breaking news
Anakapalli MP
-
అభ్యర్థుల కంటే నోటాకే అధికం
యలమంచిలి రూరల్: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ, వైఎస్సార్సీపీ వంటి ప్రధాన పారీ్టల అభ్యర్థులను మినహాయిస్తే ఇతర పారీ్టలు, స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ప్రజల మద్దతును పొందడంలో విఫలమైన ఆ 13 మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు. వారికి పోలైన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉండడం విశేషం. పలకా శ్రీరామ్మూర్తికి 19,157, వేది వెంకటేష్ కు 24,833, నమ్మి అప్పలరాజుకు 2589, ఆడారి శరత్ చంద్రకు 1886, వడ్లమూరి కృష్ణస్వరూప్కు 3549, కర్రి విజయలక్ష్మికి 1578, తుమ్మగుంట అప్పలనాయుడుకు 1055, గారా సత్యారావుకు 3116, జున్నూరి జె శ్రీనివాస్కు 1195, డాక్టర్ తుమ్మపాల హరిశంకర్కు 1567, పెట్ల నాగేశ్వర్రావుకు 2179, సిద్ధా లోవరాజుకు 3845, వంకాయల రామచంద్రరావుకు 4001 ఓట్లు పోలవ్వగా వీరందరి కంటే అధికంగా నోటాకు 26,235 ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా మాడుగులలో 4880 ఓట్లు, అత్యల్పంగా అనకాపల్లిలో 1924 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అసెంబ్లీల పరిధిలో నోటాకు వచ్చిన ఓట్లు 20,111 జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రెండు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 4,107 రాగా..అత్యల్పంగా అనకాపల్లిలో 1,853 వచ్చాయి. యలమంచిలిలో 2,409, చోడవరంలో 3,849, మాడుగులలో 4,070, నర్సీపట్నంలో 3,824.. మొత్తం 20,111 ఓట్లు నోటాకు పడ్డాయి. -
అనకాపల్లిలో ఎన్నికల జోరు
-
వీళ్లు పెద్ద ముదుర్లు..! సీఎం రమేష్, చంద్రబాబు ఒకరికొకరు
భారతీయ జనతా పార్టీ దేశంలో పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు అనకాపల్లి అభ్యర్ధి సీఎం రమేష్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ కావచ్చు. రమేష్ తనకు ఉన్న అర్ధ,హంగు బలంతో అనకాపల్లి వద్ద పోలీసులపై తిరగబడ్డ తీరు ఆశ్చర్యం ఏమీ కాదు. ఆయన గత చరిత్ర ఒకసారి చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. ఒక చిన్న సారాయి వ్యాపారిగా ఉన్న సీఎం రమేష్ ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి. రాజకీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఒక నేతగా చలామణి అవుతున్నారు. తనపై ఎన్ని ఆరోపణలు ఉన్నా దేశ ప్రధానమంత్రి ఎదుట కూర్చోగలుగుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి సరసన నిలబడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు ఉంది. అందులోనే ఆయన నివసిస్తారు. ఆయన సీఎం పదవి చేపట్టాక తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని తన రాజకీయ అవసరాల కోసం తీసుకున్నారు. అందులో సర్వే కార్యకలాపాలు నిర్వహించేవారికి, పార్టీ పనులు ,ఇతరత్రా వినియోగించేవారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత కాలంలో సీఎం రమేష్ ఆ ఇంటిని కొనుగోలు చేసి ఒక భారీ భవంతి ని నిర్మించారు. చంద్రబాబు పాత ఇల్లుకన్నా సీఎం రమేష్ ఇల్లే సూపర్గా కనిపించేది. ఆ తర్వాతకాలంలో చంద్రబాబు కుటుంబం కూడా మళ్లీ తమ ఇంటిని పునర్మించుకున్నారు. అంతేకాదు.చంద్రబాబు వాస్తు నమ్మకాల కోసం రమేష్ కొన్న ఇంటి స్థలం నుంచి 400 గజాలు తీసుకున్నారు. ఒక మాట ఎవరైనా అంగీకరించాలి. సీఎం రమేష్ ఎదుగుదలలో చంద్రబాబుకు పెద్ద పాత్రే ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నిత్యం ఆయన కార్యాలయం చుట్టూనే రమేష్ తిరుగుతుండేవారు. ఒక మీడియా ప్రముఖుడితో కలిసి పైరవీలు,ఇతర లావాదేవీలు సాగించేవారని చెబుతారు. ఈ మీడియా ప్రముఖుడికి, రమేష్కు జిగినీ దోస్తి ఏర్పడింది. ఒకసారి సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదించినప్పుడు ఆ మీడియా ప్రముఖుడికి కోపం వచ్చింది. తన సన్నిహితుడు సీఎమ్ రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వకుండా సుజనాకు ఇస్తారా అని ఆగ్రహించి, సుజనాపై ఒక పెద్ద వ్యతిరేక స్టోరీని బ్యానర్గా ఇచ్చారు.అందులో సుజనాకుఉన్న బోగస్ కంపెనీలు ఇతరత్రా అనేక విషయాలను ప్రచురించారు. దాంతో చంద్రబాబు రాజీ చేసుకుని, సీఎమ్ రమేష్కు తదుపరి టర్మ్లో పదవి ఇవ్వవలసి వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. రమేష్ తండ్రి కుప్పంలో సారా వ్యాపారం చేస్తుండేవారు.అప్పటికి ఇంకా చిన్నవాడు అయిన రమేష్ కుప్పంలో చదివేవాడట. తదుపరి అతను రైల్వే కోడూరులో ఇంటర్ వరకు చదివారట. ఆ తర్వాత పదేళ్లకు ఈయన యువకుడు అయి వ్యాపారంలోకి వచ్చారు. ఆ క్రమంలో రాయదుర్గం నుంచి సారా సాచెట్లు తెప్పించి వాటిలో సారా నింపి తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తుండగా, తండ్రితో సహా రమేష్ను పోలీసులు అరెస్టు చేశారని ఆయన గురించి తెలిసినవారు గుర్తు చేస్తున్నారు. మరో కేసులో సీఎం రమేష్ తండ్రిని పి.డి చట్టం కింద కూడా అరెస్టు చేసి చంచల్ గూడ జైలులో ఉంచారట. ఈ దశలో రాజకీయ రంగంలో ముఖ్యులను ఆశ్రయించితే కేసుల నుంచి బయటపడవచ్చని తెలుసుకున్న రమేష్ అప్పట్లో కడప జిల్లాలో మంత్రిగా ఉన్న ఒక కాంగ్రెస్ నేతతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆయన కూడా సాయం చేసి వీరిని కేసుల నుంచి బయటపడేశారు. అప్పటికి చంద్రబాబుతో రమేష్కు పెద్దగా సంబంధాలు లేవు. ఆ రోజుల్లో అసెంబ్లీలో కూడా రమేష్ ,ఆయన తండ్రిపై వచ్చిన ఆరోపణలను,వారిని రక్షించిన కాంగ్రెస్ మంత్రికి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు మద్య అసెంబ్లీలో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అప్పట్లో రమేష్ సన్నిహితులతో మంత్రికి ఉన్న సంబంధం పై ఆరోపణలు గుప్పించగా, చంద్రబాబుపైనే మంత్రి ప్రత్యారోపణలు చేశారు. చంద్రబాబును కూడా రమేష్ ఆకట్టుకోవడానికి ప్లాన్ చేసి సఫలం అయ్యారు. చంద్రబాబు తిరుపతి వస్తుంటే ,అక్కడ పత్రికలలో స్వాగత ప్రచార ప్రకటనలు ప్రచురించారట. దాంతో చంద్రబాబుకు ఈయనపై ఆసక్తి కలిగి టచ్లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య ఆర్ధిక సంబంధం ఏర్పడింది. తదుపరి అది రాజకీయ సంబంధంగా కూడా మారింది. ఇంతలో చంద్రబాబు తన మామ ఎన్.టి.రామారావును కూలదోసి ముఖ్యమంత్రి కావడంతో రమేష్ తన పట్టు బిగించడం ఆరంభించారు.పైరవీల స్థాయి నుంచి కాంట్రాక్టర్ అవతారం ఎత్తగలిగారు. కుప్పంలో ఎన్నికలు జరిగినప్పుడు పోట్లదుర్తి నుంచి ఒక వందమందిని తీసుకుని వెళ్లి చంద్రబాబు కోసం పనిచేసేవారట. దొంగ ఓట్లు మొదలు వివిధ కార్యకలాపాలను ఈ బృందం నిర్వహించేదట. ఆ రకంగా చంద్రబాబుతో బంధం పెనవేసుకుని పోయింది. చంద్రబాబు కూడా ఈయనకు ఇరిగేషన్ తదితర కాంట్రాక్టులు వచ్చేందుకు సహకరించారన్న ప్రచారం ఉంది. ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆర్ధిక సామాజ్రాన్ని ఏర్పరచుకోగలిగారు.వందల ఎకరాల భూములు సంపాదించారు. హైదరాబాద్లో స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. ఒక విమానం కొనుగోలు చేసే దశకు వెళ్లగలిగారు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు వేణు ఈయనపై ఒక ఫిర్యాదు చేస్తూ 450 కోట్ల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, వాటిలో కొంతమేర ఎగవేయడం తదితర ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో తన ఇంటికి వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారులపై కూడా దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం సీఎం రమేష్, సుజనా చౌదరి వంటివారిపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని, ఐటీ, సీబీఐ అక్రమ దాడులు చేస్తోందని ఆరోపించేవారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడంతో సీఎమ్ రమేష్ ,సుజనా చౌదరి , టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు వెంటనే బీజేపీలో చేరిపోయారు. అప్పటివరకు బీజేపీని తిట్టిన రమేష్, సుజనాలు తమపై ఉన్న ఆర్దిక నేరారోపణల నేపథ్యంలో జాగ్రత్తపడ్డారని అంతా భావించారు. బీజేపీలో చేరిన వెంటనే వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట కూర్చుని తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచారు. బీజేపీలోలో చేరితే ఎన్ని ఆరోపణలు ఉన్నా పునీతులు అయిపోతారా అన్న ప్రశ్న ఆ రోజే వచ్చింది.అక్కడ నుంచి మెల్లగా బీజేపీ పెద్దలను మంచి చేసుకుంటూ రమేష్ కాని, సుజనా చౌదరి కాని చంద్రబాబు తరపున పనిచేస్తుంటారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి ఆ పదవి వచ్చేలా చేసుకోగలిగారు. ఆ తర్వాత బీజేపీపై మరింత పట్టు బిగించారు. ఇదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్ను వ్యతిరేకించిన ఆయన చెల్లెలు షర్మిలకు కూడా తన విమానం సమకూర్చి ఢిల్లీకి పంపించి కాంగ్రెస్లో చేర్పించడానిక సహకరించారని అంటారు. ఈ రకంగా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ను చంద్రబాబు రెండుసార్లు రాజ్యసభకు పంపించారు. ఆ పదవి ద్వారా ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రముఖులతో సంబంధబాంధవ్యాలు పెట్టుకోవడంలో నేర్పరిగా రమేష్ పేరుపొందారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీపై కూడా పట్టు సాధించి అనకాపల్లి నుంచి ఆ పార్టీ పక్షాన పోటీచేయడానికి సిద్దం అయ్యారు. 2014 లో జగన్ మాతృమూర్తి విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు పోటీచేశారు. అప్పట్లో తెలుగుదేశం ఒక ప్రణాళిక ప్రకారం ఒక తప్పుడు ప్రచారం చేసింది. ఆయా హోటళ్ల వద్ద, కూడళ్లలో ,నలుగురు కూర్చున్న చోటకు ప్రత్యేకంగా నియమితులైన టీడీపీ కార్యకర్తలతో,నారాయణ సంస్థల సిబ్బందితో కడప నుంచి వచ్చిన వారిని ఎన్నుకుంటే విశాఖలో భూములు ఆక్రమిస్తారు..గొడవలు చేస్తారు..అంటూ ప్రచారం చేయించింది. దాని ప్రభావం కూడా అప్పట్లో కొంత పడింది. ఫలితంగా విజయమ్మ ఓటమి పాలయ్యారు. విశేషం ఏమిటంటే అదే కడప జిల్లాకు చెందిన సీఎమ్ రమేష్ అనకాపల్లి నుంచి పోటీచేస్తున్నారు. తన స్వస్థలం పోట్లదుర్తి నుంచి సుమారు ఏభై మందిని అక్కడకు తరలించి ప్రచార,ఇతర కార్యాకలాపాలలో పెట్టుకున్నారట. అలాగే టీడీపీకి చెందిన నేతలకు తగు ఆర్ధిక వనరులు సమకూర్చి టీడీపీలో ఉన్న అసమ్మతిని తగ్గించుకునేందుకు కృషి చేశారట.ఈ క్రమంలో తనకు ఎదురు లేదని భావించిన సీఎం రమేష్ అక్కడ పోలీసు అధికారులను భయపెట్టేలా వ్యవహరించారు. చోడవరం వద్ద జీఎస్టీ ఎగవేతకు సంబందించి తనిఖీలకు అధికారులు వెళ్లగా, ఆ సంస్థ యజమాని సీఎమ్ రమేష్కు ఫోన్ చేసి రప్పించారు. ఆయన రావడంతో సీన్ సృష్టించి అధికారులు వెళ్లిపోయేలా చేశారు. విజయమ్మ ఆ ప్రాంతంలో పోటీచేసినప్పుడు ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగలేదు. అయినా టీడీపీ, బీజేపీ అలా అసత్య ప్రచారం చేశాయి. ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలో చేరి అనకాపల్లిలో పోటీచేస్తున్న సీఎం రమేష్ మాత్రం తన స్వరూపాన్ని బహిర్గతం చేశారు. దీనిని అనకాపల్లి ప్రాంత ప్రజలు సహిస్తారా? అన్నది అనుమానం. అసలే స్తానికుడు కాదన్న భావన ఉంటే,దానికి తోడు రమేష్ ,ఆయన మనుషులు దౌర్జన్యాలు చేస్తారేమో అన్న భయం ఏర్పడితే అది ఆయనకు మరింత నష్టం కలిగించవచ్చు. సీఎం రమేష్ టీడీపీ రాజకీయాలలో ఒక కీలకమైన వ్యక్తిగా,చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఇప్పటికీ కొనసాగగలుగుతున్నారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకుని పైకి వస్తే ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కాని అడ్డదారుల ద్వారా వేగంగా ఎదిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. తమ వద్ద ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించి వీలైనంతమందిని వీరు ఆకట్టుకోగలుగుతారు. ఒక చిన్న సారా వ్యాపారి ,ఇంత పెద్ద ఆర్దిక సామ్రాజ్యాన్నిసృష్టించుకోవడం సమాజ వైఫల్యమా? రాజకీయ వ్యవస్థ వైఫల్యమా అంటే ఏమి చెబుదాం? – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన YSRCP
సాక్షి, గుంటూరు: అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థి పేరును వైఎస్సార్సీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు సీఎం జగన్. దీంతో.. మాడుగుల స్థానానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె. గత ఎన్నికల ఫలితాలేంటీ? మాడుగుల స్థానంలో పోటీ చేసిన బూడి ముత్యాలనాయుడు 16392 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి బీశెట్టి వెంకట సత్యవతి 89,192 ఓట్ల మెజార్టీతో గెలిచారు. -
ట్వీటు రాజా? పోటీ లేదా?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు మెగా బ్రదర్స్ అయిన పవన్, నాగబాబు తెగ హడావుడి చేస్తారు. రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ బాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటే... నాగబాబు మాత్రం తానో అపర మేధావి అనుకుంటూ.. ఎక్కడెక్కడో కొటేషన్లో, పిట్టకథలో తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో QR కోడ్ను షేర్ చేసి వంద రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతాడు. అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్కు టచ్లో ఉంటారు. వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడు పవన్ టైపే! పవన్ స్టేజీపై ఊగిపోతూ మాట్లాడితే.. కొణిదెల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చోని ట్విటర్లో ఊగిపోతాడు. పసలేని తన ట్వీట్లతో ఆజ్ఞానంలో మునిగితేలుతూ అభిమానులపై తన జ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు. జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండయ్యా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే.. వారందరినీ వైసీపీ కోవర్ట్లు అంటూ పార్టీ నుంచి వెళ్లిపోండి అంటారు. పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే.. నాగబాబు మాత్రం పేటీఎం స్కానర్ పట్టుకుని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగాబ్రదర్స్ ఇద్దరూ ఇలా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరి కంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు.. అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అన్నయ్యకు పవన్ షాకిచ్చాడు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుతిరిగాడు. అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన నాగబాబు తన షెడ్యూల్కు ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు పెట్టేశాడు. ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాద్కు మకాం మార్చేసి.. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో నాగబాబు ఇంటికే పరిమితం అయి ట్వీట్లు చేసుకుంటూ కాలం గడపుతున్నాడు. వాస్తంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయనది ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు. వారు అనుకున్నదే తర్వాత నిజమైంది. అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువగా క్యూ ఆర్ కోడ్ను చూపించేవారట. వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్కు చెప్పేవారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురైయ్యారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని ఫ్యాన్స్కు అర్థమైంది. నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కేరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే.. మరో కొద్దిరోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అవుతుందని మెగా ఫ్యాన్సే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరూ విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారని పలువురు జోష్యం చెబుతున్నారు. -
అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
-
జెండా ఎత్తేసిన నాగబాబు.. ఓటమి భయమే కారణమా?