-
Bachelor of Commerce: బీకాం.. భలే గిరాకీ!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వార్షిక ప్యాకేజీ రూ.20 లక్షలు అంటే.. అబ్బో అంటారు. కానీ ఇప్పుడు బీకాం చేసిన విద్యార్థికే ఏడాదికి రూ.21 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారంటే నమ్మగలమా? నమ్మాల్సిందే! అంతర్జాతీయ సంస్థలే కాదు, భారత్లోని కంపెనీలూ ఇప్పుడు అనలిస్ట్లకు ఇంతకన్నా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2023లో 60 శాతం వరకు అవకాశాలు వారికే దక్కే అవకాశం ఉందని ఇండియా స్కిల్ రిపోర్టు– 2023 చెబుతోంది. భవిష్యత్తులోనూ కామర్స్ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఆరేళ్ల నుంచే డిమాండ్ పెరుగుతూ వస్తోందని పేర్కొంది. 2017లో 37.98 శాతం బీకాం విద్యార్థులు ఉద్యోగాలు పొందితే, 2023లో ఇది ఊహించని విధంగా ఏకంగా 60.62 శాతానికి చేరుకోబోతోందని వివరించింది. ఇక బీటెక్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ క్రైం కోర్సుల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపింది. అన్ని రంగాల్లో పెరిగిన అవకాశాలు.. కరోనా తర్వాత వాణిజ్య రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ–కామర్స్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయంగా బహుళజాతి కంపెనీల్లో డేటా అనాలసిస్ వ్యవస్థ పెరిగింది. దీంతో అనలిస్ట్ల అవసరం పెరిగింది. బీకాం నేపథ్యం ఉన్న విద్యార్థులకు అంతర్జాతీయంగా డిమాండ్, తద్వారా ఉపాధి పెరగడానికి ఇది దోహద పడింది. ఇండియాలో బీకామ్కు ఉద్యోగావకాశాలు ఐదేళ్లలో దాదాపు 30 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత ట్యాక్స్ నిపుణుల ప్రాధాన్యత ఎక్కువైంది. గతంలో ఉన్న ఇన్కం ట్యాక్స్కు, ఇప్పటి జీఎస్టీకి చాలా తేడాలున్నాయి. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా పెరిగాయి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ట్యాక్స్ నైపుణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్ బిజినెస్ రంగాల్లో కూడా కామర్స్ నేపథ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అనలిస్ట్ ఉద్యోగుల వేతనం మూడేళ్ళల్లోనే 98 శాతం పెరిగినట్టు ఇండియా స్కిల్ నివేదిక పేర్కొంది. బీకాం కోర్సుల్లో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమని తెలిపింది. బీకాం కోర్సులకు క్రేజ్ అందివస్తున్న మార్కెట్ అవసరాల నేపథ్యంలో రాష్ట్రంలో బీకాం కోర్సులకు రానురాను డిమాండ్ పెరుగుతోంది. డిగ్రీ ప్రవేశాల్లో 41 శాతం వరకు బీకాం విద్యార్థులే ఉంటున్నారు. వాస్తవానికి ఆరేళ్ళ కిందట 46 శాతం సైన్స్ విద్యార్థులే ఉండేవాళ్ళు. ఇప్పుడు వీరి సంఖ్య 36 శాతానికి పడిపోయింది. 2017–18లో 80,776 మంది బీకాం కోర్సులో చేరితే, 2022–23లో 87,480 మంది చేరారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ను అందుకోవడానికి వీలుగా బీకాం కోర్సుల్లో తీసుకొచ్చిన మార్పులు ఇందుకు దోహదపడ్డాయి. బీకాంలో జనరల్, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త కోర్సులు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రెండ్ను అంచనా వేసే టెక్నాలజీని కూడా బీకాం కోర్సుల్లో మేళవించారు. ఈ తరహా కామర్స్ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ–కామర్స్ పెరగడంతో మంచి డిమాండ్ ఈ–కామర్స్ పెరిగిన నేపథ్యంలో ట్యాక్స్ కన్సల్టెన్సీ, ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల్లో బహుళజాతి కంపెనీలు కామర్స్ విద్యార్థులను అత్యధిక వేతనాలతో నియమిస్తున్నాయి. ప్రతి ఏటా డెలాయిట్, బ్రాడ్రిచ్, వెల్స్ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. హైదరాబాద్లో రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఢిల్లీలో రూ. 21 లక్షల వరకు బహుళజాతి సంస్థలు ఇస్తున్నాయి. బీకాం తర్వాత విదేశాల్లో ఎంబీఏ చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయి. – డాక్టర్ మోహన్కుమార్ (భద్రుక కాలేజీ ప్రిన్సిపల్) జీఎస్టీపై పట్టు ఉంటే మంచి వేతనం జీఎస్టీ వచ్చిన తర్వాత కామర్స్ విద్యార్థులకు డిమాండ్ పెరిగింది. అన్ని రకాల సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారికి ఎక్కువ వేతనం ఇస్తున్నారు. ఫైలింగ్ సిస్టమ్లో అనుభవాన్ని బట్టి వేతనాలు ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలో సీఏ తర్వాత జీఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు పొజిషన్ ఇస్తున్నారు. సీఏలకు ఏటా రూ.50 లక్షలు ఇవ్వడం కంటే జీఎస్టీ సర్టిఫికేషన్ ప్రోగ్రాం చేసిన వారికి రూ. 21 లక్షలు ఇవ్వడం కంపెనీలకు లాభదాయకంగా మారింది. – ఎక్కుల్దేవి పరమేశ్వర్ (ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి) సీఏ చేసే పనులన్నీ చేస్తున్నాం కామర్స్ తర్వాత యూఎస్లో మాస్టర్ ప్రోగ్రాం చేశాను. బహుళజాతి కంపెనీలో ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్ వింగ్లో ఉద్యోగం వచ్చింది. మొదట్లో రూ.18 లక్షలు ఇచ్చారు. సీఏ చేసే పనులన్నీ చేయగలుగుతున్నాం. జీఎస్టీ విధానంలో ఎక్కువ అనుభవం గడించాం. రెండేళ్ళల్లో నా వేతనం రూ.21 లక్షలకు పెరిగింది. – శశాంక్ (బహుళజాతి కంపెనీ ఉద్యోగి, ఢిల్లీ) -
బ్యాచిలర్ పాపులర్!
ఇంటర్మీడియట్ స్పెషల్ ఇంటర్మీడియెట్.. అకడమిక్ ప్రయాణంలో కీలక మైలురాయి. దీన్ని దాటిన తర్వాత ఎంపిక చేసుకునే కోర్సుపైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఇంతటి ముఖ్యమైన దశలో ఉన్నత విద్య, ఉపాధి కోణంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, అందుబాటులో ఉన్న అవకాశాలను విశ్లేషించుకొని కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో దేశంలో ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న పాపులర్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులపై ఫోకస్.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) ఉత్తమ కెరీర్ అవకాశాలకు బీటెక్ మంచి మార్గం. అందుకే ఎక్కువ మంది ఈ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారు. సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలపై ఉత్సాహం ఉన్నవారికి ఈ కోర్సు సరైంది. దీన్ని పూర్తిచేశాక వృత్తి జీవితంలో ఎదిగేందుకు ఎక్కువ అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ట్రిపుల్ఐటీలు, బిట్స్-పిలానీ వంటివి ఇంజనీరింగ్ విద్యకు ప్రముఖ సంస్థలు. ఇంటర్ ఎంపీసీ/10+2 అర్హతతో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, బిట్శాట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా బీటెక్లో ప్రవేశం పొందొచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శాస్త్రీయ దృక్పథం, ప్రజాసేవపై ఆసక్తి, ఒత్తిడిని ఎదుర్కొనే తత్వం ఉన్నవారికి ఈ కోర్సులు సరైనవి. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఢిల్లీ), క్రిస్టియన్ మెడికల్ కాలేజ్-వెల్లూర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్-పుణె, మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ (ఢిల్లీ), జిప్మర్ - పుదుచ్చేరి ప్రముఖమైనవి. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ద్వారా అడ్మిషన్ పొందొచ్చు! అయితే ఈసారి నీట్ ర్యాంకుతో ప్రవేశాలు జరిగే అవకాశముంది! బ్యాచిలర్ ఆఫ్ లా కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, పెరుగుతున్న కేసులు, చట్టాల్లో క్లిష్టత కారణంగా ప్రస్తుతం న్యాయ సేవలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో లా కోర్సులు పూర్తిచేసి, సంబంధిత వృత్తినైపుణ్యాలు పెంపొందించుకున్న వారికి అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సహనం, లాజికల్గా ఆలోచించగల నైపుణ్యాలు ఉన్నవారికి లా బెస్ట్ కెరీర్ చాయిస్! ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ద్వారా దేశంలోని 17 ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీల్లో అడ్మిషన్ పొందొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ-ఫ్యాకల్టీ ఆఫ్ లా, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (బెంగళూరు), నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (హైదరాబాద్) అందించే లా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రస్తుతం విద్యార్థుల్లో ఫ్యాషన్ డిజైన్ గ్లామరస్ కెరీర్ ఆప్షన్గా నిలుస్తోంది. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ఉంటే ఈ రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఫ్యాషన్, డిజైన్ కోర్సుల్లో ప్రముఖమైనవి. బ్యాచిలర్ స్థాయిలో ఫ్యాషన్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సామాజికంగా ప్రజలను మేల్కొలిపే ఉన్నత వృత్తిగా జర్నలిజం నిలుస్తోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వారికి జర్నలిజం కోర్సులు సరైనవి. యాంకరింగ్, జర్నలిజం, ఆర్జే, ఫొటో జర్నలిజం.. తదితర విభాగాల్లో కోర్సులు పూర్తిచేయొచ్చు. డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (బీజేఎంసీ) కోర్సులను పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఢిల్లీ), బెంగళూరు యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ వంటివాటితోపాటు రాష్ట్రస్థాయిలోని పలు వర్సిటీల్లో జర్నలిజం కోర్సుల్లో చేరొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దేశంలో ఆతిథ్య పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ఐహెచ్ఎం-ఢిల్లీ, ఐహెచ్ఎం-ముంబై, ఐహెచ్ఎం-కోల్కతా, ఐహెచ్ఎం-చెన్నై, ఐహెచ్ఎం హైదరాబాద్ తదితర కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఇన్స్టిట్యూట్స్ అందించే బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు మంచి ఆదరణ ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మ్యాథమెటికల్, అనలిటికల్, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉన్నవారు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)ను ఎంపిక చేసుకోవచ్చు. బీకాం (ఆనర్స్), బీకాం (కంప్యూటర్స్), బీకాం (ఈ-కామర్స)లకు కూడా విద్యార్థుల్లో ఆదరణ ఉంది. బీకామ్ కోర్సుతోపాటు సీఏ/సీఎస్/సీఎంఏ చేసినవారు కెరీర్పరంగా ఉన్నత అవకాశాలు అందుకోవచ్చు. బీకామ్ తర్వాత మాస్టర్ ఆఫ్ కామర్స (ఎంకామ్) కూడా చేయొచ్చు. ఎంకామ్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఈ-కామర్స వంటి కోర్సులను దేశంలో వివిధ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారు ఆర్థిక సేవల సంస్థలు, బ్యాంక్లు, కార్పొరేట్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్లలో ఇంజనీరింగ్ ముందుంది. ఈ కోర్సు ఉత్తీర్ణత ద్వారా లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు అపారం. అయితే కోర్సులో చేరే విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రాక్టికాలిటీకి.. తద్వారా ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. పరిశ్రమ వర్గాలు పదేపదే ప్రస్తావిస్తున్న స్కిల్ గ్యాప్ అనే సమస్య తలెత్తకుండా కోర్సులో చేరిన తొలి రోజు నుంచే అడుగులు వేయాలి. ఇక ఉన్నత విద్య పరంగా ఎంటెక్, పీహెచ్డీ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు. ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం, ప్రిన్సిపాల్, ఓయూసీఈ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement