Assam Election Results
-
అస్సాం: 3జీలను మించిన మామ
అస్సాంలో బ్రాహ్మణనేతను ఎలాగైనా ఓడించాల్సిందేనన్న ఏకైక నినాదంతో ఎన్నికల బరిలో దిగిన మూడు కీలక పార్టీలు చతికిలపడ్డాయి. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్(జీ), రాయ్జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్(జీ), అస్సాం జాతీయ పరిషద్ నేత లురిన్జ్యోతి గొగోయ్(జీ) ఇలా అహోం వర్గానికి చెందిన మూడు పార్టీల (జీ) అగ్రనేతల ఎన్నికల వ్యూహాలను బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మ మరోసారి పటాపంచలు చేశారు.ఎగువ అస్సాంలో భారీగా పెరిగిన మద్దతు అహోం వర్గీయులు ఎక్కువగా నివసించే ఎగువ అస్సాంలో కాంగ్రెస్ హవా కొనసాగేది. ఆ సంస్కృతికి ఈసారీ హిమంత చరమగీతంపాడారు. ఎగువ అస్సాంను హిమంత అభివృద్ధి పథంలో పరుగులుపెట్టించాడు. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం హిమంతకు బాగా కలిసొచి్చంది. ఎన్నో ప్రాజెక్టులను రాష్ట్రానికి ముఖ్యంగా ఎగువ అస్సాంలో అమలుపరిచి అభివృద్ధిఫలాలు స్థానికులకు అందేలాచేశారు. గువాహటి–దిబ్రూగఢ్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణంతో ఈ మార్గంలో ప్రయాణసమయంలో భారీగా తగ్గింది. పలు జాతీయరహదారుల ప్రాజెక్టులు, నాలుగు లేన్ల రోడ్లు, వంతెనలు పూర్తిచేశారు. దీంతో పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్తో అనుసంధానం పెరిగింది. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగడానికి వీలుగా ల్యాండింగ్ స్ట్రిప్ నిర్మించారు.దిబ్రూగఢ్లో సర్వతోముఖాభివృద్ధికి కృషి.. రాష్ట్రంలో రెండో రాజధానిలా దిబ్రూగఢ్ నగరాన్ని హిమంత తీర్చిదిద్దారు. ఇక్కడే నూతనంగా శాసనసభ భవనం, ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించారు. దీంతో కేవలం ఒక్క నగరంలో పరిపాలన కేంద్రీకృతంకాకుండా వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని హిమంత విజయవంతంగా అమలుచేశారు. హిమంత మార్గదర్శకంలో డిస్పూర్, దిబ్రూగఢ్లలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయం కోసం అత్యధిక నిధులు వెచి్చంచారు. అస్సాం వైద్యకళాశాలను విస్తరించారు. మరో రెండేళ్లలో ఊహించనంత అభివృద్ధిచేసి చూపుతానని హిమంత గతంలోనే చేసిన ప్రకటన ఎన్నికల ఫలితాలపై బాగా ప్రభావం చూపింది. అందరూ మెచ్చిన మామ మేనమామతో ఉండే ఆతీ్మయానుబంధం అందరికీ చిరపరిచితమే. అంతే మమకారం ప్రజలపై హిమంత చూపారు. అందుకే అస్సాంలో ఆయనను అందరూ మామా అని ఆప్యాయంగా పిల్చుకుంటారు. నేనూ మీలో ఒకడిని, మనందరం ఒకే కుటుంబం అనేభావనను హిమంత విజయవంతంగా ప్రజల మనసుల్లో నాటారు. అందుకే ఎంతో మంది నేరుగా హిమంతకు తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. వాటిని తీరుస్తూ హిమంత ఓటర్లకు మరింత చేరువయ్యారు.మౌలికసదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిరాష్ట్రంలో మౌలికసదుపాయాల కల్పనకు హిమంత అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. బ్రహ్మపుత్ర నదీ సొరంగం, కజిరంగా ఎలివేటెడ్ కారిడార్, సెమీకండక్టర్ ప్లాంట్ స్థాపన కోసం ఏకంగా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం వంటివి హిమంత గెలుపునకు దోహదంచేశాయి. బీజేపీ–ఆర్ఎస్ఎస్ మూలాలున్న నేతకావడంతో పక్కా వ్యూహరచన, అమలులో బిశ్వశర్మది రాటుదేలారు. గతంలో కాంగ్రెస్లో పనిచేసి అనుభవం, ఆ పార్టీలోని లోటుపాట్లపైనా హిమంతకు బాగా పట్టుంది.అహోం వర్గీయులను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్(జీ), రాయ్జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్(జీ), అస్సాం జాతీయ పరిషద్ నాయకుడు లురిన్జ్యోతి గొగోయ్(జీ) చేసిన ప్రయత్నాలను హిమంత వమ్ముచేశారు. బంగ్లాదేశీ చొరబాటుదారులతో యావత్ అస్సాంకు ముప్పువాటిల్లుతోందని హిమంత ఎన్నికల్లో చెప్పారు. మియా ముస్లిం వర్గీయులపై హిమంత తీసుకునే చర్యలను ఓటర్లు సమర్థించే పరిస్థితి తీసుకొచ్చారు.రాష్ట్రంలోని హిందువులను ఏకతాటి మీదకు తీసుకురావడంలో సఫలమయ్యారు. చొరబాటుదారులు స్థానికుల నుంచి భూములు లాక్కుంటున్నారన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తన ప్రభుత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఓటర్లు నమ్మేలాచేశారు. ముస్లిం మియాలు స్థానిక గిరిజనులను పెళ్లాడి వాళ్ల గిరిజనభూములను లాక్కుంటున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు ఈ ముగ్గురు గొగోయ్ల పార్టీల నుంచి దీటైన పరిష్కార స్పందన కరువైంది. అయోధ్య రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ల నుంచి చొరబాట్ల అంశాలపై మాట్లాడుతూ జాతీయవాదిగా పేరు తెచ్చుకున్నారు. -
తనయుడిని గెలిపించిన తల్లి.. జైలు నుంచే జయభేరి
డిస్పూర్: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శిబ్సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన... ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందారు. గొగోయ్కు మొత్తం 57,219 ఓట్లు రాగా.. మొత్తం 46.06 శాతం ఓటర్ల మద్దతు ఆయనకు లభించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గొగోయ్ గువహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్సిటల్లో చికిత్స పొందుతున్నారు. అఖిల్ గొగోయ్ గత ఏడాది అక్టోబర్లో రైతు సంస్థ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్), కొన్ని యాంటీ సీఏఏ సంస్థల మద్దతుతో రైజోర్ దళ్ను స్థాపించారు. అస్సాంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు రైజోర్ దళ్ కొత్తగా ఏర్పడిన మరో పార్టీ అస్సాం జాతియా పరిషత్ (ఏజేపీ) తో కలిసి 18 స్థానాలకు పోటీ చేసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచినప్పటికీ... ఎన్నికల్లో మాత్రం సుభ్రామిత్ర గొగోయ్కు టిక్కెట్ ఇచ్చింది. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. కుమారుడి తరఫున రంగంలోకి దిగిన తల్లి... ఇక ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోవడంతో.. గొగోయ్ జైలు నుంచే ప్రజా సమస్యలపై అనేక బహిరంగ లేఖలు రాశారు. దీనికితోడు జైల్లో ఉన్న తన కుమారుడి కోసం 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియదా గొగోయ్.. శిబ్సాగర్లోని గల్లీల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. కుమారుడి కోసం ఆమె చేస్తున్న పోరాటానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, సందీప్ పాండే మద్దతు తెలిపారు. శిబ్సాగర్కు తరలివచ్చి ప్రియదా గొగోయ్తో కలిసి ప్రచారం చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కొన్వర్ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి అగ్రనేతలను సైతం రంగంలోకి దించినా.. గొగోయ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈ సందర్భంగా అఖిల్ గొగోయ్ భార్య మాట్లాడుతూ.. ‘‘అసోం శిబ్సాగర్ జనాలు అఖిల్ మీద పెంచుకున్న ప్రేమ, ఆప్యాయతలే తనని గెలిపించాయి. ఈ విజయం మా అందరి బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా శిబ్సాగర్ జనాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ, ఆప్యాయత వల్లనే అఖిల్ గొగోయ్ విజయం సాధించారు. అసోం చరిత్రలో ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే ఇంతవరకు జైలుకెళ్లిన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించిన ఘటనలు ఎక్కడా లేవు’’ అన్నారు. ఏవరీ అఖిల్ గొగోయ్... గువాహటిలోని కాటన్ కాలేజి నుంచి పట్టభద్రుడైన 46 ఏళ్ల గొగోయ్.. రాజకీయాలకు కొత్తేం కాదు. 1995-96 మధ్య ఆయన కాటన్ కాలేజి స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక ఏళ్లుగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) వేదికగా అనేక పోరాటాలకు నేతృత్వం వహించారు. 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం హింసకు దారితీయడంతో.. దీని వెనుక గొగోయ్ హస్తం ఉందంటూ ఎన్ఐఏ అధికారులు తనను అరెస్ట్ చేశారు. చదవండి: అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష -
కాంగ్రెస్, వామపక్షాలకు కనువిప్పు కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: బీజేపీపై మతతత్వ ముద్రతో విషం చిమ్మిన కాంగ్రెస్, వామపక్షాలకు అస్సాం ఎన్నికల ఫలితాలతో కనువిప్పు కలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అస్సాంలో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సంబరాలను జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 40 శాతం మైనారిటీ ఓటర్లున్న అస్సాంలో బీజేపీ ఘనవిజయం సాధించడం ప్రజలు తమ పార్టీవైపే ఉన్నారన్న విషయాన్ని స్పష్టంచేస్తోందన్నారు. టీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలను, నియంతృత్వ విధానాలను నిలువరించేవిధంగా బీజేపీ పోరాడుతుందన్నారు. సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత విమర్శలకు, బెదిరింపులకు దిగడం సరైందికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, నేతలు ప్రేమేందర్రెడ్డి విజయలక్ష్మి, సత్యనారాయణ, ఎస్.మల్లారెడ్డి, బద్దం బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


