ASIs
-
తుర్కియే సోంగర్లు
భారత త్రివిధ దళాల ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగుతోంది. సంప్రదాయ ఆయుధాలకు బదులుగా అత్యాధునిక డ్రోన్లతో భారత్పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో పాక్ మిత్రదేశం తుర్కియే తయారుచేసిన అత్యంత ప్రమాదకరమైన అసిస్గార్డ్ సోంగర్ సాయుధ యూఏవీలు ఉండటం కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే ఆధునిక యుద్ధ పద్ధతుల్లో సోంగర్ డ్రోన్లు సమర్థవంతమైనవిగా నిరూపించుకున్నాయి. వీటిని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. గురువారం రాత్రి భారత్లోని 36 మిలిటరీ, పౌర లక్ష్యాలపై సోంగర్ డ్రోన్లతోనే పాక్ దాడిచేసినట్లు మన రక్షణ శాఖ ప్రకటించింది. వాటిని సమర్థంగా కూల్చేసినట్లు శుక్రవారం మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. సోంగర్ డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగల గగనతల రక్షణ వ్యవస్థలు మనకు ఉన్నప్పటికీ.. వాటిని తక్కువగా అంచనా వేయకూడదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సోంగర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవీ.. → సోంగర్ డ్రోన్లను తుర్కియేలోని అంకారా కేంద్రంగా పనిచేస్తున్న అసిస్గార్డ్ సంస్థ తయారుచేసింది. వీటిని 2019 నుంచి వినియోగిస్తున్నారు. → ఈ డ్రోన్లు స్వయంచాలితంగా ప్రయాణించి లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్కు చేరుకోగలవు. రిమోట్ కంట్రోల్తో కూడా నియంత్రించవచ్చు. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇవి కీలకంగా పనిచేయగలవు. సరిహద్దులు దాటి దాడులు చేయటంలో వీటికి మంచి రికార్డు ఉంది. ప్రమాదకర సాయుధ డ్రోన్సోంగర్ డ్రోన్కు ఒక అత్యాధునిక ఆటోమేటిక్ మెషీన్ గన్ అమర్చబడి ఉంటుంది. చిన్నపాటి క్షిపణులను కూడా ఇది ప్రయోగించగలదు. 81 ఎంఎం మోరా్టర్ రౌండ్స్ను పేల్చగలదు. వ్యక్తులు, వాహనాలు, ఎంపికచేసిన చిన్నపాటి లక్ష్యాలపై సమర్థంగా దాడి చేయగలదు. ఫ్లైట్ పెర్ఫార్మెన్స్సోంగర్ డ్రోన్లు 45 కిలోల బరువును మోసుకెళ్లగలవు. పేలోడ్ లేకుండా ఏకబిగిన 25 నుంచి 30 నిమిషాల వరకు గగనతలంలో ఎగరగలవు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషననుంచి 3–5 కిలోమీటర్ల దూరం వరకు ఇవి దాడులు చేయగలవు. సముద్రమట్టం నుంచి 2,800 మీటర్లు, భూ మట్టం నుంచి 400 మీటర్ల ఎత్తువరకు ఇవి ఎగరగలవు. రియల్టైమ్ ఇంటెలిజెన్స్లక్ష్యాలపై నిఘా పెట్టడంలో కూడా సోంగర్ డ్రోన్లది అందెవేసిన చెయ్యి. ఇవి గగనతలంలో ఎగురుతూ గ్రౌండ్ స్టేషన్కు రియల్టైమ్ (ప్రత్యక్షంగా)లో వీడియోలు, చిత్రాలను పంపగలవు. దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించి వెంటనే గ్రౌండ్ స్టేషన్కు పంపుతాయి. రాత్రి– పగలు అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా ఈ డ్రోన్లు నిఘా పెట్టగలవు. రాత్రిపూట వీడియోలు, చిత్రాలు తీసేందుకు వీటిలో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి. స్వయంచాలితం ఈ డ్రోన్లను గ్రౌండ్ స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్తో నియంత్రించవచ్చు. అవసరమైతే వాటికవే స్వయంగా ఎగురుతూ నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయగలవు. గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు తెగిపోయినా వాటికవే తిరిగి స్టేషన్ను వెతుక్కుంటూ తిరిగి రాగలవు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గిపోయినా వెంటనే గ్రౌండ్ స్టేషన్కు వచ్చేస్తాయి. దీంతో వీటిని నియంత్రించేవారికి పని సులువు అవుతుంది. గుంపుగా దాడిచేయగల సామర్థ్యం సోంగర్ డ్రోన్లు ఒక్కొక్కటిగా నిర్దేశించిన లక్ష్యాలతోపాటు దాడులు చేయటంతోపాటు గుంపులుగా కూడా వెళ్లి దాడులు చేయగలవు. పదుల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు స్వయంగా సమన్వయం చేసుకుంటూ లక్ష్యంపై నలు దిక్కుల నుంచి దాడి చేస్తాయి. శత్రువు రక్షణ వ్యవస్థను గందరగోళపర్చి సమర్థంగా దాడులు చేయగల సత్తా వీటికి ఉంది. గురువారం భారత్లోని పలు లక్ష్యాలపై ఇలాగే దాడులు చేసినట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
అమ్మాయిలు... అదరగొట్టేందుకు...
మహిళల క్రికెట్లో మళ్లీ పరుగుల పండగొచ్చింది... కరీబియన్ దీవుల్లో ధమాకాకు రంగం సిద్ధమైంది... పది దేశాల ప్రాతినిధ్యంతో శుక్రవారం నుంచే టి20 ప్రపంచ కప్.పదహారు రోజుల పాటు మహా సంగ్రామం. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ దుమ్మురేపుతుందా? పెద్దన్న ఆస్ట్రేలియా అదరగొ డుతుందా? వన్డే జగజ్జేత ఇంగ్లండ్ సంచలనం రేపుతుందా? కివీస్ ఈసారైనా కొల్లగొడుతుందా? టీమిండియా తడాఖా చూపుతుందా? ఇంతకూ ధనాధన్ ఆటలో దశ తిరిగేదెవరిది? ప్రొవిడెన్స్ (గయానా) మహిళల క్రికెట్లో వన్డే ప్రపంచ సమరం ముగిసిన 15 నెలలకే పొట్టి ఫార్మాట్లో జగజ్జేత స్థానానికి అమీతుమి. శుక్రవారం నుంచి ఈ నెల 24 వరకు జరిగే ఈ టోర్నీకి వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది ఆరో ప్రపంచ కప్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత తమ దీవుల్లో జరుగనున్న పోరులో కరీబియన్లు డిఫెండింగ్ చాంపియన్గా అడుగిడుతుండటం విశేషం. గతంలో ఏ జట్టు సాధించని ఘనత ఇది. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ విజేత ఆస్ట్రేలియాను 2016లో సంచలనాత్మక రీతిలో ఓడించి తొలిసారిగా ఒడిసిపట్టిన ట్రోఫీని సొంతగడ్డపై నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలని కంగారూలు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ విజేత’ హోదాను టి20ల్లోనైనా దక్కించుకోవాలని టీమిండియా లెక్కలు వేసుకుంటోంది. మిగిలినవాటిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రమాదకరమైనవి. ఆ ఐదారే... పేరుకు 10 జట్లు పోటీకి దిగుతున్నా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్లను మాత్రమే సెమీఫైనల్ చేరే సత్తా ఉన్నవిగా అంచనా వేస్తున్నారు.దక్షిణాఫ్రికా మహిళల జట్టు ప్రభావ వంతంగా లేదు. పాకిస్తాన్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్లను ద్వితీయ శ్రేణి వాటిగానే పరిగణిస్తున్నారు. సంచలనాలు నమోదైతే తప్ప ఇవి ముందడుగు వేసే అవకాశం లేదు. ముఖ్యంగా నాలుగో సెమీస్ స్థానానికి వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ నెలకొననుంది. అయితే, ధనాధన్ ఆటలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి... ఏ జట్టునూ కచ్చితమైన ఫేవరెట్గా చెప్పలేని పరిస్థితి. గ్రూప్ నుంచి రెండేసి జట్లు... జట్లను ‘ఎ’, ‘బి’ గ్రూపులుగా వర్గీకరించారు. గ్రూప్ ‘ఎ’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, గ్రూప్ ‘బి’లో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ ఉన్నాయి. ఈ లెక్కన లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. విజేతకు 2 పాయింట్లు, మ్యాచ్ టై, లేదా రద్దయితే ఒక పాయింట్ ఇస్తారు. పట్టికలో 1, 2లో స్థానాల్లో నిలిచిన జట్టు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
ఎందుకెళ్లిందో..!
ఈ విద్యార్థిని పేరు బండి మాబుచాన్.. 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల క్రితం స్కూల్కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఈ బాలిక ఇంత వరకూ ఇంటికి రాలేదు.. మీ పాప మా వద్ద ఉందంటూ రెండు మూడు చోట్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. ఎంతో సంతోషంగా వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడికి వెళ్లాక నిరాశ ఎదురవుతోంది.. తీరా అక్కడికి వెళ్లిచూస్తే నిన్ననే పాప ఇక్కడి నుంచి వెళ్లిపోయిందంటూ వారు చెప్పడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తమ కుమార్తె ఎక్కడ ఉందో.. ఏం తింటుందో అని నెలరోజుల నుంచి తల్లిదండ్రులు అన్న పానీయాలు ముట్టుకోకుండా ఇంట్లో పడిపోయారు. ⇒ బడికెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాని బాలిక ⇒ నెలరోజులుగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ⇒ ఆచూకీ కోసం రెండు జిల్లాల పోలీసుల గాలింపు ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణం వివేకానంద కాలనీకి చెందిన బండి చిన్న దస్తగిరి బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి మాబుచాన్, మాబుషరీఫ్ అనే పిల్లలున్నారు. మాబుచాన్ కొర్రపాడు రోడ్డులోని టీవీఆర్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. గత నెల 27న స్కూల్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి విచారించారు. అయితే ఆ రోజు విద్యార్థిని స్కూల్కు రాలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో ఆ రోజంతా తల్లిదండ్రులు కుమార్తె కోసం గాలించారు. కర్నూలులో ప్రత్యక్షం.. ఇంటి నుంచి వెళ్లిన మాబుచాన్ కర్నూలులో 28న ప్రత్యక్షమైంది. ఆమె కర్నూలుకు వెళ్లే సమయంలో బస్సులో అదే సీటులో ఉన్న ప్రయాణికులు పరిచయమయ్యారు. బస్టాండ్లో దిగే సరికి రాత్రి కావడంతో మాబుచాన్ను చూసి వారు జాలిపడ్డారు. దీంతో సమీపంలో ఉన్న పెద్దపాడు చిల్డ్రన్స్ హోంకు తీసుకొని వెళ్లారు. వారు హోం నిర్వాహకులతో మాట్లాడి వదలి వెళ్లారు. బాలికతో మాట్లాడిన హోం నిర్వాహకులు 29న ప్రొద్దుటూరులోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు 30న అక్కడికి వెళ్లారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారని విషయం తెలుసుకున్న మాబుచాన్ 29న రాత్రి హోం నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వెళ్లి నిరాశతో వెనుతిరిగి వచ్చారు. ఈ మేరకు చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు కె.నాగలాపురం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మళ్లీ పోరుమామిళ్లలో ప్రత్యక్షం.. కొన్ని రోజులపాటు ఎవ్వరికి కనబడకుండా వెళ్లిన బాలిక డిసెంబర్ 8న పోరుమామిళ్లలోని మదర్ థెరీసా ఫౌండేషన్కు వెళ్లింది. నాలుగు రోజులపాటు బాలిక అక్కడే ఉండిపోయింది. ఫౌండేషన్ నిర్వాహకుడు చింతా రవిప్రకాష్రెడ్డి టూ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి ప్రొద్దుటూరు అమ్మాయి తప్పి పోయినట్లు కేసు నమోదైందా అని అడిగారు. అయితే తల్లిదండ్రులు అప్పటి వరకూ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. అందువల్ల ఎస్ఐ అదృశ్యంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపి, బాలిక ఫొటోను వాట్సప్లో పంపమని చెప్పారు. దీంతో రవిప్రకాష్రెడ్డి మాబుచాన్ ఫొటోను వాట్సప్ ద్యారా పంపించారు. అయితే 12న ఉదయం బాలిక తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్టేషన్కు వెళ్లి తమ కుమార్తె కనిపించలేదని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తన వద్ద ఉన్న ఫొటోను వారికి చూపించగా తమ కుమార్తేనని చెప్పారు. దీంతో ఎస్ఐ వెంటనే ఫోన్ చేయగా నిన్ననే పాప ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయిందని చెప్పారు. అయినప్పటికీ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లను పోరుమామిళ్లకు పంపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ తెలియలేదు. విద్యార్థిని పాఠశాలలో హైదరాబాద్ ఎంత దూరం, తిరుపతికి ఎలా వెళ్లాలి.. టికెట్ ఎంత అవుతుంది అని స్నేహితులతో తరచూ చెబుతుండేదని ఎస్ఐ తెలిపారు. కాగా కె.నాగలాపురం పోలీస్టేషన్ నుంచి శనివారం ఏఎస్ఐలు ఈశ్వరయ్య, మహ్మద్ఆలీలు టూ టౌన్కు వచ్చారు. వారు ఎస్ఐతో బాలిక అదృశ్యంపై మాట్లాడారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే 94407 96938 అనే నెంబర్కు ఫోన్ చేయాలని ఎస్ఐ కోరారు.