breaking news
Asia Cup tournament T20
-
శుభారంభంపై గురి
దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో టీమిండియా... ఆతిథ్య జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడనుంది. డిఫెండింగ్ వరల్డ్కప్ చాంపియన్ కావడంతో పాటు అపార ఐపీఎల్ అనుభవంతో నిండిన సూర్యకుమార్ బృందానికి ఈ పోరులో విజయం లాంఛనమే. అయితే మన తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ కానుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా ఎదిగే దశలోనే ఉన్న యూఏఈ బలమైన ప్రత్యర్థికి ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. 2024లో విజేతగా నిలిచిన టి20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి చూస్తే భారత్ 24 మ్యాచ్లు గెలిచి, 3 మాత్రమే ఓడింది. సామ్సన్ అవుట్! టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ పునరాగమనంతో టి20 టీమ్లో భారత్ తప్పనిసరి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఫార్మాట్లో అసాధారణ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న తిలక్ వర్మకు అదే స్థానంలో అవకాశం ఖాయం కాగా నాలుగో స్థానంలో కెపె్టన్ సూర్యకుమార్ ఉన్నాడు. దాంతో వికెట్ కీపర్గా సంజు సామ్సన్కు చాన్స్ దొరికే అవకాశం కనిపించడం లేదు.సామ్సన్ సాధారణంగా టాపార్డర్ బ్యాటర్. టాప్–3లో ఆడకపోతే అతనికి చోటు అనవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్ను బట్టి చూసినా అదే కనిపించింది. సామ్సన్కంటే ఫినిషర్గా జితేశ్ శర్మ మెరుగైన ఆటగాడు కాబట్టి కీపర్గా అతను బరిలోకి దిగవచ్చు. పేస్ బౌలింగ్, విధ్వంసక బ్యాటింగ్ కలగలిపిన ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో జట్టు దుర్బేధ్యంగా ఉంది. ప్రధాన పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్ల స్థానాలకు ఢోకా లేదు. మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఆడటంపై ఎలాంటి సందేహం లేదు. మిగిలిన ఏకైక స్థానం కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది. అయితే టీమిండియాకు సంబంధించి తుది జట్టులో ఎవరు ఉన్నా అంతా విడివిడిగా మ్యాచ్ విన్నర్లు కాబట్టి సమస్య లేదు. అనుభవలేమితో సమస్య... సొంత మైదానంలో బరిలోకి దిగుతుండటం, ఇటీవలే ముక్కోణపు టోర్నీలో కూడా ఆడిన అనుభవం యూఏఈ జట్టుకు మానసికంగా కాస్త ఆత్మవిశ్వాసం పెంచే విషయం. అయితే భారత్లాంటి అత్యంత బలమైన జట్టును ఈ టీమ్ నిలువరించడం చాలా కష్టమైన విషయం. బుమ్రాలాంటి స్టార్ను ఎదుర్కొని పరుగులు సాధించడం వారి శక్తికి మించిన పని కావచ్చు. ఓపెనర్, కెప్టెన్ మొహమ్మద్ వసీమ్తో పాటు మరో ఓపెనర్ అలీషాన్పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. ఆసిఫ్ ఖాన్, రాహుల్ చోప్రా కూడా కొన్ని కీలక పరుగులు సాధించగల సమర్థులు. జునైద్ సిద్దిఖ్, రోహిద్, హైదర్ అలీ ప్రధాన బౌలర్లు కాగా...లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్జీత్ సింగ్ మరో కీలక బౌలర్. భారత మాజీ ఆటగాడు, 2007లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కోచ్గా వ్యవహరించిన లాల్చంద్ రాజ్పుత్ ఇప్పుడు యూఏఈ టీమ్కు హెడ్ కోచ్గా ఉన్నాడు. ఆయన మార్గదర్శకత్వంలోనే టీమ్ ఇటీవల కాస్త మెరుగైంది.1 భారత్, యూఏఈ మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక టి20 మ్యాచ్ జరిగింది. 2016 ఆసియా కప్లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్, వాతావరణంచాంపియన్స్ ట్రోఫీ సమయంలో పిచ్ల పూర్తిగా పొడిబారి స్పిన్కు బాగా అనుకూలించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సీజన్లో కొత్తగా, జీవం ఉన్న పిచ్లు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అటు బ్యాటింగ్తో పాటు పేసర్లకు కూడా మంచి అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల మధ్య ఆటగాళ్లు శ్రమించాల్సి ఉంటుంది. -
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నమెంట్కు సన్నాహాల్లో భాగంగా భారత పురుషుల హాకీ జట్టు ఈ నెలలో ఆ్రస్టేలియాలో పర్యటించనుంది. ఆగస్టు 15 నుంచి 21 వరకు జరిగే ఈ పర్యటనలో టీమిండియా నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. ఈ సిరీస్లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. కర్ణాటకకు చెందిన డిఫెండర్ సీబీ పూవణ్ణ తొలిసారి జాతీయ సీనియర్ జట్టులోకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో భారత జట్టుకు శిక్షణ శిబిరం జరుగుతోంది. ఈ పర్యటన కోసం భారత జట్టు శుక్రవారం బెంగళూరు నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ పాఠక్, సూరజ్ (గోల్కీపర్లు), సుమిత్, జర్మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ (కెపె్టన్), సంజయ్, అమిత్ రోహిదాస్, నీలం సంజీప్, జుగ్రాజ్ సింగ్, పూవణ్ణ (డిఫెండర్లు), రాజిందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్ (మిడ్ఫీల్డర్లు), మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్ప్రీత్ సింగ్, సెల్వం కార్తీ, ఆదిత్య లలాగే (ఫార్వర్డ్స్). -
Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు..
దుబాయ్: టి20 ప్రపంచ కప్కు ముందు ఈ ఫార్మాట్లో ఉపఖండపు ప్రధాన జట్లు సన్నాహకానికి సన్నద్ధమయ్యాయి. ద్వైపాక్షిక సిరీస్లు కాకుండా కొంత విరామం తర్వాత భారత జట్టు కూడా రెండుకంటే ఎక్కువ జట్లు ఉన్న టోర్నీలో బరిలోకి దిగుతోంది. దాంతో ఆసియా కప్ టోర్నమెంట్ ఆసక్తికరంగా మారింది. ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో చేతులెత్తేయడంతో చివరి నిమిషంలో వేదిక యూఏఈకి మారింది. తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే ఈ సమయంలో ఆటగాళ్లకు ఇది కూడా సవాల్. టి20 ప్రపంచ కప్ జరిగే ఆస్ట్రేలియాతో పోలిస్తే పిచ్లు, పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉన్నా, తమ ఆటగాళ్లను పరీక్షించుకునేందుకు అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కనీసం రెండు మ్యాచ్లతో పాటు మరో మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో టోర్నీ పై అభిమానుల ఆసక్తి మరింత పెరిగేలా చేసింది. 2020లో జరగాల్సిన టోర్నీ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి రెండేళ్లు ఆలస్యంగా జరుగుతోంది. జట్ల వివరాలు: (గ్రూప్ ‘ఎ’)భారత్, పాకిస్తాన్, హాంకాంగ్. (గ్రూప్ ‘బి’) శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్. ఫార్మాట్: తమ గ్రూప్లోని రెండు జట్లతో ఆడిన అనంతరం టాప్–2 టీమ్లు ముందంజ వేస్తాయి. అక్కడ మిగిలిన మూడు టీమ్లతో తలపడాల్సి ఉంటుంది. టాప్–2 జట్లు ఫైనల్కు చేరతాయి. ఐదు టీమ్లు నేరుగా టోర్నీలో అడుగు పెట్టగా, క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా హాంకాంగ్ అర్హత సాధించింది. దుబాయ్, షార్జాలలో మ్యాచ్లు జరుగుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీ చరిత్ర: ఆసియా కప్ను ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించారు. 1984–2018 మధ్య ఈ టోర్నమెంట్లు జరిగాయి. అత్యధికంగా 7 సార్లు భారత్ విజేతగా నిలవగా, శ్రీలంక 5 సార్లు టోర్నీ గెలిచింది. పాకిస్తాన్ 2 సార్లు ట్రోఫీని అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్గా భారత్ బరిలోకి దిగుతోంది. 2018లో వన్డే ఫార్మాట్లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్ సాధించింది. 2016లో కూడా ప్రపంచకప్కు కొద్ది రోజుల ముందు ఈ టోర్నీని టి20 ఫార్మాట్లోనే నిర్వహించారు. చదవండి: IND vs PAK Asia Cup 2022: పాక్తో మ్యాచ్.. ప్రెస్ కాన్ఫరెన్స్కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే.. -
ఆసియా కప్ టి20 టోర్నీ రద్దు
కొలంబో: శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ రద్దయింది. కరోనా నేపథ్యంలో టోర్నీని నిర్వహించే స్థితిలో తాము లేమని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ యాష్లే డి సిల్వా ప్రకటించారు. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది పాకిస్తాన్లో జరగాల్సింది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లో భారత్ పర్యటించే అవకాశం లేకపోవడంతో టోర్నీ వేదికను పాక్ నుంచి శ్రీలంకకు మార్చారు. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన అన్ని జట్లు అంతర్జాతీయ క్రికెట్లో రెండేళ్లపాటు బిజీగా ఉండటంతో ఆసియా కప్ 2023 వన్డే వరల్డ్కప్ తర్వాత జరిగే అవకాశముంది. ఆసియా కప్ను 2016 నుంచి రొటేషన్ పద్ధతిలో వన్డే, టి20 ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. -
పాకిస్తాన్ గాడిలో పడేనా..!
మిర్పూర్: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భాగంగా నేడు జరిగే మ్యాచ్లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో పాకిస్తాన్ తలపడుతుంది. తమ తొలి మ్యాచ్లో ఘోరమైన బ్యాటింగ్తో భారత్ చేతి లో చిత్తయిన పాక్ తొలి విజయంపై దృష్టి పెట్టింది. తుది జట్టులో ఖుర్రం స్థానంలో ఇమాద్కు చోటు దక్కవచ్చు. మరోవైపు యూఏఈ బౌలింగ్లో ఆకట్టుకున్నా... బ్యాటింగ్ వైఫల్యంతో ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడింది. గతంలో పాక్, యూఏఈ మధ్య మూడు వన్డేలు జరిగినా... టి20 మ్యాచ్లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. మరోసారి పిచ్ ఆరంభంలో పేస్ బౌలింగ్కు అనుకూలించే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం