-
ఈ పొదరిల్లు..ఎండలపై ఎక్కుపెట్టిన విల్లు..
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : ఎండలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గాలి సూర్యుడు నిశ్వాసలా వేడెక్కుతోంది. తరువుల నీడ తల్లుల చల్లని స్పర్శలా అనిపిస్తోంది. అలాంటిది సూర్యకిరణాన్ని కనీసంగానైనా చొరబడనివ్వనంత దట్టంగా లతలు అల్లుకున్న పొదరిల్లు ఇంకెంత హాయిగా ఉంటుంది! వినూత్నంగా ఆలోచించడంలో ఎప్పుడూ ముందుండే కడియం ప్రాంత నర్సరీ రైతులు వేసవి తీవ్రత కాచుకునేందుకు కూడా కొత్త కవచాలను కనిపెడుతుంటారు. వేసవిలో ఎండలను తట్టుకోలేని సున్నితమైన మొక్కలను కాపాడుకునేందుకు వాటికి నీడను ఇచ్చేందుకు అవిసె, మొక్కజొన్న వంటి మొక్కలను ఇప్పటికే వేసారు. నర్సరీల్లో విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిని షెడ్ల మీదికి క్రీపర్జాతి మొక్కల లతలను పాకించి, దట్టమైన, పచ్చని పైకప్పులా అల్లుకునేలా చేస్తున్నారు. కడియం మండలం బుర్రిలంకలోని శ్రీ శేషాద్రి నర్సరీలోని షెడ్డు.. పైన మొత్తం క్రీపర్ జాతి మొక్క అల్లుకోవడంతో చల్లని పొదరిల్లులా మారింది. ఎండ మండే వేళ ఈ షెడ్లో చేరితే.. భూమితల్లి పచ్చని చీరకొంగు కప్పిన అనుభూతి కలుగుతుంది. జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని ఈ పచ్చని పర్ణశాల ఆకట్టుకుంటోంది. -
ఉద్యానంపై కరువు దెబ్బ
► భారీగా పడిపోతున్న దిగుబడులు ► కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి ► పూలు, పండ్ల రైతుల పరిస్థితీ అంతే.. ► టమాటా పంటపై అధిక ప్రభావం వర్షాభావ పరిస్థితులు ఉద్యాన పంటల్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా కరువు ప్రభావంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో బోరుబావులపై ఆధారపడిన ఉద్యాన సాగు ప్రస్తుతం సంకటంలో పడింది. ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలో 12,332 హెక్టార్లలో వివిధ రకాల కూరగాయ పంటలు, 4,090 హెక్టార్లలో పండ్లు, పూలతోటలు సాగవుతున్నాయి. తాజాగా వాతావ రణ మార్పులు, వర్షాలలేమి, బోర్లు ఇంకిపోవడం వంటివి ఉద్యాన పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా జిల్లాలో ఈ సీజన్లో 86,944 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తి కావాల్సి ఉండగా.. అందులో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో అన్నిప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట టమాటా. ప్రస్తుత రబీలో 1,976 హెక్టార్లలో ఈ పంట సాగవుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఒక హెక్టారు విస్తీర్ణంలో 44 మెట్రిక్ టన్నుల టమాటా దిగుబడి వస్తుంది. నీటి శాతం అత్యధికంగా వినియోగమయ్యే ఈ పంటకు డిమాండ్ కూడా బాగానే ఉంది. ఇందులో 80శాతం దిగుబడులు మహానగరంలోని రైతుబజార్లకే తరలుతాయి. తాజా వర్షాభావ పరిస్థితులు టమాటా పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వర్షాలు లేకపోవడం.. పగటిపూట తేమశాతం తగ్గడంతో పంటలకు తెగుళ్లు సోకుతున్నాయి. ఫలితంగా మూడోవంతు దిగుబడి తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 86,944 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తి కావాల్సి ఉండగా.. అందులో ఏకంగా 30 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఉల్లి, క్యారెట్ పంటల పైనా.. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ డివిజన్లలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి, క్యారెట్ పంటలపైనా కరువు తీవ్రత కనిపిస్తోంది. రబీ సీజన్లో జిల్లాలో 1,970 హెక్టార్లలో ఉల్లి, 1,236 హెక్టార్లలో క్యారెట్ పంటలు సాగ వుతున్నాయి. ప్రస్తుతం ఉల్లి సాగు గణనీయంగా పడిపోయింది. ఇప్పటివరకు 1,101 హెక్టార్లలో మాత్రమే సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఉల్లి దిగుబడి సాధారణం కంటే సగానికి పడిపోనుంది. అదేవిధంగా క్యారెట్ పంటలు సాగుచేస్తున్న ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. చేవెళ్ల మండలం గుండాల గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి తనకున్న ఆరెకరాల పొలానికి అదనంగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని క్యారెట్ పంట సాగుచేశాడు. అందులో నాలుగు బోర్లు వేయగా చుక్కనీరు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అర ఎకరాలో వంద బస్తాల మేర వచ్చే క్యారెట్ దిగుబడి.. 30 బస్తాలకు పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా జిల్లాలో కరువు పరిస్థితులు రైతుకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. క్యాబేజీకి రాం రాం.. యాచారం మండలం గున్గల్కు చెందిన బాసాని నర్సిరెడ్డి మూడెకరాల్లో క్యాబేజీ పంట సాగుచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం క్యాబేజీ పంట సాగుచేస్తే ఎకరాకు రూ.లక్ష వరకు ఆర్జించాడు. దీంతో అప్పటినుంచి క్యాబేజీపై ప్రత్యేక దృష్టి సారించాడు. గత రెండేళ్లుగా కరువు వెంటాడుతుండడంతో దిగుబడి భారీగా తగ్గుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంటను చీడపీడలు ఆశిస్తున్నాయి. వేరుకుళ్లు పురుగు అధికమవుతోంది. ఎన్ని సార్లు పురుగు మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడం లేదు. ఎకరా పొలంలో సాగు కోసం రూ.40 వేలు ఖర్చు చేస్తే.. కనీసం రూ.20 వేలు కూడా చేతికందడం లేదు. దిగుబడి తగ్గిపోయింది ఇతను నర్సింహారెడ్డి. షాబాద్ మండలం పోలారం. పదేళ్లుగా వంగ పంట సాగుచేస్తున్న ఇతను ఈ ఏడాది రెండెకరాల్లో వేశాడు. ప్రస్తుతం దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చే దిగుబడి.. ఇప్పుడు 15 క్వింటాళ్లకు పడిపోయింది. గతంలో మూడు రోజుల నిడివితో చేతికొచ్చే పంట.. ఇప్పుడు వారం రోజుల సమయం తీసుకుంటోంది. బోరులో నీటి మోతాదు తగ్గడం.. వాతావరణంలో వచ్చిన మార్పులతో లాభాల పోయి నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు తెగుళ్లు సోకాయి.. మంచాల మండలం జాపాలకు చెందిన యాట మల్లేష్ మూడున్నరెకరాల్లో కూరగాయ పంటలే సాగు చేస్తున్నాడు. ఎకరాలో టమాటా, మరో ఎకరాలో బెండ వేశాడు. ఇటీవల నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలో భారీ వ్యత్యాసం కారణంగా టమాటా పంటకు తెగుళ్లు సోకాయి. గతంలో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఇప్పుడది సగానికి సగం పడిపోయింది. టమాటా పంట ఎకరా సాగుకు కనిష్టంగా రూ.12 వేలు ఖర్చవుతుండగా.. అందులో సగం వచ్చే పరిస్థితి లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement