలో చేర్చుకునే కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆయా పాఠశాలల పరిధిలో ఐదేళ్లు పైబడిన విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్చుకునే చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాల పరిధిలో ర్యాలీలు నిర్వహించి, తల్లిదండ్రులతో అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని మండలాల్లోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ‘అమ్మ ఒడి’ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లాలో 30,240 మందిని ఒకటో తరగతిలో చేర్పించారు. .మే 10వరకు ‘మన ఊరు మన బడి’ ‘అమ్మ ఒడి’ పేరుతో ఎస్ఎస్ఏ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు తిరిగి ‘మన ఊరు మన బడి’ పేరుతో చేపట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్పించాలని, 5వ తరగతి పూర్తయిన వారికి 6వ తరగతిలో చేర్పించాలని, 7వ తరగతి పూర్తయిన వారిని 8వ తరగతిలో చేర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న కార్యక్రమాలు గత వారం రోజులుగా ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు ఒకటే కావడం గమనార్హం. పైగా ప్రస్తుత వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి. ఒకే ఆశయంతో విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క విద్యాశాఖా మంత్రి ఈ నెల 23 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించగా... అధికారులు సెలవుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటించడం విశేషం. నవ్వులపాలవుతున్నాం... ఒకే కార్యక్రమాన్ని రెండుసార్లు నిర్వహించడం హాస్యాస్పదం. విద్యాశాఖలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయలేమిని బయటపెడుతోంది. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయు. ఇదేమి ఉత్తర్వులు... ఒకే కార్యక్రమంపై విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం సమన్వయలోపాన్ని బట్టబయలు చేస్తోంది. విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఉపాధ్యాయుల మధ్య గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ, ఎస్ఎస్ఏ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడింది. – టి.కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్. -
ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
–ప్రభుత్వ బడుల్లో చిన్నారుల చేరికలు పెంచుదాం –సర్వ శిక్షాభియాన్ పీవో శేషగిరి భానుగుడి(కాకినాడ సిటీ) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప«థకాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఉద్యమస్థాయిలో పనిచేయాలని సర్వశిక్షాభియాన్ పీవో మేకా శేషగిరి కోరారు. ‘ప్రభుత్వ బడి–అమ్మ ఒడి, పదితర్వాత పెళ్ళి కాదు 11’ కార్యక్రమాలపై సర్వశిక్షాభియాన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, బడిబయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ఐక్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిబ్బందికి, ఐఈఆర్టీలకు సూచించారు. ఇన్చార్జి డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని, వసతులు, విద్యాభివృధ్ధి పథకాలలో ప్రైవేటు పాఠశాలలకు అందనంత స్థాయిలో ప్రభుత్వపాఠశాలలు ఉన్నాయని చెప్పారు. తల్లిదడ్రులు అవగాహనారాహిత్యంతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఉచ్చులో పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులకు వర్సిటీ స్నాతకోత్సవం రీతిలో పట్టాలు ప్రదానం చేశారు. డీఈవో కార్యాలయం నుంచి బాలాజీచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ శారదాదేవి, వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు, అంగన్వాడీలు, సర్వశిక్షాభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement