breaking news
bad dream
-
పీడకలలు రాకుండా ఉండాలంటే...
ఎలాంటి ఆర్థిక సమస్యలూ, ఆరోగ్య సమస్యలూ లేకున్నా, ఒక్కోసారి ఏ అర్ధరాత్రి వేళలోనో గాఢనిద్రలో వచ్చే పీడకలలకు ఉలిక్కిపడి హఠాత్తుగా మేలుకుంటారు. ఇక ఆ తర్వాత నిద్రపట్టడమే గగనమవుతుంది. పీడకలలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే... ♦ మీకు అనుకూల నక్షత్రం చూసుకుని, ఏదైనా మంగళవారం రోజున మొదలుపెట్టి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించండి. ప్రతిరోజూ నిత్య పూజలో భాగంగా ఈ పఠనం సాగించండి. ♦ మహామృత్యుంజయ యంత్రాన్ని తాయెత్తులో భద్రపరచి, దానిని ఏదైనా శనివారం రోజున నల్లదారంతో మెడలో ధరించండి. ♦ ఉదయం, సాయంత్రం ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి. ప్రతిరోజూ నిత్యపూజలో భాగంగా దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించండి. ♦ పీడకలలకు పెద్దలే ఉలిక్కిపడతారు. పిల్లలకు ఇలాంటి అనుభవం ఎదురైతే మరింతగా భయాందోళనలు చెందుతారు. అలాంటప్పుడు పిల్లల తల వద్ద చిన్న పటిక ముక్కను ఉంచి వారిని నిద్రపుచ్చండి. వారు నిద్రలోకి జారుకుంటుండగా ఆంజనేయ దండకాన్ని పఠించండి. ♦ పిల్లలు పీడకలలో ఇబ్బంది పడుతుంటే, ఏదైనా మంగళవారం రోజున ఆంజనేయుడి ఆలయంలో అర్చన జరిపించండి. సంజీవని పర్వతం మోస్తున్నట్లుగా ఉండే ఆంజనేయుని వెండి లాకెట్ను పిల్లల మెడలో వేయండి. – పన్యాల జగ న్నాథదాసు -
చచ్చిపో.. చచ్చిపో అంటూ పీడకల రావడంతో..
హైదరాబాద్: కలల ప్రభావంతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. తుకారంగేట్ పోలీసుస్టేషన్ డీఎస్ఐ మోహన్ కథనం ప్రకారం... అడ్డగుట్ట బి-సెక్షన్లో స్వప్న(26),రాజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. స్వప్నకు కొంతకాలంగా నిద్రలో ‘చచ్చిపో.. చచ్చిపో’ అంటూ భయంకరమైన కలలు వస్తున్నాయి. ఈనెల 27 భర్త వరంగల్కు వెళ్లగా.. పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లారు. ఆ సమయంలో నిద్రపోతున్న స్వప్నకు మళ్లీ అటువంటి కలే రావడంతో.. ఒక్కసారిగా మంచంపైనుంచి లేచి వంట గదిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆర్పి బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ప్రస్తుతం చికిత్సపొందుతోంది.