breaking news
attacked with knives
-
అక్రమ నిర్మాణం వద్దన్నందుకు..
కత్తులతో దాడి, ఒకరికి గాయాలు బంజారాహిల్స్: మజీదుకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతుండటంపై ప్రశ్నించినందుకు కత్తులతో దాడి చేసిన సంఘటన మంగళవారం బంజారాహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఇండో అరబ్లీగ్కు చెందిన స్థలంలో ఉన్న మజీదు గ్రౌండ్ఫ్లోర్లో హోటల్ నిర్వహిస్తున్న వ్యక్తి దానిని బార్కాస్కు చెందిన సౌద్ అమోదీకి సబ్ లీజ్కు ఇచ్చాడు. అయితే హోటల్ ఎదురుగా ఉన్న స్థలంలో సౌద్ అక్రమ నిర్మాణం చేపడుతుండటంతో ఇక్రమ్ అడ్డుకున్నాడు. నిర్మాణం చేపడితే మజీదు కనిపించకుండా పోతుందని, ఇప్పటికే అక్రమంగా నడుస్తున్న హోటల్ను మూసేయాలని జీహెచ్ఎంసీ క్లోజర్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో సౌద్ తన అనుచరులతో కలిసి కర్రలు, కత్తులతో దాడి చేయడంతో ఇక్రమ్కు తీవ్రగాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న ఇక్రమ్ కారును ధ్వంసం చేసి పరారయ్యారు. పోలీసులు నిందితులకు చెందిన ఆడికారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
వడ్డీ వ్యాపారి దారుణ హత్య
వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరబండ స్వరాజ్య నగర్లో మంగళవారం తెల్లవారుజామున స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే సోమసుందర్ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. వ్యాపారంలో విభేదాలు రావడంతో భాగస్వామే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.